Skip to main content

నవంబరులో స్పందన ఫిర్యాదుల పరిష్కారంపై సోషల్ ఆడిట్: ఎల్వీ సుబ్రహ్మణ్యం

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కారం స్పందన కార్యక్రమం కింద వచ్చే ఫిర్యాదులను సకాలంలో హేతుబద్ధంగా పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సంబంధిత శాఖల కార్యదర్శులను ఆదేశించారు. మంగళవారం అమరావతి సచివాలయంలో సిఎస్ అధ్యక్షతన స్పందన ఫిర్యాదుల పరిష్కార సొల్యూషన్ పై వర్క్ షాపు జరిగింది. స్పందన ఫిర్యాదులను సక్రమంగా పరిష్కరించేందుకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ విధానాన్ని తీసుకుని రావాలని ప్రణాళిక శాఖ కార్యదర్శిని ఆదేశించారు. స్పందన ఫిర్యాదులను సకాలంలో హేతుబద్దమైన రీతిలో పరిష్కరించాలని సంబంధిత కార్యదర్శకులను సిఎస్ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చినందున ఈ ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం ఎంతమాత్రం వహించవద్దని ఎక్కడైనా ఈ విషయంలో నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బందిపై క్రమశిక్షణా చర్యల తీసుకోవడం జరుగుతుందని అన్నారు. కావున వెంటనే సంబంధిత శాఖల కార్యదర్శులు వారి శాఖలకు చెందిన అదికారులు, సిబ్బందికి స్పందన ఫిర్యాదులు పరిష్కారంపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని సిఎస్ సుబ్రహ్మణ్యం ఆదేశించారు. సియం సమీక్షిస్తున్నారా లేదా అనేది కాకుండా ప్రతి అధికారి, ఉద్యోగి తన బాధ్యతలను సక్రమంగా బాధ్యతాయుతంగా నిర్వహించాలని ప్రతి ఫిర్యాదు పరిష్కారం హేతుబద్ధంగా ఉండాలని సిఎస్ స్పష్టం చేశారు.  

ప్రస్తుతం స్పందన ఫిర్యాదులు పరిష్కారం ఆశించిన స్థాయిలో ఉన్నట్టు లేదని నివేదికలను బట్టి తెలుస్తోందని ఇకపై ఈ విషయంలో సంబంధిత శాఖల కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రాష్ట్ర స్థాయి నుండి గ్రామస్థాయి వరకూ ప్రజల నుండి వచ్చే స్పందన ఫిర్యాదులు అన్నిటినీ క్రమబద్దమైన రీతిలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కార్యదర్శులను ఆదేశించారు.స్పందన ఫిర్యాదులతో పాటు ఉద్యోగులకు సంబందించి వచ్చే ఫిర్యాదులను కూడా ఆయా శాఖల అధికారులు సకాలంలో పరిష్కరించాలని అన్నారు.ఆంద్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో ఎన్నో వినూత్న కార్యక్రమాలు,పధకాల రూపకల్పనలో ముందుంటుందనే పేరుందుని కావున ప్రజా ఫిర్యాదులు పరిష్కారంలో కూడా ఆపేరును నిలబెట్టుకునేందుకు మనం అందరం కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందని సిఎస్ స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రణాళికాశాఖ కార్యదర్శి సంజయ్ గుప్త స్పందన ఫిర్యాదుల పరిష్కారంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్  చేస్తూ స్పందన ఫిర్యాదులకు సంబంధించి ముఖ్యంగా 12 శాఖలు ద్వారా 92శాతం ఫిర్యాదులు స్పీకరించడం జరిగిందని తెలిపారు.అనగా స్పందన కార్యక్రమం ద్వారా మొత్తం 5లక్షల 70వేల 268 ఫిర్యాదులు రాగా వాటిలో 5లక్షల 26వేల992 ఫిర్యాదులు అనగా 92శాతం భూపరిపాలన, పౌరసరఫరాలు, మున్సిపల్ పరిపాలన, పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, గృహనిర్మాణం, పోలీస్, విద్యుత్, వ్యవసాయం, పాఠశాల విద్య, మహిళా శిశు సంక్షేమం, గిరిజన, సాంఘిక సంక్షేమం, పశుసంవర్ధక శాఖలకు సంబంధించినవే ఉన్నాయని పేర్కొన్నారు.ఇప్పటి వరకూ వచ్చిన ఫిర్యాదుల్లో 77శాతం పరిష్కారం కాగా 8 శాతం తిరస్కరించగా, మరో 15 శాతం పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. స్పందన ఫిర్యాదులకు సంబంధించి తూర్పు గోదావరి జిల్లా నుండి 86 వేల716 ఫిర్యాదులు రాగా వాటిలో 80 శాతం పరిష్కరించగా మిగతా 20శాతం పెండింగ్ లేదా తిరస్కరణలో ఉన్నాయని చెప్పారు. అలాగే అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 15వేల571 ఫిర్యాదులు రాగా వాటిలో 86శాతం పరిష్కరించగా 14శాతం తిరస్కరణ లేదా పెండింగ్లో ఉన్నాయని వివరించారు.స్పందన ఫిర్యాదుల పరిష్కారం పై అక్టోబరులో ఎంఆర్ఓ, ఎండిఓలకు జిల్లా స్థాయిలో సెన్సిటైజేషన్ శిక్షణా కార్యక్రమాలు నిర్వహణకు కార్యచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్టు ప్రణాళికాశాఖ కార్యదర్శి సంజయ్ గుప్త చెప్పారు.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...