Skip to main content

అక్కడ ఉప ఎన్నికలు వాయిదా..!

అక్కడ ఉప ఎన్నికలు వాయిదా..!
రసవత్తరం అవుతాయి అనుకున్న కర్ణాటక అసెంబ్లీ  ఉప ఎన్నికలు వాయిదా పడ్డాయి. కాంగ్రెస్-జేడీఎస్ తిరుగుబాటు ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు జారీ చేసిన ఉప ఎన్నికల నోటిఫికేషన్ ను కేంద్ర ఎన్నికల సంఘం వెనక్కు తీసుకుంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలు తమపై పడ్డ అనర్హత వేటు విషయంలో కోర్టుకు ఎక్కిన నేపథ్యంలో, వారి పిటిషన్ ను కోర్టు విచారిస్తున్న తరుణంలో.. ఉప ఎన్నికలను వాయిదా వేయాలని వారు కోరగా, ఆ మేరకు ఈసీ నిర్ణయం తీసుకుంది.


అనర్హత వేటుపడ్డ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు ఏమాత్రం లేటు చేయకుండా ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడమే ఆశ్చర్యకరంగా  అనిపించింది. అది భారతీయ జనతా పార్టీకి గట్టి ఝలక్ అని పరిశీలకులు భావించారు. ఇప్పట్లో ఉప ఎన్నికలు వచ్చి,ఆ స్థానాలను బీజేపీ సొంతం చేసుకోకపోతే, కాంగ్రెస్-జేడీఎస్ లు ఆ స్థానాలను నెగ్గితే యడియూరప్ప ప్రభుత్వం మైనారిటీలో పడే అవకాశాలున్నాయి.
మళ్లీ కాంగ్రెస్- జేడీఎస్ ల నుంచి ఎమ్మెల్యేలను తెచ్చుకుని.. ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అనర్హత వేటుపడ్డ వారి పై ప్రజలు కూడా అదే అనర్హత వేస్తే అంతే సంగతులు. అందుకే ఇప్పుడే ఉప ఎన్నికలు రావడం బీజేపీకి ఝలక్ అయ్యే అవకాశాలు కనిపించాయి.

అయితే ఇప్పుడు ఈసీ ఉప ఎన్నికలను వాయిదా వేసింది. అనర్హత వేటుపడ్డ ఎమ్మెల్యేల పోటీ విషయంలో కోర్టు తీర్పు వచ్చే వరకూ అక్కడ బై పోల్స్ ను ఈసీ వాయిదా వేసింది. ఇలా వారికి ఊరట లభించింది. ఇంతకీ వారి పోటీపై కోర్టు ఏం తేలుస్తుందో, వారిపై అసలు అనర్హత వేటే చెల్లదని కోర్టు తీర్పును ఇచ్చి, ఉప ఎన్నికల భయమే లేకుండా చేస్తుందో.. ఈ ప్రజాస్వామ్య చిత్రవిచిత్రం ఎలా ఉంటుందో!

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...