Skip to main content

జగన్ సర్కార్ కి నిధుల కొరత: రైతు రుణమాఫీ నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ

Shortage of funds for ys jagan government: The government stopped the farmer loan waiver
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు రుణమాఫీని నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉన్న 4,5 విడతల బకాయిలను నిలిపివేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. 
4, 5 విడతలకు సంబంధించి రూ.7959.12 కోట్లు చెల్లింపును నిలిపివేస్తూ వైసీపీ ప్రభుత్వం విడుదల చేసింది. నిధులు లేకపోవడంతో రుణమాఫీ చేయలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే గత ప్రభుత్వం మార్చిలో విడుదల చేసిన జీవోను నిలిపివేసింది. తాజాగా జీవో 99 విడుల చేసిన ప్రభుత్వం. 
ఇకపోతే బుధవారం రైతు భరోసా పథకంపై సమీక్ష నిర్వహించారు సీఎం వైయస్ జగన్. అనంతరం వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య రుణమాఫీ రద్దు చేస్తూ జీవో 38ను రద్దు చేస్తూ కొత్త జీవోను విడుదల చేశారు. 
అయితే రైతు భరోసా పథకం అమలు చేస్తున్న నేపథ్యంలోనే రైతు రుణమాఫీని రద్దు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం విడుదల చేసిన జీవోను రద్దు చేస్తూ రైతు భరోసా పథకం అమలు చేస్తున్నట్లు తెలుపుతూ జీవో 99ని విడదుల చేశారు. 
వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై తెలుగుదేశం పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక జీవోలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. 
అంతేెకాదు గత ప్రభుత్వంలో జరిగిన కీలక ప్రాజెక్టుల విషయంలోనూ ప్రభుత్వం ఆచితూచిగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వ ఖజానాను ఆదా చేసేందుకు రివర్స్ టెండరింగ్ కు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ లో రూ.780 కోట్లు ఆదా చేసిన విషయం తెలిసిందే.

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...