తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డీజీపీకి రెండు పేజీల లేఖ రాశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణిస్తున్నాయన్నారు. వాక్ స్వాతంత్ర్యాన్ని హరిస్తున్నారని, రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా శాంతి భద్రతలు దిగజారాయన్నారు. ప్రాథమిక హక్కులను వైసీపీ ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. ప్రజలు, మీడియా ప్రతినిధులపై దాడులు కొనసాగుతున్నాయని చంద్రబాబు అన్నారు. అధికార పార్టీ ప్రతినిధులు, సంఘవిద్రోహ శక్తుల ద్వారా...శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. చీరాలలో వైసీపీ నేత ఆమంచి వర్గీయులు విలేకరిపై దాడి చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదని, గతంలో ఏపీ పోలీసులకు సమర్థులు అనే పేరు ఉండేదన్నారు. ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా చూడాలని చంద్రబాబు సూచించారు.
వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్పైవెళ్తున్న చాపర్తిన శేఖర్ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్ హైవే అంబులెన్స్ ద్వారా విజయవాడ ఈఎస్ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్ పక్కకు తొలగి అంబులెన్స్కు దారి ఇచ్చింది.
Comments
Post a Comment