Skip to main content

ఇండియా గాంధీ ఎవరు...? శశిథరూర్ ని ఏకిపారేస్తున్న నెటిజన్లు

'Who's India Gandhi?' Netizens Question Shashi Tharoor's Gaffe on Twitter

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ఇండియా గాంధీ ఎవరో చెప్పాలంటూ నెటిజన్లు ఆయనను డిమాండ్ చేస్తున్నారు. ఇందిరా గాంధీ తెలుసు.. ఈ ఇండియా గాంధీ ఎవరూ అనే సందేహం మీకు కూడా కలిగిందా..? శశిథరూర్ చేసిన బ్లండర్ మిస్టేక్ ఇది.
ఇంతకీ మ్యాటరేంటంటే.... ప్రస్తుతం ప్రధాని నరంద్రమోదీ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా... ఆయన పర్యటనపై గత రెండు రోజులుగా శశిథరూర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూనే ఉన్నారు.  ' భారత ప్రతినిథిగా విదేశాలను సందర్శించినప్పుడు ప్రధాని మోడీ గౌరవం పొందాలి, అయితే స్వదేశంలో ఉన్నప్పుడు మాత్రం ఆయనను ప్రశ్నించే హక్కు ప్రజలకుంది' అంటూ శశిథరూర్ ట్వీట్ చేశారు. ఆయన చేసిన ఈ ట్వీట్ చాలా మంది కాంగ్రెస్ నేతలను కూడా విస్మయానికి గురిచేసింది.
ఆ విషయం పక్కన పెడితే... తమ పార్టీ పెద్దల గొప్పతనాన్ని ప్రజలకు వివరించాలనే తాపత్రయంలో శశిథరూర్ పెద్ద మిస్టేక్ చేశారు. గతంలో నెహ్రూ, ఇందిరాగాంధీ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు వారికి దక్కిన గౌరవం ఇది అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేశారు. అయితే... ఈ ఫోటోలకు ఇచ్చిన క్యాప్షన్ లో ఇందిరా గాంధీ పేరును  తప్పుగా పేర్కొన్నారు.
ఇందిరాగాంధీకి బదులు ఇండియా గాంధీ అని పేర్కొన్నారు. అంతే... ఆ తప్పును గమనించిన నెటిజన్లు.. శశిథరూర్ ని ఏకిపారేస్తున్నారు. ఎవరీ ఇండియా గాంధీ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరైతే... కాంగ్రెస్ నేతలకు ఇందిరా గాంధీనే ఇండియా గాంధీ అంటూ వెటకారంగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రముఖుల పేర్లు మార్చేయడం కాంగ్రెస్ నేతలకు అలవాటే అంటూ మరికొందరు  కామెంట్స్ చేస్తున్నారు. మొత్తాన్ని తప్పుడు ట్వీట్ తో శశిథరూర్ అడ్డంగా బుక్కయ్యారు. 

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...