Skip to main content

బ్యాంకర్లతో పలు అంశాలపై సుదీర్ఘంగా చ‌ర్చ జ‌రిపిన సీఎం జగన్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న‌ రెడ్డి అధ్యక్షతన 208 వ ఎస్ఎల్ బీసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బ్యాంకర్లతో సీఎం వైఎస్‌ జగన్‌ పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న, చేయబోయే పథకాలకు తోడ్పాటునందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం విశ్వసనీయతను నిలబెట్టుకునేలా అడుగులు వేస్తుందన్నారు. ప్రభుత్వం బ్యాంకర్లు కలిస్తేనే క్రెడిబిలిటీ నిలబడుతుందని జగన్ అభిప్రాయపడ్డారు. వివిధ వర్గాలప్రజలకు చేయూతనివ్వడానికి, వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుంది. వివిధ పథకాల కింద ప్రభుత్వం చెల్లిస్తున్న డబ్బు నేరుగా లబ్ధిదారులకు చేరాలన్నారు జగన్. బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డబ్బును మినహాయించుకోకూడదని అందుకోసం అన్ ఇన్ కంబర్డ్ బ్యాంకు ఖాతాలు తెరవాలన్నారు. వడ్డీ లేని రుణాల కింద రైతులకు, డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు డబ్బు చెల్లిస్తుంది.
ఈ విషయం లో బ్యాంకులు ఏం కోరినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని సీఎం జగన్ తెలిపారు. మా ఆర్థిక శాఖతో టచ్ లో ఉండండి వడ్డీ లేని రుణాల కింద చెల్లించవలసిన డబ్బును నిర్దేశించిన సమయానికి చెల్లిస్తాం అని జగన్ పేర్కొన్నారు. గ్రామ వాలంటీర్లు ప్రతి ఇంటికెళ్లి.. సున్నా వడ్డీ కింద ఏవరెవరికి డబ్బు చెల్లించాలో మాకు జాబితా ఇవ్వండి చాలు, వాటిని మేము చెల్లిస్తాం. చిన్న చిన్న దుకాణాలు, తోపుడు బళ్ళ కింద చిరు వ్యాపారాలు చేసేవారికి గుర్తింపు కార్డులు ఇస్తాం. వారిని ప్రోత్సహించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ప్రభత్వం ప్రతినెలా ఒక పథకాన్ని అమలు చేస్తుంది. దీనికి బ్యాంకర్ల సహాయ సహకారాలు అవసరం అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.

Comments

Popular posts from this blog

బలపరీక్ష ఎప్పుడు నిర్వహించినా సిద్ధం.. తమ ఎమ్మెల్యేలను హోటళ్లకు తరలించిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను ముంబయిలోని పలు లగ్జరీ హోటళ్లకు తరలించాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురి చేయకుండా ఉండేందుకు ఆ పార్టీల అగ్రనేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అసెంబ్లీలో బీజేపీ బలనిరూపణ ఏ రోజు జరిగినా దానికి హాజరయ్యేందుకు సిద్ధంగా ఉండాలని ఆ మూడు పార్టీలు భావిస్తున్నాయి. ముంబయిలోని పోవైలో ఉన్న ఓ హోటల్ కు నిన్న రాత్రే ఎన్సీపీ ఎమ్మెల్యేలు బస్సుల్లో చేరుకున్నారు. శివసేన నుంచి 56 మంది నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన విషయం తెలిసిందే. వారిలో 55 మంది  అధేరీలో ఉన్న ఓ హోటల్ లో ఉన్నారు. అలాగే, వారి నుంచి ఆ పార్టీ అధిష్ఠానం సెల్ ఫోన్ లను తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ తమ 44 మంది ఎమ్మెల్యేలను మరో హోటల్ కి తరలించింది. అలాగే, శివసేన ఎమ్మెల్యేలు ఉన్న హోటల్ లోనే ఎనిమిది మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రాజ్ కుమార్ పటేల్ మీడియాకు చెప్పారు. 

రామమందిర నిర్మాణానికి ముహూర్తం ఖరారు: బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ముహూర్తం ఖరారయ్యిందన్నట్లు మాట్లాడి ఓ బీజేపీ ఎమ్మెల్యే సంచలనానికి తెరతీశారు. నవంబరు 18వ తేదీన నిర్మాణం ప్రారంభమవుతుందంటూ డేట్‌ కూడా ఫిక్స్‌ చేసేశారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో వుంది. రామాలయ నిర్మాణం విషయంలో శుభవార్త వింటారని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ రెండు రోజుల క్రితమే వ్యాఖ్యానించారు. ఈ సమయంలో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే...రాజస్థాన్‌ రాష్ట్రం పాలి జిల్లా కేంద్రంలో జరిగిన రాంలీలా కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే గైన్‌చంద్‌ పరఖ్‌ మాట్లాడారు. సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న రామజన్మభూమి కేసు నవంబరు 17వ తేదీ నాటికి కొలిక్కి వస్తుందని, 18వ తేదీన రామమందిర నిర్మాణం మొదలవుతుందని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ సాగుతోంది.