Skip to main content

ఉదయ్ డబల్ డెక్కర్ రైలు ప్రారంభం.. జోష్‌లో విశాఖ, విజయవాడ ప్రయాణికులు..

Uday Express: డబుల్ డెక్కర్ రైలు ప్రారంభం.. జోష్‌లో విశాఖ, విజయవాడ ప్రయాణికులు..– News18 Telugu
విశాఖ, విజయవాడ ప్రజలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న డబుల్ డెక్కర్ రైలు ప్రారంభమైంది. ఈ రోజు రైల్వే సహాయ మంత్రి సురేశ్‌ చెన్నబసప్ప అంగడి పచ్చ జెండా ఊపి అధికారికంగా ప్రారంభించారు. దీంతో ఉదయం 11 గంటల 30 నిమిషాలకు విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ 1వ నంబరు ప్లాట్‌ఫామ్‌పై నుంచి రైలు దూసుకెళ్లింది. ఈ రైలులో విశాఖ టు విజయవాడకు టికెట్ ధర రూ.525గా నిర్ణయించారు. కాగా, శుక్రవారం నుంచి దీని సర్వీసులు పూర్తిస్థాయిలో పట్టాలెక్కనున్నాయి.వాస్తవానికి ఈ రైలును ఆగస్టు 26న ప్రారంభించాల్సి ఉండగా.. కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ మరణంతో వాయిదా వేశారు. ఇటీవల ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో విజయవాడ, వైజాగ్ మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికుల కోసం ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది భారతీయ రైల్వే. విశాఖపట్నం, విజయవాడ మధ్య డబుల్ డెక్కర్ ఉదయ్ ఎక్స్‌ప్రెస్(22701) దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి రైల్వేస్టేషన్లల్లో ఆగుతుంది. ఉదయ్ ఎక్స్‌ప్రెస్ ప్రతీ రోజూ వైజాగ్‌లో ఉదయం 5.45 గంటలకు బయల్దేరుతుంది. ఉదయం 11.15 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. ఉదయ్ ఎక్స్‌ప్రెస్ ప్రతీ రోజూ సాయంత్రం 5.30 గంటలకు విజయవాడలో బయల్దేరి, రాత్రి 11 గంటలకు విశాఖపట్నానికి చేరుకుంటుంది. విశాఖ, విజయవాడ మధ్య రాకపోకలు ఎక్కువగా ఉండటంతో ఉదయ్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడనుంది. ఉదయ్ ఎక్స్‌ప్రెస్ సోమవారం, మంగళవారం, బుధవారం, శుక్రవారం, శనివారం రోజుల్లోనే అందుబాటులో ఉంటుంది. మొదటి ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌‌ను గతేడాది జూన్‌ నుంచి కొయంబత్తూర్-బెంగళూరు మధ్య నడుపుతోంది భారతీయ రైల్వే. ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రత్యేకతలెన్నో..
ఈ రైలులో మొత్తం 9 ఏసీ కోచ్‌లు, 2 పవర్ కార్స్ ఉంటాయి. ప్రతీ కోచ్‌లో 120 సీట్ల కెపాసిటీ ఉంటుంది. అప్పర్ డెక్‌లో 50, లోయర్‌డెక్‌లో 48, చివర్లో 22 మంది కూర్చోవచ్చు. మూడు కోచ్‌లల్లో డైనింగ్ ఫెసిలిటీ ఉంటుంది. అందులో ప్రతీ కోచ్‌లో 104 ప్రయాణికులు కూర్చోవచ్చు. 5 కోచ్‌లల్లో డైనింగ్ ఫెసిలిటీ ఉండదు. మెత్తని సీట్లు, కళ్లుచెదిరే ఇంటీరియర్, డిస్‌ప్లే స్కీన్స్, వైఫై, మాడ్యులర్ బయో టాయిలెట్స్, స్మోక్ డిటెక్షన్ అలారమ్ సిస్టమ్ ఉదయ్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకత.

Comments

Popular posts from this blog

ఎలన్ మస్క్... స్టార్ షిప్ రెడీ... వచ్చే ఏడాది మార్స్ చెంతకు ప్రయాణం

మార్స్ గ్రహంపైకి వన్ వే ట్రిప్‌గా ఆసక్తి ఉన్న ప్రజలను పంపుతానని ప్రకటించిన ఆమెరికా బిలియనీర్ వ్యాపారి ఎలన్ మస్క్... అన్నంత పనీ చేస్తున్నారు. మనుషుల్ని చందమామ, మార్స్ చెంతకు తీసుకెళ్లడం కోసం ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్... సరికొత్త విమానం తరహా స్పేస్ షిప్‌లను తయారుచేస్తోంది. ఇవి రాకెట్‌‌లా కాకుండా... విమానం లాగా... అంతరిక్షంలోకి వెళ్లి... గ్రహాలపై మనుషుల్ని దించేసి... తిరిగి ఖాళీగా వెనక్కి వచ్చేస్తాయి. గ్రహాలపైకి వెళ్లినవాళ్లు తిరిగి వచ్చే అవకాశాలు లేవు. ఇందుకు రిటర్న్ ట్రిప్ అవకాశం కల్పించట్లేదు ఎలన్ మస్క్. వన్ వే ట్రిప్‌గా వెళ్లేందుకు ఆసక్తి ఉన్నవారే టికెట్ బుక్ చేసుకోమని సూచిస్తున్నారు. తాజాగా ఆయన ఆవిష్కరించిన స్పేస్‌షిప్‌లో వంద మంది ప్రయాణించేందుకు వీలుంది. టెక్సాస్... బోకా చికాలో... ఎంతో మంది అంతరిక్ష ఔత్సాహికులు, రిపోర్టర్ల సమక్షంలో చందమామ, మార్స్‌పైకి పంపే స్టార్ షిప్‌ను ఆవిష్కరించారు ఎలన్ మస్క్. వచ్చే ఆరు నెలల్లో దాన్ని అంతరిక్షంలో ఓ రౌండ్ వేయించి... వచ్చే ఏడాది మనుషులను అందులో పంపాలనుకుంటున్నారు ఎలన్ మస్క్. ఎప్పుడో పదకొండు ఏళ్ల కిందట ఫాల్కన్-1 రాకెట్‌ను తయారుచేసింది స్పేస్ ఎక...

క్రెడిట్ పై పెట్రోలును కొనుగోలు చేస్తే నో క్యాష్‌బ్యాక్‌

క్రెడిట్‌ కార్డులను వినియోగించి పెట్రోలును కొనుగోలు చేస్తే ఇన్నాళ్లూ లభిస్తున్న 0.75 శాతం క్యాష్‌బ్యాక్‌ అక్టోబరు ఒకటో తేది నుంచి ఉండబోదని కంపెనీలు ప్ర‌క‌టించాయి.  2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే డిస్కౌంట్‌ ఇవ్వాలని చమురు కంపెనీలను కోరింది. దీంతో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి  2016 డిసెంబరు నుంచి క్రెడిట్‌, డెబిట్‌, ఈ-వాలెట్ల ద్వారా పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేసే వారికి 0.75శాతం డిస్కౌంట్‌ను క్యాష్‌బ్యాక్‌ రూపంలో  ఇవ్వాల‌ని  చమురు కంపెనీలు క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించిన విష‌యం తెలిసిందే. కాగా వచ్చే నెల ఒకటో తేది నుంచి ఆ డిస్కౌంట్‌ ఉండబోదని తాజాగా కంపెనీలు వెల్లడించాయి. ఇకమీదట డెబిట్‌, ఇతర డిజిటల్‌ పద్ధతుల ద్వారా చెల్లించేవారికి మాత్రం ఈ డిస్కౌంట్‌ యధావిధిగా కొనసాగుతుంది.