Skip to main content

జగన్ సర్కార్ కి నిధుల కొరత: రైతు రుణమాఫీ నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ

Shortage of funds for ys jagan government: The government stopped the farmer loan waiver
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు రుణమాఫీని నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉన్న 4,5 విడతల బకాయిలను నిలిపివేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. 
4, 5 విడతలకు సంబంధించి రూ.7959.12 కోట్లు చెల్లింపును నిలిపివేస్తూ వైసీపీ ప్రభుత్వం విడుదల చేసింది. నిధులు లేకపోవడంతో రుణమాఫీ చేయలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే గత ప్రభుత్వం మార్చిలో విడుదల చేసిన జీవోను నిలిపివేసింది. తాజాగా జీవో 99 విడుల చేసిన ప్రభుత్వం. 
ఇకపోతే బుధవారం రైతు భరోసా పథకంపై సమీక్ష నిర్వహించారు సీఎం వైయస్ జగన్. అనంతరం వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య రుణమాఫీ రద్దు చేస్తూ జీవో 38ను రద్దు చేస్తూ కొత్త జీవోను విడుదల చేశారు. 
అయితే రైతు భరోసా పథకం అమలు చేస్తున్న నేపథ్యంలోనే రైతు రుణమాఫీని రద్దు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం విడుదల చేసిన జీవోను రద్దు చేస్తూ రైతు భరోసా పథకం అమలు చేస్తున్నట్లు తెలుపుతూ జీవో 99ని విడదుల చేశారు. 
వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై తెలుగుదేశం పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక జీవోలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. 
అంతేెకాదు గత ప్రభుత్వంలో జరిగిన కీలక ప్రాజెక్టుల విషయంలోనూ ప్రభుత్వం ఆచితూచిగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వ ఖజానాను ఆదా చేసేందుకు రివర్స్ టెండరింగ్ కు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ లో రూ.780 కోట్లు ఆదా చేసిన విషయం తెలిసిందే.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...