Skip to main content

వేణుమాధవ్ కారులో ఎప్పుడూ ఆహార పదార్థాలు ఉండేవి : శివాజీ రాజా

ప్రముఖ తెలుగు హాస్యనటుడు వేణుమాధవ్ చాలా గొప్ప వ్యక్తి అని నటుడు శివాజీ రాజా కొనియాడారు. వేణు మృతిపై స్పందించిన ఆయన మాట్లాడుతూ...  వేణుమాధవ్ చనిపోయినప్పుడు తాను ఆస్పత్రిలోనే ఉన్నానని చెప్పారు. వేణు.. ఆర్టిస్టు కాకముందునుంచే ఆయన మిమిక్రీ చేసేవాడని అన్నారు. దర్శకుడు కృష్ణారెడ్డి వేణు టాలెంట్‌ను చూసి సినిమాల్లో అవకాశం ఇచ్చారని.. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో మంచి కమెడియన్‌ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నాడని అన్నారు.వేణు మానవతావాది అని, ఎంతో మందికి సహాయం చేశాడని శివాజీ రాజా చెప్పారు. వేణుమాధవ్ కారులో ఎప్పుడూ ఆహార పదార్థాలు ఉంటాయని, పేదవాళ్లకు పంచిపెట్టేవాడని తెలిపారు. ‘మా’ అసోషియేషన్‌లో తనతో కలిసి వేణు పనిచేశాడన్నారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహించాడని, కుటుంబసభ్యులు ఆస్పత్రికి వెళదామని చెప్పినా రానన్నాడని, బలవంతంగా తీసుకువచ్చామని వారు చెప్పారని శివాజీ రాజా తెలిపారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.