Skip to main content

వైఎస్ వల్లే పోలవరం ఆలస్యం, జగన్ రాజ్యాంగాన్ని ఫాలో అవ్వడం లేదు: సుజనా చౌదరి ఫైర్

వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు వై సుజనా చౌదరి. ఏపీలో పరిస్థితి దారుణంగా ఉందని ఆరోపించారు. రివర్స్ టెండరింగ్ లో పారదర్శకత కనిపించడం లేదని తూతూ మంత్రంగానే రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తున్నట్లు ఉందన్నారు.

ఇటీవల రివర్స్ టెండరింగ్ ద్వారా నిర్వహించిన హైడల్ ప్రాజెక్టు చూస్తుంటే ప్రాజెక్టు మరింత ఆలస్యం అయ్యే పరిస్థితి ఉందన్నారు. ప్రాజెక్టు పూర్తయ్యే సరికి కనీసం మూడేళ్లు పట్టేయోచ్చన్నారు. 15వేల మెగా వాట్ల విద్యుత్ నష్టం వాటిల్లుతుందని వాటి విలువ 5వేల కోట్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు.

లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించి రూ.300 నుంచి 400 కోట్లు అదనపు ఖర్చు అయ్యే అవకాశం ఉందన్నారు. ఇలా చూస్తుంటూ పోతే ప్రాజెక్టు మరింత ఆలస్యం, అధిక ఖర్చు అవ్వడమే తప్ప రివర్స్ టెండరింగ్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టుపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

పోలవరం ప్రాజెక్టులో నెలకొన్న సమస్యలకు దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి అని ఆరోపించారు. 2009లో నాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పోలవరం ప్రాజెక్టును రీ ఓపెనింగ్ చేయడంతోనే సమస్యలు తలెత్తినట్లు చెప్పుకొచ్చారు. రెండు మూడేళ్లలో భూసేకరణ, నిర్వాసితుల సమస్యలను వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం పూర్తి చేసి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదన్నారు.

2013 ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అవసరమయ్యే పరిస్థితి ఉండేది కాదన్నారు. ఆనాడు సరిగ్గా తలచుకుని ఉంటే కేవలం రూ.10వేల కోట్లతోనే ప్రాజెక్టు పూర్తి అయ్యేదని సుజనా చౌదరి ఆరోపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు కాలయాపన అవుతూనే ఉందన్నారు.

పోలవరం ప్రాజెక్టు లెఫ్ మెయిన్ కెనాల్, రైట్ మెయిన్ కెనాల్ పూర్తి చేసుకుని గ్రావిటీ ద్వారా నీరందిస్తే రైతులకు ఎంతో ఉపయోగపరంగా ఉంటుందన్నారు. అలా వ్యవహరించకుండా ప్రభుత్వం ఇష్టానుసారం వ్యవహరిస్తోందని సుజనా చౌదరి ఆరోపించారు.

భారత రాజ్యాంగం ప్రకారం వైసీపీ ప్రభుత్వం నడుచుకోవడం లేదన్నారు. ఎంతో నమ్మకంతో ప్రజలు ఓటేశారని దాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ మండిపడ్డారు. రాబోయే రోజుల్లో యువతీ యువకులకు నష్టం చేకూరేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి చూస్తుంటే చాలా దారుణంగా ఉందన్నారు. కంపెనీలు పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు రావడం లేదని ఆరోపించారు. బ్యాంకర్లు సైతం ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకు రావడం లేదన్నారు.

పీపీఏల పున: సమీక్ష వల్ల ఏ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టే పరిస్థితి ఉండదన్నారు. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుంటి పడిపోయిందన్నారు. కొత్త ఇసుక పాలసీ ఎందుకు అమలు చేయడం లేదో కూడా ప్రభుత్వం చెప్పలేకపోతుందని విమర్శించారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...