Skip to main content

హైకోర్టును ఆశ్రయించిన లింగమనేని రమేష్: జగన్ సర్కార్ తీరుపై పిటీషన్

 lingamaneni ramesh approach highcourt over his guest houseవివాదాస్పదమైన తన నివాసంపై హైకోర్టును ఆశ్రయించారు వ్యాపార వేత్త లింగమనేని రమేష్. తనకు సమాచారం ఇవ్వకుండా తన ఇంటిని కూల్చివేస్తున్నారంటూ పిటీషన్ దాఖలు చేశారు. ప్రాపర్టీ స్టే కోసం హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. 
ఇకపోతే మంగళవారం లింగమనేని రమేష్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. కరకట్ట పై ఉన్న అతిధి గృహం కూల్చివేత నోటీసులపై 5పేజీలు లేఖ రాశారు. 
కూల్చివేతల ధోరణి వల్ల ప్రభావితమయ్యేది తన ఒక్క కుటుంబం మాత్రమే కాదని చెప్పుకొచ్చారు. 
సిఆర్డీఏ ద్వారా ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాల కూల్చివేత ప్రక్రియ అనేది రాజధాని ప్రాంతంలో లక్షల మందిని నిరాశ నిస్పృహల్లోకి నెట్టివేస్తుందని లేఖలో పేర్కొన్నారు. నిర్మాణాత్మకంగా సాగుతుంది అనుకున్న ప్రభుత్వం కూల్చివేతకే ప్రాధాన్యం ఇస్తుందా అనే ప్రశ్న ప్రజల్లో ఉదయించిందని చెప్పుకొచ్చారు. 
కరకట్టపై మొదలైన ఈ ప్రక్రియ తమ ప్రాంతాలకు వేర్వేరు కారణాలతో వస్తుందనే ఆందోళన రాష్ట్రమంతా మొదలైందని లేఖలో స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలతో ప్రజలకు ఎలాంటి సంకేతాలు పంపిస్తున్నారో ఆలోచించుకోగలరని హితవు పలికారు. ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధి కోసం తపిస్తున్న తనలాంటి వ్యక్తులపై ఒత్తిళ్ళు తీసుకురావడం ఏ మేరకు సబబు అంటూ సీఎం జగన్ ని ప్రశ్నించిన సంగతి తెలిసిందే.  

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

ఒక్కో రైతుకు రూ.18,500 ఇవ్వాలి: పవన్‌

 రైతు భరోసా పథకాన్ని పీఎమ్‌ కిసాన్‌ యోజన పథకంతో ముడిపెట్టి అమలు చేస్తున్న జగన్‌.. తన ఎన్నికల వాగ్దానానికి సంపూర్ణత్వం సాధించలేక పోయారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. ప్రతి రైతు కుటుంబానికి  ఏడాదికి రూ.12,500  అందిస్తామని నవరత్నాలలో, ఎన్నికల ప్రణాళికలో ఘనంగా ప్రకటించి... కేంద్రం ఇస్తున్న రూ.6000 కలిపి రూ.13,500 ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నవరత్నాలు ప్రకటించినప్పుడు కేంద్ర ఇచ్చే సాయంతో కలిపి ఇస్తామని ఎందుకు ప్రకటించలేదని నిలదీశారు. రైతులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం రూ.12,500లకు కేంద్ర సాయం రూ.6000 కలిపి రూ.18,500 చొప్పున  రైతులకు పంపిణీ చేయాలని పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. ఒక వేళ అంతమొత్తం ఇవ్వలేకపోతే  అందుకు కారణాలను రైతులకు చెప్పి,  వాగ్దానం ప్రకారం ఇవ్వనందుకు మన్నించమని అడగాలని పేర్కొన్నారు.