Skip to main content

చైనాలో ముస్లింలపై జరుగుతున్న దారుణాలపై ఎందుకు మాట్లాడటం లేదు?: ఇమ్రాన్ కు అమెరికా సూటి ప్రశ్న

జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్ ను దోషిగా నిలబెట్టడానికి పాకిస్తాన్ ఎన్నో ప్రయత్నాలు చేసినా... అన్నింటా విఫలమైంది. అంతర్జాతీయ సమాజం ముందు ఏకాకిగా నిలబడింది. ఒక్క చైనా మాత్రమే పాక్ పక్షాన నిలబడింది.

మరోవైపు, ఐక్యరాజ్యసమతి సాధారణ సమావేశాల సందర్భంగా కశ్మీర్ లో ముస్లింలు అణచివేతకు గురవుతున్నారని, మానవహక్కుల హననం జరుగుతోందంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి గగ్గోలు పెట్టారు. ఈ వ్యాఖ్యలపై అమెరికా తీవ్రంగా స్పందించింది.

ముస్లింల విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్న ఇమ్రాన్ ఖాన్... కశ్మీర్ ను దాటి చైనాలో జరుగుతున్న దారుణాల గురించి కూడా మాట్లాడాలని అమెరికా ఉన్నతాధికారి అలైస్ వెల్స్ అన్నారు. కశ్మీర్ గురించి ఇమ్రాన్ చేస్తున్న వ్యాఖ్యలు పాకిస్థాన్ కు ఏ మాత్రం లబ్ఢిని చేకూర్చబోవని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమ చైనాలో దాదాపు 10 లక్షల మంది ఉయిగర్లు, టర్కీ మాట్లాడే ఇతర ముస్లింలు తీవ్ర అణచివేతకు గురవుతున్నారని చెప్పారు. వీరందరినీ చైనా ప్రత్యేక క్యాంపుల్లో నిర్బంధించి, హింసిస్తోందని విమర్శించారు.

చైనాలో అణచివేతకు గురవుతున్న ముస్లింల గురించి కూడా ఇమ్రాన్ ఖాన్ మాట్లాడాలని అలైస్ అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో చైనాలో అణచివేతకు గురవుతున్న ముస్లింలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందని చెప్పారు.

మరోవైపు ఈ అంశంపై మాట్లాడేందుకు ఇమ్రాన్ ఖాన్ తిరస్కరించారు. చైనాతో తమకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని... ఈ అంశంపై తాము ప్రైవేటుగానే చర్చిస్తామని చెప్పారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...