ఉండవల్లి కరకట్టపై ఇంట్లో చంద్రబాబు నివాసం ఉండటంపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘ఏదైనా ఒక ఇంట్లో అద్దెకు ఉంటే, అక్కడ నిబంధనల ప్రకారం ఏదైనా కట్టలేదని తెలిస్తే ‘నేను అయితే అలాంటి ఇంట్లో ఉండను. అప్పుడు వారు (చంద్రబాబు) ఉన్నారు. ఇప్పుడు ఖాళీ చేయాలి. దాని గురించి ఇంత చర్చ ఏంటి?’ అని ప్రశ్నించారు. ఆ ఇంటిని ప్రభుత్వం కనుక పడగొడితే సానుభూతి వస్తుందని చంద్రబాబు చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు ఇంటి గురించి లేదా రాజధాని ప్రాంతంలో తనకు భూములు ఉన్నాయన్న ఆరోపణలపైనా మాట్లాడటమే పనిగా ప్రభుత్వం పెట్టుకుందని విమర్శించారు. ఈ సందర్భంగా మీడియాపైనా విమర్శలు చేశారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ దొందూదొందేనని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు.
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Comments
Post a Comment