Skip to main content

ఇండియా గాంధీ ఎవరు...? శశిథరూర్ ని ఏకిపారేస్తున్న నెటిజన్లు

'Who's India Gandhi?' Netizens Question Shashi Tharoor's Gaffe on Twitter

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ఇండియా గాంధీ ఎవరో చెప్పాలంటూ నెటిజన్లు ఆయనను డిమాండ్ చేస్తున్నారు. ఇందిరా గాంధీ తెలుసు.. ఈ ఇండియా గాంధీ ఎవరూ అనే సందేహం మీకు కూడా కలిగిందా..? శశిథరూర్ చేసిన బ్లండర్ మిస్టేక్ ఇది.
ఇంతకీ మ్యాటరేంటంటే.... ప్రస్తుతం ప్రధాని నరంద్రమోదీ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా... ఆయన పర్యటనపై గత రెండు రోజులుగా శశిథరూర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూనే ఉన్నారు.  ' భారత ప్రతినిథిగా విదేశాలను సందర్శించినప్పుడు ప్రధాని మోడీ గౌరవం పొందాలి, అయితే స్వదేశంలో ఉన్నప్పుడు మాత్రం ఆయనను ప్రశ్నించే హక్కు ప్రజలకుంది' అంటూ శశిథరూర్ ట్వీట్ చేశారు. ఆయన చేసిన ఈ ట్వీట్ చాలా మంది కాంగ్రెస్ నేతలను కూడా విస్మయానికి గురిచేసింది.
ఆ విషయం పక్కన పెడితే... తమ పార్టీ పెద్దల గొప్పతనాన్ని ప్రజలకు వివరించాలనే తాపత్రయంలో శశిథరూర్ పెద్ద మిస్టేక్ చేశారు. గతంలో నెహ్రూ, ఇందిరాగాంధీ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు వారికి దక్కిన గౌరవం ఇది అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేశారు. అయితే... ఈ ఫోటోలకు ఇచ్చిన క్యాప్షన్ లో ఇందిరా గాంధీ పేరును  తప్పుగా పేర్కొన్నారు.
ఇందిరాగాంధీకి బదులు ఇండియా గాంధీ అని పేర్కొన్నారు. అంతే... ఆ తప్పును గమనించిన నెటిజన్లు.. శశిథరూర్ ని ఏకిపారేస్తున్నారు. ఎవరీ ఇండియా గాంధీ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరైతే... కాంగ్రెస్ నేతలకు ఇందిరా గాంధీనే ఇండియా గాంధీ అంటూ వెటకారంగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రముఖుల పేర్లు మార్చేయడం కాంగ్రెస్ నేతలకు అలవాటే అంటూ మరికొందరు  కామెంట్స్ చేస్తున్నారు. మొత్తాన్ని తప్పుడు ట్వీట్ తో శశిథరూర్ అడ్డంగా బుక్కయ్యారు. 

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...

కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమే.. యుద్ధం వస్తే మేం సిద్ధం : ఇమ్రాన్‌

జమ్ముకశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. శుక్రవారం నాడు 74వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. ఐరాస వేదికగా కవ్వింపు ప్రకటన చేశారు. కశ్మీర్‌ను కేవలం రాజకీయం కోసం మాత్రమే వాడుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.   ప్రపంచం ఏం చేసింది?.   బాలాకోట్‌లో 500 మంది తీవ్రవాదులు రెడీగా ఉన్నారని ఇండియా రక్షణ మంత్రి చెబుతున్నారు. 500 మంది తీవ్రవాదులను పంపి మేమేం సాధిస్తాం?. 500 మంది తీవ్రవాదులను పంపాల్సిన అవసరం మాకేంటి.?. ఇస్లామిక్ టెర్రరిజం అంటూ ఇండియా మాపై ముద్ర వేస్తుంది. కశ్మీరీల హక్కులు ఎవరికీ పట్టవు. కశ్మీర్‌లో అనుసరిస్తున్న విధానాలు భారత్‌లో ఉన్న ముస్లింలపై ఎలా ప్రభావం చూపుతాయో మోదీ ఆలోచించారా?. 10 లక్షల మంది రోహింగ్యాలను బర్మా నుంచి గెంటేస్తే ప్రపంచం ఏం చేసింది?. ఇలాంటి పరిణామాలే ఇస్లాం సమాజంలో ఆవేదన, అసంతృప్తిని రేపుతున్నాయి ’  అని ఇమ్రాన్ ఆగ్రహ వ్యక్తం చేశారు. యుద్ధం వస్తే మేం సిద్ధం! ‘ ఇప్పుడు చాలా సంక్లిష్టం సమయం నడుస్తోంది. అణ్వాయుధాలున్న రెండు దేశాలు తలపడాల్స...