Skip to main content

నువ్వు ట్విట్టర్ లో రాసుకుందే చరిత్ర అనుకుంటే ఎలా శకుని మామా?: బుద్దా వెంకన్న

టీడీపీ నేత బుద్ధా వెంకన్న ట్విట్టర్ లో వైసీసీ నేత విజయసాయిరెడ్డిపై విమర్శలు చేశారు. ఆర్టీసీని అప్పుల బారి నుంచి రక్షించి అనేక అవార్డులు వచ్చేలా చేసింది టీడీపీ అధినేత చంద్రబాబు అని తెలిపారు. ఆర్టీసీని నాశనం చేసి అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసింది మీ మహామేత అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. జరిగిన వాస్తవం ఇదైతే, నువ్వు ట్విట్టర్ లో రాసుకుందే చరిత్ర అనుకుంటే ఎలా శకుని మామా? అంటూ ట్వీట్ లో నిలదీశారు.

శకుని మామా, ఎవరి హయాంలో ఆర్టీసీ నాశనమైందో ఓ పుస్తకం తయారుచేసి పంపిస్తాను, తీరిగ్గా చదువుకుందువుగాని అంటూ వ్యాఖ్యానించారు. "అప్పుడప్పుడు కాస్త వేరే పేపర్లు కూడా చదువుతుండు శకుని మామా, మీ తుగ్లక్ పాలన ఎంత బాగుందో అర్థమవుతుంది. 90 శాతం వలంటీర్లు మన కార్యకర్తలే అని పబ్లిగ్గా మాట్లాడిన నువ్వా వారి ఘనకార్యాల గురించి మాట్లాడేది?" అంటూ విమర్శించారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.