తనకు ఇంత వరకు నోబెల్ శాంతి పురస్కారాన్ని ఇవ్వకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వకపోవడం సరికాదని అన్నారు. తాను ఎంతో చేశానని… తాను చేసిన మంచి పనులకు తనకు ఇప్పటికే నోబెల్ ప్రైజ్ రావాల్సి ఉందని చెప్పారు. పారదర్శకంగా నోబెల్ శాంతి పురస్కారాన్ని ఇచ్చినట్టైతే తనకు ఎప్పుడో అది వచ్చి ఉండేదని… కానీ, వారు పారదర్శకంగా లేరని విమర్శించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు నోబెల్ పీస్ ప్రైజ్ ఎందుకిచ్చారో తనకు అర్థం కావడం లేదని అన్నారు.
నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.
Comments
Post a Comment