Skip to main content

ప్రభుత్వ లక్ష్యం మేరకు సచివాలయ ఉద్యోగులు పనిచేయాలి : మంత్రి పెద్దిరెడ్డి

వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం సమున్నత ఆశయంతో గ్రామ సచివాలయ వ్యవస్థను అమల్లోకి తెస్తోందని, ప్రభుత్వ లక్ష్యం మేరకు ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. అమరావతిలో ఈరోజు అర్హులైన వారికి నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, ఆ లక్ష్యాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. ముఖ్యమంత్రి అన్ని విషయాల్లో పారదర్శకంగా వ్యవహరిస్తున్నారని అభినందించారు.

ఇదే సమావేశంలో పాల్గొన్న మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఒకేసారి లక్షా 34 వేల మందికి ఉద్యోగాలు కల్పించడం సాధారణ విషయం కాదని, ఉద్యోగాలు పొందిన వారు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మీరు ఎంత బాధ్యతగా పనిచేస్తే ప్రభుత్వానికి అంత పేరు వస్తుందని అన్నారు. గ్రామ సచివాలయ పరీక్షలు ఎంతో పగడ్బందీగా నిర్వహించినప్పటికీ విపక్షాలు విమర్శలు చేయడం బాధాకరమన్నారు.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...