Skip to main content

ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరాడాలి: మోదీ

PM Modi UNGA Speech: ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరాడాలి: మోదీ– News18 Telugu

20 నిమిషాల పాటు సాగిన తన ప్రసంగంలో.. ప్రధానంగా భారత అభివృద్ధిపైనే మాట్లాడారు మోదీ. తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పథకాలు, కార్యక్రమాలను ఐక్యరాజ్యసమితిలో వివరించారు.ఉగ్రవాదం మానవత్వానికి పెను ముప్పుగా మారిందని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రధాని మోదీ ప్రసంగించారు. పాకిస్తాన్ పేరును నేరుగా ప్రస్తావించని ప్రధాని మోదీ.. తన ప్రసంగంలో ఉగ్రవాదంపై విరుచుకుపడ్డారు. టెర్రరిజం యావత్ మనవాళికి ప్రమాదకరంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. ఉగ్రవాదం పోరాడేందుకు అందరం కలిసి పనిచేయాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. 125 ఏళ్ల క్రితం చికాగోలో స్వామి వివేకానంద శాంతి, సామరస్యం గురించి ప్రసంగించారని.. భారత్ ఇప్పటికీ అదే సందేశాన్ని ఇస్తోందన్నారు ప్రధాని మోదీ.

ఉగ్రవాదం యావత్ ప్రపంచానికి పెను ముప్పు. ఉగ్రవాదంపై పోరాటేందుకు ప్రపంచ దేశాలన్నీ కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది. ఐక్యరాజ్య సమితి శాంతి మిషన్ కోసం ప్రపంచంలోని అన్ని దేశాల కంటే ఎక్కువగా భారత సైనికులు బలిదానం చేశారు. తీవ్రవాదంపై పోరాటం చేస్తున్నాం. ఇది ఒక దేశానికే కాదు. ప్రపంచానికి, మానవత్వానికి కూడా ప్రమాదమే. ఐరాస ఏర్పాటు చేయడానికి మూలం మానవత్వమే. దాన్ని కాపాడుకోవాలి.
— ప్రధాని మోదీ
20 నిమిషాల పాటు సాగిన తన ప్రసంగంలో.. ప్రధానంగా భారత అభివృద్ధిపైనే మాట్లాడారు మోదీ. తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పథకాలు, కార్యక్రమాలను ఐక్యరాజ్యసమితిలో వివరించారు.
నరుడిలో ఈశ్వరుడిని చూడటమే భారతీయ సంస్కృతిగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జాతిపిత మహాత్మాగాంధీని స్మరించుకుంటూ  ఐక్యరాజ్యసమితి 74వ జనరల్ అసెంబ్లీలో ప్రసంగాన్ని ప్రారంభించారు ప్రధాని మోదీ. ఈ ఏడాది మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు జరుపుకుంటున్నట్లు తెలిపారు. 2022నాటికి పేదల కోసం 2 కోట్ల ఇళ్లను నిర్మించనున్నట్లు వివరించారు. దేశాభివృద్ధి అంటే మానవాభివృద్ధిగా పేర్కొన్న ప్రధాని మోదీ...ఈ విషయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారత్ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. 130 కోట్ల మంది ప్రజలను దృష్టిలో పెట్టుకుని పథకాలను చేపడుతున్నట్లు చెప్పారు. ఒకేసారి వినియోగించే ప్లాస్టిక్‌ను నిషేధించే దిశగా భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాని మోదీ వివరించారు. దీని కోసం భారీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు గుర్తుచేశారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రజల సంక్షేమం తమ నినాదమన్నారు.గ్లోబల్ వార్మింగ్‌కు భారత్ కారణంకాకున్నా...ఈ  సమస్య పరిష్కారం కోసం భారత్ తీవ్రంగా కృషిచేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. 2025నాటికి టీబీ రహిత దేశంగా భారత్ ఆవిర్భవిస్తుందని, ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఉగ్రవాదం యావత్ మానవాళికి ప్రమాదకారిగా ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచమంతా ఏకం కావాలని ప్రపంచ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. ఐరాస మరింత బలోపేతం కావాల్సి ఉందన్నారు. స్వచ్ఛ భారత్ గురించి తన ప్రసంగంలో ప్రధాని మోదీ ప్రస్తావించారు. ప్రపంచంలో అతిపెద్ద పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ఐదు మాసాల్లో దిగ్విజయంగా చేపట్టగలిగినట్లు వివరించారు. ఇందులో భాగంగా దేశంలో 11 కోట్ల మరుగుదొడ్లు నిర్మించినట్లు వివరించారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...