Skip to main content

పాక్‌ భూకంప మృతుల కుటుంబాలకు మోడీ సంతాపం

పాకిస్తాన్‌లో సంభవించిన భూకంపంలో పలువురు మరణించడంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి చెందారు. మృతుల కుటుంబాలకు మోడీ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ మేరకు న్యూఢిల్లిలోని ప్రధాని కార్యాలయం ట్విటర్‌లో ఒక పోస్టుచేసింది. భారత్‌లోనూ, పాకిస్తాన్‌లోనూ భూకంపం సంభవించిందని, ఆస్తి, ప్రాణ నష్టాలు జరిగాయని తెలిసి తానెంతో బాధపడ్డానని మోడీ పేర్కొన్నారని ఆ ట్వీట్‌లో రాశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారని, గాయపడిన వారు త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు మోడీ అన్నారని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. పాకిస్తాన్‌లో భూకంపం వల్ల 19 మంది మరణించారు. 300 మందికి పైగా గాయపడ్డారు.

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...