Skip to main content

బ్యాంకర్లతో పలు అంశాలపై సుదీర్ఘంగా చ‌ర్చ జ‌రిపిన సీఎం జగన్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న‌ రెడ్డి అధ్యక్షతన 208 వ ఎస్ఎల్ బీసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బ్యాంకర్లతో సీఎం వైఎస్‌ జగన్‌ పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న, చేయబోయే పథకాలకు తోడ్పాటునందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం విశ్వసనీయతను నిలబెట్టుకునేలా అడుగులు వేస్తుందన్నారు. ప్రభుత్వం బ్యాంకర్లు కలిస్తేనే క్రెడిబిలిటీ నిలబడుతుందని జగన్ అభిప్రాయపడ్డారు. వివిధ వర్గాలప్రజలకు చేయూతనివ్వడానికి, వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుంది. వివిధ పథకాల కింద ప్రభుత్వం చెల్లిస్తున్న డబ్బు నేరుగా లబ్ధిదారులకు చేరాలన్నారు జగన్. బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డబ్బును మినహాయించుకోకూడదని అందుకోసం అన్ ఇన్ కంబర్డ్ బ్యాంకు ఖాతాలు తెరవాలన్నారు. వడ్డీ లేని రుణాల కింద రైతులకు, డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు డబ్బు చెల్లిస్తుంది.
ఈ విషయం లో బ్యాంకులు ఏం కోరినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని సీఎం జగన్ తెలిపారు. మా ఆర్థిక శాఖతో టచ్ లో ఉండండి వడ్డీ లేని రుణాల కింద చెల్లించవలసిన డబ్బును నిర్దేశించిన సమయానికి చెల్లిస్తాం అని జగన్ పేర్కొన్నారు. గ్రామ వాలంటీర్లు ప్రతి ఇంటికెళ్లి.. సున్నా వడ్డీ కింద ఏవరెవరికి డబ్బు చెల్లించాలో మాకు జాబితా ఇవ్వండి చాలు, వాటిని మేము చెల్లిస్తాం. చిన్న చిన్న దుకాణాలు, తోపుడు బళ్ళ కింద చిరు వ్యాపారాలు చేసేవారికి గుర్తింపు కార్డులు ఇస్తాం. వారిని ప్రోత్సహించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ప్రభత్వం ప్రతినెలా ఒక పథకాన్ని అమలు చేస్తుంది. దీనికి బ్యాంకర్ల సహాయ సహకారాలు అవసరం అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.