Skip to main content

అక్కడ ఉప ఎన్నికలు వాయిదా..!

అక్కడ ఉప ఎన్నికలు వాయిదా..!
రసవత్తరం అవుతాయి అనుకున్న కర్ణాటక అసెంబ్లీ  ఉప ఎన్నికలు వాయిదా పడ్డాయి. కాంగ్రెస్-జేడీఎస్ తిరుగుబాటు ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు జారీ చేసిన ఉప ఎన్నికల నోటిఫికేషన్ ను కేంద్ర ఎన్నికల సంఘం వెనక్కు తీసుకుంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలు తమపై పడ్డ అనర్హత వేటు విషయంలో కోర్టుకు ఎక్కిన నేపథ్యంలో, వారి పిటిషన్ ను కోర్టు విచారిస్తున్న తరుణంలో.. ఉప ఎన్నికలను వాయిదా వేయాలని వారు కోరగా, ఆ మేరకు ఈసీ నిర్ణయం తీసుకుంది.


అనర్హత వేటుపడ్డ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు ఏమాత్రం లేటు చేయకుండా ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడమే ఆశ్చర్యకరంగా  అనిపించింది. అది భారతీయ జనతా పార్టీకి గట్టి ఝలక్ అని పరిశీలకులు భావించారు. ఇప్పట్లో ఉప ఎన్నికలు వచ్చి,ఆ స్థానాలను బీజేపీ సొంతం చేసుకోకపోతే, కాంగ్రెస్-జేడీఎస్ లు ఆ స్థానాలను నెగ్గితే యడియూరప్ప ప్రభుత్వం మైనారిటీలో పడే అవకాశాలున్నాయి.
మళ్లీ కాంగ్రెస్- జేడీఎస్ ల నుంచి ఎమ్మెల్యేలను తెచ్చుకుని.. ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అనర్హత వేటుపడ్డ వారి పై ప్రజలు కూడా అదే అనర్హత వేస్తే అంతే సంగతులు. అందుకే ఇప్పుడే ఉప ఎన్నికలు రావడం బీజేపీకి ఝలక్ అయ్యే అవకాశాలు కనిపించాయి.

అయితే ఇప్పుడు ఈసీ ఉప ఎన్నికలను వాయిదా వేసింది. అనర్హత వేటుపడ్డ ఎమ్మెల్యేల పోటీ విషయంలో కోర్టు తీర్పు వచ్చే వరకూ అక్కడ బై పోల్స్ ను ఈసీ వాయిదా వేసింది. ఇలా వారికి ఊరట లభించింది. ఇంతకీ వారి పోటీపై కోర్టు ఏం తేలుస్తుందో, వారిపై అసలు అనర్హత వేటే చెల్లదని కోర్టు తీర్పును ఇచ్చి, ఉప ఎన్నికల భయమే లేకుండా చేస్తుందో.. ఈ ప్రజాస్వామ్య చిత్రవిచిత్రం ఎలా ఉంటుందో!

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...