వైఎస్ వివేకా హత్య కేసును నీరుగార్చాలని చూస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత ఆలపాటి రాజా ఆరోపణలు గుప్పించారు. వివేకా హత్యపై వైసీపీ ఎన్నో రాజకీయాలు చేసిందని, ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ కేసు దర్యాప్తులో ఎటువంటి పురోగతి లేదని విమర్శించారు. వివేకా హత్య కేసు విచారణపై నాడు తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ప్రస్తుత ప్రభుత్వానికి లేదని, ఇందుకు జగనే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పాలనను, శాంతి భద్రతలను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో విద్యుత్ కొరత లేకుండా చూశామని, జగన్ పాలనలో రాష్ట్రాన్ని అంధకారంగా మారుస్తున్నారని విమర్శలు చేశారు.
మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...
Comments
Post a Comment