Skip to main content

తల్లి సుష్మా స్వరాజ్ చివరి కోర్కెను తీర్చిన కుమార్తె




బీజేపీ సీనియర్ నేత, కేంద్రమాజీ మంత్రి సుష్మా స్వరాజ్ చివరి కోరికను ఆమె కుమార్తె బన్సూరి తాజాగా నెరవేర్చారు. పాకిస్థాన్ చెరలో ఉన్న కుల్‌భూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానంలో వాదించినందుకు గాను ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వేకు ఇవ్వాల్సిన రూపాయి ఫీజును చెల్లించి తల్లి చివరి కోరికను నెరవేర్చారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపారు.

కన్నుమూయడానికి గంట ముందు హరీశ్ సాల్వేతో మాట్లాడిన సుష్మా స్వరాజ్.. కేసు గెలిచినందుకు గాను చెల్లించాల్సిన ఫీజు ఒక రూపాయిని వచ్చి తీసుకెళ్లాల్సిందిగా కోరారు. ఈ విషయాన్ని ఇటీవల హరీశ్ గుర్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సుష్మ కుమార్తె బన్సూరి ఆ రూపాయి ఫీజును చెల్లించి తల్లి చివరి కోరికను తీర్చారు.


Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.