Skip to main content

ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరాడాలి: మోదీ

PM Modi UNGA Speech: ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరాడాలి: మోదీ– News18 Telugu

20 నిమిషాల పాటు సాగిన తన ప్రసంగంలో.. ప్రధానంగా భారత అభివృద్ధిపైనే మాట్లాడారు మోదీ. తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పథకాలు, కార్యక్రమాలను ఐక్యరాజ్యసమితిలో వివరించారు.ఉగ్రవాదం మానవత్వానికి పెను ముప్పుగా మారిందని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రధాని మోదీ ప్రసంగించారు. పాకిస్తాన్ పేరును నేరుగా ప్రస్తావించని ప్రధాని మోదీ.. తన ప్రసంగంలో ఉగ్రవాదంపై విరుచుకుపడ్డారు. టెర్రరిజం యావత్ మనవాళికి ప్రమాదకరంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. ఉగ్రవాదం పోరాడేందుకు అందరం కలిసి పనిచేయాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. 125 ఏళ్ల క్రితం చికాగోలో స్వామి వివేకానంద శాంతి, సామరస్యం గురించి ప్రసంగించారని.. భారత్ ఇప్పటికీ అదే సందేశాన్ని ఇస్తోందన్నారు ప్రధాని మోదీ.

ఉగ్రవాదం యావత్ ప్రపంచానికి పెను ముప్పు. ఉగ్రవాదంపై పోరాటేందుకు ప్రపంచ దేశాలన్నీ కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది. ఐక్యరాజ్య సమితి శాంతి మిషన్ కోసం ప్రపంచంలోని అన్ని దేశాల కంటే ఎక్కువగా భారత సైనికులు బలిదానం చేశారు. తీవ్రవాదంపై పోరాటం చేస్తున్నాం. ఇది ఒక దేశానికే కాదు. ప్రపంచానికి, మానవత్వానికి కూడా ప్రమాదమే. ఐరాస ఏర్పాటు చేయడానికి మూలం మానవత్వమే. దాన్ని కాపాడుకోవాలి.
— ప్రధాని మోదీ
20 నిమిషాల పాటు సాగిన తన ప్రసంగంలో.. ప్రధానంగా భారత అభివృద్ధిపైనే మాట్లాడారు మోదీ. తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పథకాలు, కార్యక్రమాలను ఐక్యరాజ్యసమితిలో వివరించారు.
నరుడిలో ఈశ్వరుడిని చూడటమే భారతీయ సంస్కృతిగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జాతిపిత మహాత్మాగాంధీని స్మరించుకుంటూ  ఐక్యరాజ్యసమితి 74వ జనరల్ అసెంబ్లీలో ప్రసంగాన్ని ప్రారంభించారు ప్రధాని మోదీ. ఈ ఏడాది మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు జరుపుకుంటున్నట్లు తెలిపారు. 2022నాటికి పేదల కోసం 2 కోట్ల ఇళ్లను నిర్మించనున్నట్లు వివరించారు. దేశాభివృద్ధి అంటే మానవాభివృద్ధిగా పేర్కొన్న ప్రధాని మోదీ...ఈ విషయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారత్ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. 130 కోట్ల మంది ప్రజలను దృష్టిలో పెట్టుకుని పథకాలను చేపడుతున్నట్లు చెప్పారు. ఒకేసారి వినియోగించే ప్లాస్టిక్‌ను నిషేధించే దిశగా భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాని మోదీ వివరించారు. దీని కోసం భారీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు గుర్తుచేశారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రజల సంక్షేమం తమ నినాదమన్నారు.గ్లోబల్ వార్మింగ్‌కు భారత్ కారణంకాకున్నా...ఈ  సమస్య పరిష్కారం కోసం భారత్ తీవ్రంగా కృషిచేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. 2025నాటికి టీబీ రహిత దేశంగా భారత్ ఆవిర్భవిస్తుందని, ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఉగ్రవాదం యావత్ మానవాళికి ప్రమాదకారిగా ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచమంతా ఏకం కావాలని ప్రపంచ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. ఐరాస మరింత బలోపేతం కావాల్సి ఉందన్నారు. స్వచ్ఛ భారత్ గురించి తన ప్రసంగంలో ప్రధాని మోదీ ప్రస్తావించారు. ప్రపంచంలో అతిపెద్ద పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ఐదు మాసాల్లో దిగ్విజయంగా చేపట్టగలిగినట్లు వివరించారు. ఇందులో భాగంగా దేశంలో 11 కోట్ల మరుగుదొడ్లు నిర్మించినట్లు వివరించారు.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...