Skip to main content

బ్యాంకర్లతో పలు అంశాలపై సుదీర్ఘంగా చ‌ర్చ జ‌రిపిన సీఎం జగన్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న‌ రెడ్డి అధ్యక్షతన 208 వ ఎస్ఎల్ బీసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బ్యాంకర్లతో సీఎం వైఎస్‌ జగన్‌ పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న, చేయబోయే పథకాలకు తోడ్పాటునందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం విశ్వసనీయతను నిలబెట్టుకునేలా అడుగులు వేస్తుందన్నారు. ప్రభుత్వం బ్యాంకర్లు కలిస్తేనే క్రెడిబిలిటీ నిలబడుతుందని జగన్ అభిప్రాయపడ్డారు. వివిధ వర్గాలప్రజలకు చేయూతనివ్వడానికి, వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుంది. వివిధ పథకాల కింద ప్రభుత్వం చెల్లిస్తున్న డబ్బు నేరుగా లబ్ధిదారులకు చేరాలన్నారు జగన్. బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డబ్బును మినహాయించుకోకూడదని అందుకోసం అన్ ఇన్ కంబర్డ్ బ్యాంకు ఖాతాలు తెరవాలన్నారు. వడ్డీ లేని రుణాల కింద రైతులకు, డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు డబ్బు చెల్లిస్తుంది.
ఈ విషయం లో బ్యాంకులు ఏం కోరినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని సీఎం జగన్ తెలిపారు. మా ఆర్థిక శాఖతో టచ్ లో ఉండండి వడ్డీ లేని రుణాల కింద చెల్లించవలసిన డబ్బును నిర్దేశించిన సమయానికి చెల్లిస్తాం అని జగన్ పేర్కొన్నారు. గ్రామ వాలంటీర్లు ప్రతి ఇంటికెళ్లి.. సున్నా వడ్డీ కింద ఏవరెవరికి డబ్బు చెల్లించాలో మాకు జాబితా ఇవ్వండి చాలు, వాటిని మేము చెల్లిస్తాం. చిన్న చిన్న దుకాణాలు, తోపుడు బళ్ళ కింద చిరు వ్యాపారాలు చేసేవారికి గుర్తింపు కార్డులు ఇస్తాం. వారిని ప్రోత్సహించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ప్రభత్వం ప్రతినెలా ఒక పథకాన్ని అమలు చేస్తుంది. దీనికి బ్యాంకర్ల సహాయ సహకారాలు అవసరం అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

ఒక్కో రైతుకు రూ.18,500 ఇవ్వాలి: పవన్‌

 రైతు భరోసా పథకాన్ని పీఎమ్‌ కిసాన్‌ యోజన పథకంతో ముడిపెట్టి అమలు చేస్తున్న జగన్‌.. తన ఎన్నికల వాగ్దానానికి సంపూర్ణత్వం సాధించలేక పోయారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. ప్రతి రైతు కుటుంబానికి  ఏడాదికి రూ.12,500  అందిస్తామని నవరత్నాలలో, ఎన్నికల ప్రణాళికలో ఘనంగా ప్రకటించి... కేంద్రం ఇస్తున్న రూ.6000 కలిపి రూ.13,500 ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నవరత్నాలు ప్రకటించినప్పుడు కేంద్ర ఇచ్చే సాయంతో కలిపి ఇస్తామని ఎందుకు ప్రకటించలేదని నిలదీశారు. రైతులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం రూ.12,500లకు కేంద్ర సాయం రూ.6000 కలిపి రూ.18,500 చొప్పున  రైతులకు పంపిణీ చేయాలని పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. ఒక వేళ అంతమొత్తం ఇవ్వలేకపోతే  అందుకు కారణాలను రైతులకు చెప్పి,  వాగ్దానం ప్రకారం ఇవ్వనందుకు మన్నించమని అడగాలని పేర్కొన్నారు.