Skip to main content

ఇండియా గాంధీ ఎవరు...? శశిథరూర్ ని ఏకిపారేస్తున్న నెటిజన్లు

'Who's India Gandhi?' Netizens Question Shashi Tharoor's Gaffe on Twitter

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ఇండియా గాంధీ ఎవరో చెప్పాలంటూ నెటిజన్లు ఆయనను డిమాండ్ చేస్తున్నారు. ఇందిరా గాంధీ తెలుసు.. ఈ ఇండియా గాంధీ ఎవరూ అనే సందేహం మీకు కూడా కలిగిందా..? శశిథరూర్ చేసిన బ్లండర్ మిస్టేక్ ఇది.
ఇంతకీ మ్యాటరేంటంటే.... ప్రస్తుతం ప్రధాని నరంద్రమోదీ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా... ఆయన పర్యటనపై గత రెండు రోజులుగా శశిథరూర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూనే ఉన్నారు.  ' భారత ప్రతినిథిగా విదేశాలను సందర్శించినప్పుడు ప్రధాని మోడీ గౌరవం పొందాలి, అయితే స్వదేశంలో ఉన్నప్పుడు మాత్రం ఆయనను ప్రశ్నించే హక్కు ప్రజలకుంది' అంటూ శశిథరూర్ ట్వీట్ చేశారు. ఆయన చేసిన ఈ ట్వీట్ చాలా మంది కాంగ్రెస్ నేతలను కూడా విస్మయానికి గురిచేసింది.
ఆ విషయం పక్కన పెడితే... తమ పార్టీ పెద్దల గొప్పతనాన్ని ప్రజలకు వివరించాలనే తాపత్రయంలో శశిథరూర్ పెద్ద మిస్టేక్ చేశారు. గతంలో నెహ్రూ, ఇందిరాగాంధీ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు వారికి దక్కిన గౌరవం ఇది అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేశారు. అయితే... ఈ ఫోటోలకు ఇచ్చిన క్యాప్షన్ లో ఇందిరా గాంధీ పేరును  తప్పుగా పేర్కొన్నారు.
ఇందిరాగాంధీకి బదులు ఇండియా గాంధీ అని పేర్కొన్నారు. అంతే... ఆ తప్పును గమనించిన నెటిజన్లు.. శశిథరూర్ ని ఏకిపారేస్తున్నారు. ఎవరీ ఇండియా గాంధీ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరైతే... కాంగ్రెస్ నేతలకు ఇందిరా గాంధీనే ఇండియా గాంధీ అంటూ వెటకారంగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రముఖుల పేర్లు మార్చేయడం కాంగ్రెస్ నేతలకు అలవాటే అంటూ మరికొందరు  కామెంట్స్ చేస్తున్నారు. మొత్తాన్ని తప్పుడు ట్వీట్ తో శశిథరూర్ అడ్డంగా బుక్కయ్యారు. 

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...