Skip to main content

చంద్రబాబు, ఆయన బృందానికి పిచ్చి ముదిరింది...! ఎమ్మెల్యే రోజా

బాక్సైట్ తవ్వకాలను తామే రద్దు చేశామంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పడం పై ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలో భాగంగానే విశాఖలో బాక్సౌట్‌ తవ్వకాలను రద్దు చేశారని ఆమె తెలిపారు. విశాఖ మన్యంలో గిరిజనులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఘనత వైఎస్ఆర్‌సీపీకే దక్కుతుందని ఆమె చెప్పారు. మొత్తం అయిదు జీవోల ద్వార బాక్సైట్ తవ్వకాలకు వైఎఎస్‌ఆర్ ప్రభుత్వం రద్దు చేసిందని అన్నారు.అయితే చంద్రబాబు నాయుడు బాక్సైట్ తవ్వకాలను రద్దు చేశామని చెప్పుకోవడం సిగ్గు చేటని దుయ్యబట్టారు. చంద్రబాబుతో పాటు ఆయన వర్గానికి పిచ్చి బాగా ముదిరిపోయిందని ఈ సంధర్భంగా విమర్శించారు. వారిని మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాలని ఎద్దేవా చేసిన ఆమె చంద్రబాబు విధానాల వల్ల ఓ గిరిజన ఎమ్మెల్యే మావోయిస్టుల చేతిలో హతమయ్యారని ఆరోపించారు.విశాఖ ఏజెన్సీలో గత ప్రభుత్వం 30 ఏళ్ల పాటు లీజుకిచ్చిన బాక్సైట్‌ తవ్వకాల అనుమతిని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.... అనంతగిరి రిజర్వ్‌ ఫారెస్ట్‌, జెర్రెల బ్లాక్ , గాలికొండ, చిత్తమగొండి, రక్తికొండ, చింతపల్లి రిజర్వ్‌ ఫారెస్ట్‌ గ్రామాల్లో బాక్సైట్‌ అనుమతులను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రద్దు చేసింది. అయితే బాక్సైట్ తవ్వకాలను ఇదివరకే తాము రద్దు చేశామని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు.గతంలోనే రద్దు చేసిన తవ్వకాలను ఎన్నిసార్లు రద్దు చేస్తారంటూ ఆయన ప్రశ్నించారు.

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...