Skip to main content

గోదావరిలో మునిగిపోయిన బోటుకు ఫిట్ నెస్ సర్టిఫికెట్ ఉంది: మంత్రి కన్నబాబు

ఏపీ మంత్రి కన్నబాబు గోదావరి బోటు మునక ఘటనపై మీడియాతో మాట్లాడారు. కచ్చులూరు వద్ద గోదావరి నదిలో మునిగిపోయిన బోటుకు ఫిట్ నెస్ సర్టిఫికెట్ ఉందని వెల్లడించారు. అయితే  వరద ఉద్ధృతితో బోటు సుడిగుండంలో చిక్కుకోవడం వల్లే ప్రమాదం జరిగిందని వివరించారు.
 దీనిపై చంద్రబాబు వంటి నేతలు రాజకీయం చేయడం దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు. ఆచూకీ లేని వారికి మరణ ధ్రువపత్రం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కన్నబాబు స్పష్టం చేశారు. బోటు ప్రయాణాలపై మాన్యువల్ రూపొందించాలని సీఎం జగన్ ఆదేశించారని కన్నబాబు తెలిపారు. ఇకమీదట బోట్లలో జీపీఎస్, నావిగేషన్ వ్యవస్థలు ఉంటేనే ప్రయాణానికి అనుమతి ఇచ్చే ఆలోచన ఉందని వెల్లడించారు.

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...