Skip to main content

వేయి విద్యుత్ బస్సులు టెండర్లకు ఆహ్వానం


అద్దె ప్రాతిపదికన కొత్తగా వేయి విద్యుత్‌ బస్సులు అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. తొలిదశలో 350 విద్యుత్‌ బస్సులు ప్రవేశపెట్టేందుకు టెండర్లు ఆహ్వానించింది.వేయి విద్యుత్ బస్సులు-టెండర్లకు ఆహ్వానం. రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ బస్సులు నడిపేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అద్దె ప్రాతిపదికన కొత్తగా వేయి విద్యత్ బస్సులు అందుబాటులోకి తెచ్చేందుకు యత్నిస్తోంది. తొలిదశలో 350 విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టేందుకు టెండర్లకు ఆహ్వానించింది.12 ఏళ్లకాలపరిమితితో ఈ బస్సుల నిర్వహణ కోసం టెండర్లు పిలిచింది.ఇందుకు సంబంధించి నిర్వహించిన ప్రీబిడ్‌ సమావేశంలో తొమ్మిదికంపెనీల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.