ఏపీ రాజధాని అమరావతికి రైల్వే అనుసంధానికి త్వరలోనే చర్యలు తీసుకుంటామని దక్షిణమధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా తెలిపారు. రాష్ట్ర ఎంపీలు ఇచ్చిన ప్రతిపాదనలపై మాట్లాడిన జీఎం కొత్త రైళ్లు, పెండింగ్ పనులు, ఆర్ఓబీ, ఆర్యూబీపై ప్రతిపాదనలు వచ్చాయని, రైల్వేస్టేషన్లలో సదుపాయాలు, స్టాంపుల పెంపుపై చర్చించామన్నారు. ఎంపీలు లేవనెత్తిన సమస్యలలో తమ పరిధిలోని సమస్యలను పరిష్కరిస్తామన్న జీఎం పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను సత్వరమే పూర్తిచేసేందుకు చర్యలు చేపడతామన్నారు. వాల్తేరు డివిజన్ ను విశాఖలో ఉంచాలని ఎంపీలు కోరారని అది రైల్వే బోర్డు పరిధిలోని అంశమన్నారు.
మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...
Comments
Post a Comment