Skip to main content

కశ్మీర్ అంశంలో నెహ్రూ తప్ప చేస్తే... ఇందిరా సరిదిద్దారు... మేము పరిష్కరించాం.. అమిత్ షా

జమ్ము కశ్మీర్ విలీనం అంశంపై మరోసారి కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షా మాజీ ప్రధాని నేహ్రూపై తీవ్ర విమర్శలు చేశారు. కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వం కొరడంపై మండిపడ్డారు... కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం ఐరాస మద్దతు కోరారని అది ఆయన వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయమని అన్నారు. కశ్మీర్ సమస్యపై ఎవ్వరితో కనీసం సంప్రదింపులు కూడ జరపలేదని తెలిపారు. ఈ సంధర్భంగా ఆయన వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయమని ఆయన విమర్శించారు. ఇది హిమాలయాల కంటే చాల పెద్దతప్పుని విమర్శించారు.స్వాతంత్ర్యం తర్వాత పటేల్ 630 సంస్థాలను దేశంలో విలీనం చేయగలిగితే, నెహ్రు ఒక్క కశ్మీర్‌ను విలీనం చేయలేక పోయాడని ఆరోపణలు చేశారు. అయితే నెహ్రు అప్పుడు చేయలేని పనిని ప్రస్తుతం బీజేపీ చేసి చూపించిందని అన్నారు. మరోవైపు స్వర్గీయ ప్రధాని ఇంధిరా గాంధిని ఆయన పొగిడారు. సిమ్లా ఒప్పందం ద్వార కశ్మీర్‌ను రెండు దేశాల ద్వైపాక్షిక అంశంగా చేశారని తెలిపారు.
కశ్మీర్‌లోని మొత్తం 196 పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ ఎత్తివేసినట్టు చెప్పారు. కేవలం 8 పోలీస్ స్టేషన్ల పరిధిలోనే 144సెక్షన్ అమలుచేస్తున్నట్టు తెలిపారు. ఇటీవల జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సమావేశంలో కూడ ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని అన్ని దేశాల నేతలు సమర్థించారని చెప్పారు. ఏ ఒక్కరు కూడా భారత్ నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తం చేయలేదన్నారు. ఇది భారత ప్రధాని నరేంద్ర మోడీ సాధించిన విజయం అని ఆయన పేర్కోన్నారు. మరోవైపు ఫోన్లను కట్ చేయడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకు రాదని చెప్పారు.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

ఒక్కో రైతుకు రూ.18,500 ఇవ్వాలి: పవన్‌

 రైతు భరోసా పథకాన్ని పీఎమ్‌ కిసాన్‌ యోజన పథకంతో ముడిపెట్టి అమలు చేస్తున్న జగన్‌.. తన ఎన్నికల వాగ్దానానికి సంపూర్ణత్వం సాధించలేక పోయారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. ప్రతి రైతు కుటుంబానికి  ఏడాదికి రూ.12,500  అందిస్తామని నవరత్నాలలో, ఎన్నికల ప్రణాళికలో ఘనంగా ప్రకటించి... కేంద్రం ఇస్తున్న రూ.6000 కలిపి రూ.13,500 ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నవరత్నాలు ప్రకటించినప్పుడు కేంద్ర ఇచ్చే సాయంతో కలిపి ఇస్తామని ఎందుకు ప్రకటించలేదని నిలదీశారు. రైతులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం రూ.12,500లకు కేంద్ర సాయం రూ.6000 కలిపి రూ.18,500 చొప్పున  రైతులకు పంపిణీ చేయాలని పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. ఒక వేళ అంతమొత్తం ఇవ్వలేకపోతే  అందుకు కారణాలను రైతులకు చెప్పి,  వాగ్దానం ప్రకారం ఇవ్వనందుకు మన్నించమని అడగాలని పేర్కొన్నారు.