Skip to main content

అనేక దేశాధినేతలకు భారత్ ఓ పెద్ద మార్కెట్... మనుషుల కంటే వ్యాపారమే ముఖ్యమైపోయింది: ఇమ్రాన్ ఖాన్ నిర్వేదం

ఐక్యరాజ్యసమితిలో వీరావేశంతో ప్రసంగించినా తమ వాదనకు ఎవరూ మద్దతు పలకకపోవడం పట్ల పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ నైరాశ్యంలో మునిగిపోయారు. కశ్మీర్ విషయంలో తగిన విధంగా మద్దతు రాబట్టలేకపోయామని అంగీకరించిన ఇమ్రాన్ ఖాన్, ఏదో ఒకరోజున ప్రపంచ దేశాలన్నీ నిజాన్ని తెలుసుకుంటాయని వ్యాఖ్యానించారు. ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, భారత్ పై మరోసారి అక్కసు వెళ్లగక్కారు. "అనేక దేశాల అధినేతలకు భారత్ అంటే ఓ పెద్ద మార్కెట్. 120 కోట్ల మందితో కూడిన ఆ వాణిజ్య కేంద్రానికి ఇచ్చిన విలువ మనుషులకు ఇవ్వరా? మనుషుల కంటే వ్యాపారమే ముఖ్యమైపోయిందా?" అంటూ విస్మయం వ్యక్తం చేశారు.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.