Skip to main content

చైనాలో ముస్లింలపై జరుగుతున్న దారుణాలపై ఎందుకు మాట్లాడటం లేదు?: ఇమ్రాన్ కు అమెరికా సూటి ప్రశ్న

జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్ ను దోషిగా నిలబెట్టడానికి పాకిస్తాన్ ఎన్నో ప్రయత్నాలు చేసినా... అన్నింటా విఫలమైంది. అంతర్జాతీయ సమాజం ముందు ఏకాకిగా నిలబడింది. ఒక్క చైనా మాత్రమే పాక్ పక్షాన నిలబడింది.

మరోవైపు, ఐక్యరాజ్యసమతి సాధారణ సమావేశాల సందర్భంగా కశ్మీర్ లో ముస్లింలు అణచివేతకు గురవుతున్నారని, మానవహక్కుల హననం జరుగుతోందంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి గగ్గోలు పెట్టారు. ఈ వ్యాఖ్యలపై అమెరికా తీవ్రంగా స్పందించింది.

ముస్లింల విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్న ఇమ్రాన్ ఖాన్... కశ్మీర్ ను దాటి చైనాలో జరుగుతున్న దారుణాల గురించి కూడా మాట్లాడాలని అమెరికా ఉన్నతాధికారి అలైస్ వెల్స్ అన్నారు. కశ్మీర్ గురించి ఇమ్రాన్ చేస్తున్న వ్యాఖ్యలు పాకిస్థాన్ కు ఏ మాత్రం లబ్ఢిని చేకూర్చబోవని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమ చైనాలో దాదాపు 10 లక్షల మంది ఉయిగర్లు, టర్కీ మాట్లాడే ఇతర ముస్లింలు తీవ్ర అణచివేతకు గురవుతున్నారని చెప్పారు. వీరందరినీ చైనా ప్రత్యేక క్యాంపుల్లో నిర్బంధించి, హింసిస్తోందని విమర్శించారు.

చైనాలో అణచివేతకు గురవుతున్న ముస్లింల గురించి కూడా ఇమ్రాన్ ఖాన్ మాట్లాడాలని అలైస్ అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో చైనాలో అణచివేతకు గురవుతున్న ముస్లింలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందని చెప్పారు.

మరోవైపు ఈ అంశంపై మాట్లాడేందుకు ఇమ్రాన్ ఖాన్ తిరస్కరించారు. చైనాతో తమకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని... ఈ అంశంపై తాము ప్రైవేటుగానే చర్చిస్తామని చెప్పారు.

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...

కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమే.. యుద్ధం వస్తే మేం సిద్ధం : ఇమ్రాన్‌

జమ్ముకశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. శుక్రవారం నాడు 74వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. ఐరాస వేదికగా కవ్వింపు ప్రకటన చేశారు. కశ్మీర్‌ను కేవలం రాజకీయం కోసం మాత్రమే వాడుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.   ప్రపంచం ఏం చేసింది?.   బాలాకోట్‌లో 500 మంది తీవ్రవాదులు రెడీగా ఉన్నారని ఇండియా రక్షణ మంత్రి చెబుతున్నారు. 500 మంది తీవ్రవాదులను పంపి మేమేం సాధిస్తాం?. 500 మంది తీవ్రవాదులను పంపాల్సిన అవసరం మాకేంటి.?. ఇస్లామిక్ టెర్రరిజం అంటూ ఇండియా మాపై ముద్ర వేస్తుంది. కశ్మీరీల హక్కులు ఎవరికీ పట్టవు. కశ్మీర్‌లో అనుసరిస్తున్న విధానాలు భారత్‌లో ఉన్న ముస్లింలపై ఎలా ప్రభావం చూపుతాయో మోదీ ఆలోచించారా?. 10 లక్షల మంది రోహింగ్యాలను బర్మా నుంచి గెంటేస్తే ప్రపంచం ఏం చేసింది?. ఇలాంటి పరిణామాలే ఇస్లాం సమాజంలో ఆవేదన, అసంతృప్తిని రేపుతున్నాయి ’  అని ఇమ్రాన్ ఆగ్రహ వ్యక్తం చేశారు. యుద్ధం వస్తే మేం సిద్ధం! ‘ ఇప్పుడు చాలా సంక్లిష్టం సమయం నడుస్తోంది. అణ్వాయుధాలున్న రెండు దేశాలు తలపడాల్స...