Skip to main content

ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరాడాలి: మోదీ

PM Modi UNGA Speech: ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరాడాలి: మోదీ– News18 Telugu

20 నిమిషాల పాటు సాగిన తన ప్రసంగంలో.. ప్రధానంగా భారత అభివృద్ధిపైనే మాట్లాడారు మోదీ. తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పథకాలు, కార్యక్రమాలను ఐక్యరాజ్యసమితిలో వివరించారు.ఉగ్రవాదం మానవత్వానికి పెను ముప్పుగా మారిందని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రధాని మోదీ ప్రసంగించారు. పాకిస్తాన్ పేరును నేరుగా ప్రస్తావించని ప్రధాని మోదీ.. తన ప్రసంగంలో ఉగ్రవాదంపై విరుచుకుపడ్డారు. టెర్రరిజం యావత్ మనవాళికి ప్రమాదకరంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. ఉగ్రవాదం పోరాడేందుకు అందరం కలిసి పనిచేయాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. 125 ఏళ్ల క్రితం చికాగోలో స్వామి వివేకానంద శాంతి, సామరస్యం గురించి ప్రసంగించారని.. భారత్ ఇప్పటికీ అదే సందేశాన్ని ఇస్తోందన్నారు ప్రధాని మోదీ.

ఉగ్రవాదం యావత్ ప్రపంచానికి పెను ముప్పు. ఉగ్రవాదంపై పోరాటేందుకు ప్రపంచ దేశాలన్నీ కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది. ఐక్యరాజ్య సమితి శాంతి మిషన్ కోసం ప్రపంచంలోని అన్ని దేశాల కంటే ఎక్కువగా భారత సైనికులు బలిదానం చేశారు. తీవ్రవాదంపై పోరాటం చేస్తున్నాం. ఇది ఒక దేశానికే కాదు. ప్రపంచానికి, మానవత్వానికి కూడా ప్రమాదమే. ఐరాస ఏర్పాటు చేయడానికి మూలం మానవత్వమే. దాన్ని కాపాడుకోవాలి.
— ప్రధాని మోదీ
20 నిమిషాల పాటు సాగిన తన ప్రసంగంలో.. ప్రధానంగా భారత అభివృద్ధిపైనే మాట్లాడారు మోదీ. తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పథకాలు, కార్యక్రమాలను ఐక్యరాజ్యసమితిలో వివరించారు.
నరుడిలో ఈశ్వరుడిని చూడటమే భారతీయ సంస్కృతిగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జాతిపిత మహాత్మాగాంధీని స్మరించుకుంటూ  ఐక్యరాజ్యసమితి 74వ జనరల్ అసెంబ్లీలో ప్రసంగాన్ని ప్రారంభించారు ప్రధాని మోదీ. ఈ ఏడాది మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు జరుపుకుంటున్నట్లు తెలిపారు. 2022నాటికి పేదల కోసం 2 కోట్ల ఇళ్లను నిర్మించనున్నట్లు వివరించారు. దేశాభివృద్ధి అంటే మానవాభివృద్ధిగా పేర్కొన్న ప్రధాని మోదీ...ఈ విషయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారత్ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. 130 కోట్ల మంది ప్రజలను దృష్టిలో పెట్టుకుని పథకాలను చేపడుతున్నట్లు చెప్పారు. ఒకేసారి వినియోగించే ప్లాస్టిక్‌ను నిషేధించే దిశగా భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాని మోదీ వివరించారు. దీని కోసం భారీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు గుర్తుచేశారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రజల సంక్షేమం తమ నినాదమన్నారు.గ్లోబల్ వార్మింగ్‌కు భారత్ కారణంకాకున్నా...ఈ  సమస్య పరిష్కారం కోసం భారత్ తీవ్రంగా కృషిచేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. 2025నాటికి టీబీ రహిత దేశంగా భారత్ ఆవిర్భవిస్తుందని, ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఉగ్రవాదం యావత్ మానవాళికి ప్రమాదకారిగా ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచమంతా ఏకం కావాలని ప్రపంచ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. ఐరాస మరింత బలోపేతం కావాల్సి ఉందన్నారు. స్వచ్ఛ భారత్ గురించి తన ప్రసంగంలో ప్రధాని మోదీ ప్రస్తావించారు. ప్రపంచంలో అతిపెద్ద పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ఐదు మాసాల్లో దిగ్విజయంగా చేపట్టగలిగినట్లు వివరించారు. ఇందులో భాగంగా దేశంలో 11 కోట్ల మరుగుదొడ్లు నిర్మించినట్లు వివరించారు.

Comments

Popular posts from this blog

ఎలన్ మస్క్... స్టార్ షిప్ రెడీ... వచ్చే ఏడాది మార్స్ చెంతకు ప్రయాణం

మార్స్ గ్రహంపైకి వన్ వే ట్రిప్‌గా ఆసక్తి ఉన్న ప్రజలను పంపుతానని ప్రకటించిన ఆమెరికా బిలియనీర్ వ్యాపారి ఎలన్ మస్క్... అన్నంత పనీ చేస్తున్నారు. మనుషుల్ని చందమామ, మార్స్ చెంతకు తీసుకెళ్లడం కోసం ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్... సరికొత్త విమానం తరహా స్పేస్ షిప్‌లను తయారుచేస్తోంది. ఇవి రాకెట్‌‌లా కాకుండా... విమానం లాగా... అంతరిక్షంలోకి వెళ్లి... గ్రహాలపై మనుషుల్ని దించేసి... తిరిగి ఖాళీగా వెనక్కి వచ్చేస్తాయి. గ్రహాలపైకి వెళ్లినవాళ్లు తిరిగి వచ్చే అవకాశాలు లేవు. ఇందుకు రిటర్న్ ట్రిప్ అవకాశం కల్పించట్లేదు ఎలన్ మస్క్. వన్ వే ట్రిప్‌గా వెళ్లేందుకు ఆసక్తి ఉన్నవారే టికెట్ బుక్ చేసుకోమని సూచిస్తున్నారు. తాజాగా ఆయన ఆవిష్కరించిన స్పేస్‌షిప్‌లో వంద మంది ప్రయాణించేందుకు వీలుంది. టెక్సాస్... బోకా చికాలో... ఎంతో మంది అంతరిక్ష ఔత్సాహికులు, రిపోర్టర్ల సమక్షంలో చందమామ, మార్స్‌పైకి పంపే స్టార్ షిప్‌ను ఆవిష్కరించారు ఎలన్ మస్క్. వచ్చే ఆరు నెలల్లో దాన్ని అంతరిక్షంలో ఓ రౌండ్ వేయించి... వచ్చే ఏడాది మనుషులను అందులో పంపాలనుకుంటున్నారు ఎలన్ మస్క్. ఎప్పుడో పదకొండు ఏళ్ల కిందట ఫాల్కన్-1 రాకెట్‌ను తయారుచేసింది స్పేస్ ఎక...

క్రెడిట్ పై పెట్రోలును కొనుగోలు చేస్తే నో క్యాష్‌బ్యాక్‌

క్రెడిట్‌ కార్డులను వినియోగించి పెట్రోలును కొనుగోలు చేస్తే ఇన్నాళ్లూ లభిస్తున్న 0.75 శాతం క్యాష్‌బ్యాక్‌ అక్టోబరు ఒకటో తేది నుంచి ఉండబోదని కంపెనీలు ప్ర‌క‌టించాయి.  2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే డిస్కౌంట్‌ ఇవ్వాలని చమురు కంపెనీలను కోరింది. దీంతో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి  2016 డిసెంబరు నుంచి క్రెడిట్‌, డెబిట్‌, ఈ-వాలెట్ల ద్వారా పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేసే వారికి 0.75శాతం డిస్కౌంట్‌ను క్యాష్‌బ్యాక్‌ రూపంలో  ఇవ్వాల‌ని  చమురు కంపెనీలు క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించిన విష‌యం తెలిసిందే. కాగా వచ్చే నెల ఒకటో తేది నుంచి ఆ డిస్కౌంట్‌ ఉండబోదని తాజాగా కంపెనీలు వెల్లడించాయి. ఇకమీదట డెబిట్‌, ఇతర డిజిటల్‌ పద్ధతుల ద్వారా చెల్లించేవారికి మాత్రం ఈ డిస్కౌంట్‌ యధావిధిగా కొనసాగుతుంది.