Skip to main content

చైనాలో ముస్లింలపై జరుగుతున్న దారుణాలపై ఎందుకు మాట్లాడటం లేదు?: ఇమ్రాన్ కు అమెరికా సూటి ప్రశ్న

జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్ ను దోషిగా నిలబెట్టడానికి పాకిస్తాన్ ఎన్నో ప్రయత్నాలు చేసినా... అన్నింటా విఫలమైంది. అంతర్జాతీయ సమాజం ముందు ఏకాకిగా నిలబడింది. ఒక్క చైనా మాత్రమే పాక్ పక్షాన నిలబడింది.

మరోవైపు, ఐక్యరాజ్యసమతి సాధారణ సమావేశాల సందర్భంగా కశ్మీర్ లో ముస్లింలు అణచివేతకు గురవుతున్నారని, మానవహక్కుల హననం జరుగుతోందంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి గగ్గోలు పెట్టారు. ఈ వ్యాఖ్యలపై అమెరికా తీవ్రంగా స్పందించింది.

ముస్లింల విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్న ఇమ్రాన్ ఖాన్... కశ్మీర్ ను దాటి చైనాలో జరుగుతున్న దారుణాల గురించి కూడా మాట్లాడాలని అమెరికా ఉన్నతాధికారి అలైస్ వెల్స్ అన్నారు. కశ్మీర్ గురించి ఇమ్రాన్ చేస్తున్న వ్యాఖ్యలు పాకిస్థాన్ కు ఏ మాత్రం లబ్ఢిని చేకూర్చబోవని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమ చైనాలో దాదాపు 10 లక్షల మంది ఉయిగర్లు, టర్కీ మాట్లాడే ఇతర ముస్లింలు తీవ్ర అణచివేతకు గురవుతున్నారని చెప్పారు. వీరందరినీ చైనా ప్రత్యేక క్యాంపుల్లో నిర్బంధించి, హింసిస్తోందని విమర్శించారు.

చైనాలో అణచివేతకు గురవుతున్న ముస్లింల గురించి కూడా ఇమ్రాన్ ఖాన్ మాట్లాడాలని అలైస్ అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో చైనాలో అణచివేతకు గురవుతున్న ముస్లింలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందని చెప్పారు.

మరోవైపు ఈ అంశంపై మాట్లాడేందుకు ఇమ్రాన్ ఖాన్ తిరస్కరించారు. చైనాతో తమకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని... ఈ అంశంపై తాము ప్రైవేటుగానే చర్చిస్తామని చెప్పారు.

Comments

Popular posts from this blog

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.

బోటు వెలికితీత మరింత ఆలస్యం

కచ్చులూరు వద్ద మునిగిన బోటును రేపు వెలికితీస్తామని ధర్మాడి సత్యం తెలిపారు. బోటు వెలికితీత కోసం రెండోరోజు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు చెప్పారు. వాతావరణం అనుకూలించనందువల్లే ఈ ఆలస్యం జరుగుతుందని వివరించారు. గోదావరిలో వరద ప్రహహం తగ్గిన కారణంగా బోటును రేపు బయటికి తీస్తామని స్పష్టం చేశారు. కాగా.. ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు తగిలి కదిలిందని స్థానికులు తెలిపారు.