ఏపీ రాజధాని అమరావతికి రైల్వే అనుసంధానికి త్వరలోనే చర్యలు తీసుకుంటామని దక్షిణమధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా తెలిపారు. రాష్ట్ర ఎంపీలు ఇచ్చిన ప్రతిపాదనలపై మాట్లాడిన జీఎం కొత్త రైళ్లు, పెండింగ్ పనులు, ఆర్ఓబీ, ఆర్యూబీపై ప్రతిపాదనలు వచ్చాయని, రైల్వేస్టేషన్లలో సదుపాయాలు, స్టాంపుల పెంపుపై చర్చించామన్నారు. ఎంపీలు లేవనెత్తిన సమస్యలలో తమ పరిధిలోని సమస్యలను పరిష్కరిస్తామన్న జీఎం పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను సత్వరమే పూర్తిచేసేందుకు చర్యలు చేపడతామన్నారు. వాల్తేరు డివిజన్ ను విశాఖలో ఉంచాలని ఎంపీలు కోరారని అది రైల్వే బోర్డు పరిధిలోని అంశమన్నారు.
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Comments
Post a Comment