Skip to main content

కశ్మీర్ అంశంలో నెహ్రూ తప్ప చేస్తే... ఇందిరా సరిదిద్దారు... మేము పరిష్కరించాం.. అమిత్ షా

జమ్ము కశ్మీర్ విలీనం అంశంపై మరోసారి కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షా మాజీ ప్రధాని నేహ్రూపై తీవ్ర విమర్శలు చేశారు. కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వం కొరడంపై మండిపడ్డారు... కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం ఐరాస మద్దతు కోరారని అది ఆయన వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయమని అన్నారు. కశ్మీర్ సమస్యపై ఎవ్వరితో కనీసం సంప్రదింపులు కూడ జరపలేదని తెలిపారు. ఈ సంధర్భంగా ఆయన వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయమని ఆయన విమర్శించారు. ఇది హిమాలయాల కంటే చాల పెద్దతప్పుని విమర్శించారు.స్వాతంత్ర్యం తర్వాత పటేల్ 630 సంస్థాలను దేశంలో విలీనం చేయగలిగితే, నెహ్రు ఒక్క కశ్మీర్‌ను విలీనం చేయలేక పోయాడని ఆరోపణలు చేశారు. అయితే నెహ్రు అప్పుడు చేయలేని పనిని ప్రస్తుతం బీజేపీ చేసి చూపించిందని అన్నారు. మరోవైపు స్వర్గీయ ప్రధాని ఇంధిరా గాంధిని ఆయన పొగిడారు. సిమ్లా ఒప్పందం ద్వార కశ్మీర్‌ను రెండు దేశాల ద్వైపాక్షిక అంశంగా చేశారని తెలిపారు.
కశ్మీర్‌లోని మొత్తం 196 పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ ఎత్తివేసినట్టు చెప్పారు. కేవలం 8 పోలీస్ స్టేషన్ల పరిధిలోనే 144సెక్షన్ అమలుచేస్తున్నట్టు తెలిపారు. ఇటీవల జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సమావేశంలో కూడ ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని అన్ని దేశాల నేతలు సమర్థించారని చెప్పారు. ఏ ఒక్కరు కూడా భారత్ నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తం చేయలేదన్నారు. ఇది భారత ప్రధాని నరేంద్ర మోడీ సాధించిన విజయం అని ఆయన పేర్కోన్నారు. మరోవైపు ఫోన్లను కట్ చేయడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకు రాదని చెప్పారు.

Comments

Popular posts from this blog

ఎలన్ మస్క్... స్టార్ షిప్ రెడీ... వచ్చే ఏడాది మార్స్ చెంతకు ప్రయాణం

మార్స్ గ్రహంపైకి వన్ వే ట్రిప్‌గా ఆసక్తి ఉన్న ప్రజలను పంపుతానని ప్రకటించిన ఆమెరికా బిలియనీర్ వ్యాపారి ఎలన్ మస్క్... అన్నంత పనీ చేస్తున్నారు. మనుషుల్ని చందమామ, మార్స్ చెంతకు తీసుకెళ్లడం కోసం ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్... సరికొత్త విమానం తరహా స్పేస్ షిప్‌లను తయారుచేస్తోంది. ఇవి రాకెట్‌‌లా కాకుండా... విమానం లాగా... అంతరిక్షంలోకి వెళ్లి... గ్రహాలపై మనుషుల్ని దించేసి... తిరిగి ఖాళీగా వెనక్కి వచ్చేస్తాయి. గ్రహాలపైకి వెళ్లినవాళ్లు తిరిగి వచ్చే అవకాశాలు లేవు. ఇందుకు రిటర్న్ ట్రిప్ అవకాశం కల్పించట్లేదు ఎలన్ మస్క్. వన్ వే ట్రిప్‌గా వెళ్లేందుకు ఆసక్తి ఉన్నవారే టికెట్ బుక్ చేసుకోమని సూచిస్తున్నారు. తాజాగా ఆయన ఆవిష్కరించిన స్పేస్‌షిప్‌లో వంద మంది ప్రయాణించేందుకు వీలుంది. టెక్సాస్... బోకా చికాలో... ఎంతో మంది అంతరిక్ష ఔత్సాహికులు, రిపోర్టర్ల సమక్షంలో చందమామ, మార్స్‌పైకి పంపే స్టార్ షిప్‌ను ఆవిష్కరించారు ఎలన్ మస్క్. వచ్చే ఆరు నెలల్లో దాన్ని అంతరిక్షంలో ఓ రౌండ్ వేయించి... వచ్చే ఏడాది మనుషులను అందులో పంపాలనుకుంటున్నారు ఎలన్ మస్క్. ఎప్పుడో పదకొండు ఏళ్ల కిందట ఫాల్కన్-1 రాకెట్‌ను తయారుచేసింది స్పేస్ ఎక...

క్రెడిట్ పై పెట్రోలును కొనుగోలు చేస్తే నో క్యాష్‌బ్యాక్‌

క్రెడిట్‌ కార్డులను వినియోగించి పెట్రోలును కొనుగోలు చేస్తే ఇన్నాళ్లూ లభిస్తున్న 0.75 శాతం క్యాష్‌బ్యాక్‌ అక్టోబరు ఒకటో తేది నుంచి ఉండబోదని కంపెనీలు ప్ర‌క‌టించాయి.  2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే డిస్కౌంట్‌ ఇవ్వాలని చమురు కంపెనీలను కోరింది. దీంతో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి  2016 డిసెంబరు నుంచి క్రెడిట్‌, డెబిట్‌, ఈ-వాలెట్ల ద్వారా పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేసే వారికి 0.75శాతం డిస్కౌంట్‌ను క్యాష్‌బ్యాక్‌ రూపంలో  ఇవ్వాల‌ని  చమురు కంపెనీలు క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించిన విష‌యం తెలిసిందే. కాగా వచ్చే నెల ఒకటో తేది నుంచి ఆ డిస్కౌంట్‌ ఉండబోదని తాజాగా కంపెనీలు వెల్లడించాయి. ఇకమీదట డెబిట్‌, ఇతర డిజిటల్‌ పద్ధతుల ద్వారా చెల్లించేవారికి మాత్రం ఈ డిస్కౌంట్‌ యధావిధిగా కొనసాగుతుంది.