Skip to main content

వైఎస్ వల్లే పోలవరం ఆలస్యం, జగన్ రాజ్యాంగాన్ని ఫాలో అవ్వడం లేదు: సుజనా చౌదరి ఫైర్

వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు వై సుజనా చౌదరి. ఏపీలో పరిస్థితి దారుణంగా ఉందని ఆరోపించారు. రివర్స్ టెండరింగ్ లో పారదర్శకత కనిపించడం లేదని తూతూ మంత్రంగానే రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తున్నట్లు ఉందన్నారు.

ఇటీవల రివర్స్ టెండరింగ్ ద్వారా నిర్వహించిన హైడల్ ప్రాజెక్టు చూస్తుంటే ప్రాజెక్టు మరింత ఆలస్యం అయ్యే పరిస్థితి ఉందన్నారు. ప్రాజెక్టు పూర్తయ్యే సరికి కనీసం మూడేళ్లు పట్టేయోచ్చన్నారు. 15వేల మెగా వాట్ల విద్యుత్ నష్టం వాటిల్లుతుందని వాటి విలువ 5వేల కోట్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు.

లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించి రూ.300 నుంచి 400 కోట్లు అదనపు ఖర్చు అయ్యే అవకాశం ఉందన్నారు. ఇలా చూస్తుంటూ పోతే ప్రాజెక్టు మరింత ఆలస్యం, అధిక ఖర్చు అవ్వడమే తప్ప రివర్స్ టెండరింగ్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టుపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

పోలవరం ప్రాజెక్టులో నెలకొన్న సమస్యలకు దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి అని ఆరోపించారు. 2009లో నాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పోలవరం ప్రాజెక్టును రీ ఓపెనింగ్ చేయడంతోనే సమస్యలు తలెత్తినట్లు చెప్పుకొచ్చారు. రెండు మూడేళ్లలో భూసేకరణ, నిర్వాసితుల సమస్యలను వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం పూర్తి చేసి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదన్నారు.

2013 ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అవసరమయ్యే పరిస్థితి ఉండేది కాదన్నారు. ఆనాడు సరిగ్గా తలచుకుని ఉంటే కేవలం రూ.10వేల కోట్లతోనే ప్రాజెక్టు పూర్తి అయ్యేదని సుజనా చౌదరి ఆరోపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు కాలయాపన అవుతూనే ఉందన్నారు.

పోలవరం ప్రాజెక్టు లెఫ్ మెయిన్ కెనాల్, రైట్ మెయిన్ కెనాల్ పూర్తి చేసుకుని గ్రావిటీ ద్వారా నీరందిస్తే రైతులకు ఎంతో ఉపయోగపరంగా ఉంటుందన్నారు. అలా వ్యవహరించకుండా ప్రభుత్వం ఇష్టానుసారం వ్యవహరిస్తోందని సుజనా చౌదరి ఆరోపించారు.

భారత రాజ్యాంగం ప్రకారం వైసీపీ ప్రభుత్వం నడుచుకోవడం లేదన్నారు. ఎంతో నమ్మకంతో ప్రజలు ఓటేశారని దాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ మండిపడ్డారు. రాబోయే రోజుల్లో యువతీ యువకులకు నష్టం చేకూరేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి చూస్తుంటే చాలా దారుణంగా ఉందన్నారు. కంపెనీలు పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు రావడం లేదని ఆరోపించారు. బ్యాంకర్లు సైతం ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకు రావడం లేదన్నారు.

పీపీఏల పున: సమీక్ష వల్ల ఏ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టే పరిస్థితి ఉండదన్నారు. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుంటి పడిపోయిందన్నారు. కొత్త ఇసుక పాలసీ ఎందుకు అమలు చేయడం లేదో కూడా ప్రభుత్వం చెప్పలేకపోతుందని విమర్శించారు.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

ఒక్కో రైతుకు రూ.18,500 ఇవ్వాలి: పవన్‌

 రైతు భరోసా పథకాన్ని పీఎమ్‌ కిసాన్‌ యోజన పథకంతో ముడిపెట్టి అమలు చేస్తున్న జగన్‌.. తన ఎన్నికల వాగ్దానానికి సంపూర్ణత్వం సాధించలేక పోయారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. ప్రతి రైతు కుటుంబానికి  ఏడాదికి రూ.12,500  అందిస్తామని నవరత్నాలలో, ఎన్నికల ప్రణాళికలో ఘనంగా ప్రకటించి... కేంద్రం ఇస్తున్న రూ.6000 కలిపి రూ.13,500 ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నవరత్నాలు ప్రకటించినప్పుడు కేంద్ర ఇచ్చే సాయంతో కలిపి ఇస్తామని ఎందుకు ప్రకటించలేదని నిలదీశారు. రైతులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం రూ.12,500లకు కేంద్ర సాయం రూ.6000 కలిపి రూ.18,500 చొప్పున  రైతులకు పంపిణీ చేయాలని పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. ఒక వేళ అంతమొత్తం ఇవ్వలేకపోతే  అందుకు కారణాలను రైతులకు చెప్పి,  వాగ్దానం ప్రకారం ఇవ్వనందుకు మన్నించమని అడగాలని పేర్కొన్నారు.