Skip to main content

బోటు వెలికితీత ప్రయత్నంలో అధిక బరువు లాగలేక తెగిపోయిన రోప్!

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన బోటును వెలికితీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఏపీ ప్రభుత్వం కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందానికి బోటు వెలికితీత పనులు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే, రెండు భారీ లంగర్లతో రంగంలోకి దిగిన ధర్మాడి సత్యం బృందం ఓ లంగరును విజయవంతంగా లక్ష్యానికి లాక్ చేయగలిగినట్టు తెలుస్తోంది. బాగా లోతున ఓ వస్తువుకు లంగరు తగలగానే దాని చుట్టూ ఐరన్ రోప్ తో లాక్ చేసిన ధర్మాడి సత్యం టీమ్ ఆపై బయటికి లాగే ప్రయత్నంలో విఫలమైంది.

అధిక బరువు కారణంగా ఐరన్ రోప్ మధ్యలోనే తెగిపోయింది. అంత లోతున బోటు కాకుండా మరే ఇతర వస్తువు ఉండే అవకాశం లేదని, అది బోటే అయ్యుంటుందని ధర్మాడి సత్యం భావిస్తున్నారు. అయితే 25 టన్నుల బరువున్న ఆ బోటు, గోదావరి వరద కారణంగా ఇసుకతో నిండిపోయి మరింత బరువెక్కి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందుకే రోప్ తెగిపోయి ఉంటుందని, అసలు నీటి అడుగున ఓ బరువైన వస్తువు ఉన్నట్టు గుర్తించడం సగం విజయంతో సమానమని వెలికితీతలో పాల్గొంటున్న నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సంఘటన స్థలంలో వర్షం పడుతుండడం కూడా వెలికితీత పనులకు ఆటంకం కలిగిస్తోంది.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.