Skip to main content

అక్కడ ఉప ఎన్నికలు వాయిదా..!

అక్కడ ఉప ఎన్నికలు వాయిదా..!
రసవత్తరం అవుతాయి అనుకున్న కర్ణాటక అసెంబ్లీ  ఉప ఎన్నికలు వాయిదా పడ్డాయి. కాంగ్రెస్-జేడీఎస్ తిరుగుబాటు ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు జారీ చేసిన ఉప ఎన్నికల నోటిఫికేషన్ ను కేంద్ర ఎన్నికల సంఘం వెనక్కు తీసుకుంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలు తమపై పడ్డ అనర్హత వేటు విషయంలో కోర్టుకు ఎక్కిన నేపథ్యంలో, వారి పిటిషన్ ను కోర్టు విచారిస్తున్న తరుణంలో.. ఉప ఎన్నికలను వాయిదా వేయాలని వారు కోరగా, ఆ మేరకు ఈసీ నిర్ణయం తీసుకుంది.


అనర్హత వేటుపడ్డ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు ఏమాత్రం లేటు చేయకుండా ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడమే ఆశ్చర్యకరంగా  అనిపించింది. అది భారతీయ జనతా పార్టీకి గట్టి ఝలక్ అని పరిశీలకులు భావించారు. ఇప్పట్లో ఉప ఎన్నికలు వచ్చి,ఆ స్థానాలను బీజేపీ సొంతం చేసుకోకపోతే, కాంగ్రెస్-జేడీఎస్ లు ఆ స్థానాలను నెగ్గితే యడియూరప్ప ప్రభుత్వం మైనారిటీలో పడే అవకాశాలున్నాయి.
మళ్లీ కాంగ్రెస్- జేడీఎస్ ల నుంచి ఎమ్మెల్యేలను తెచ్చుకుని.. ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అనర్హత వేటుపడ్డ వారి పై ప్రజలు కూడా అదే అనర్హత వేస్తే అంతే సంగతులు. అందుకే ఇప్పుడే ఉప ఎన్నికలు రావడం బీజేపీకి ఝలక్ అయ్యే అవకాశాలు కనిపించాయి.

అయితే ఇప్పుడు ఈసీ ఉప ఎన్నికలను వాయిదా వేసింది. అనర్హత వేటుపడ్డ ఎమ్మెల్యేల పోటీ విషయంలో కోర్టు తీర్పు వచ్చే వరకూ అక్కడ బై పోల్స్ ను ఈసీ వాయిదా వేసింది. ఇలా వారికి ఊరట లభించింది. ఇంతకీ వారి పోటీపై కోర్టు ఏం తేలుస్తుందో, వారిపై అసలు అనర్హత వేటే చెల్లదని కోర్టు తీర్పును ఇచ్చి, ఉప ఎన్నికల భయమే లేకుండా చేస్తుందో.. ఈ ప్రజాస్వామ్య చిత్రవిచిత్రం ఎలా ఉంటుందో!

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.