ఏపీ రాజధాని అమరావతికి రైల్వే అనుసంధానికి త్వరలోనే చర్యలు తీసుకుంటామని దక్షిణమధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా తెలిపారు. రాష్ట్ర ఎంపీలు ఇచ్చిన ప్రతిపాదనలపై మాట్లాడిన జీఎం కొత్త రైళ్లు, పెండింగ్ పనులు, ఆర్ఓబీ, ఆర్యూబీపై ప్రతిపాదనలు వచ్చాయని, రైల్వేస్టేషన్లలో సదుపాయాలు, స్టాంపుల పెంపుపై చర్చించామన్నారు. ఎంపీలు లేవనెత్తిన సమస్యలలో తమ పరిధిలోని సమస్యలను పరిష్కరిస్తామన్న జీఎం పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను సత్వరమే పూర్తిచేసేందుకు చర్యలు చేపడతామన్నారు. వాల్తేరు డివిజన్ ను విశాఖలో ఉంచాలని ఎంపీలు కోరారని అది రైల్వే బోర్డు పరిధిలోని అంశమన్నారు.
వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్పైవెళ్తున్న చాపర్తిన శేఖర్ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్ హైవే అంబులెన్స్ ద్వారా విజయవాడ ఈఎస్ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్ పక్కకు తొలగి అంబులెన్స్కు దారి ఇచ్చింది.
Comments
Post a Comment