Skip to main content

హైదరాబాద్‌‌పై వరుణుడు పగ... మరో మూడ్రోజులు కుండపోతే...!

హైదరాబాద్‌‌పై వరుణుడు పగబట్టాడు. రెండ్రోజులుగా కురుస్తోన్న కుండపోత వర్షానికి నగరం మొత్తం అతలాకుతలమవుతోంది. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోతోంది. కుంభవృష్టితో మొత్తం నగరమే అల్లకల్లోలంగా మారుతోంది. రోడ్లన్నీ కాలువల్లా, కాలనీలు చెరువుల్లా మారుతున్నాయి. మంగళవారం కురిసిన వర్షానికి హైదరాబాద్‌లో నాలాలు పొంగి పొర్లుతున్నాయి. మ్యాన్ హోల్స్ ఉప్పొంగుతున్నాయి. ఇక, లోతట్టు ప్రాంతాలైతే జలమయం కాగా, పలుచోట్ల కాలనీలు నీట మునిగాయి. శివారు ప్రాంతాల్లో అయితే వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో హైదరాబాదీల బాధలు వర్ణణాతీతంగా మారాయి.
ఎస్సార్‌నగర్, ఎర్రగడ్డ, అమీ‌ర్‌‌పేట్‌, పంజగుట్ట, ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మెహిదీపట్నం, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్‌, ముషీరాబాద్‌, గాం‎ధీనగర్‌, చిక్కడపల్లి, అశోక్‌నగర్, సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, యూసుఫ్‌గూడ, బోరబండ, నాంపల్లి, మియాపూర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, సనత్‌నగర్, ఉప్పల్‌, నేరేడ్‌మెట్, ఏఎస్‌రావు, తిరుమలగిరి, బాలానగర్‌, అల్వాల్‌, షేక్‌పేట్, ఆసిఫ్‌నగర్, దిల్‌సుఖ్‌‌నగర్‌, ఎల్బీనగర్‌, హయత్‌నగర్... ఇలా అన్ని ప్రాంతాల్లోనూ 10 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. కొన్నిచోట్ల రికార్డు స్థాయిలో 12 సెంటీమీటర్లు దాటి వర్షం పడింది.
ఇక, మాదాపూర్ అయ్యప్ప సొసైటీ, నీరూస్ జంక్షన్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోయింది. అలాగే, మూసాపేట్ దీన్‌దయాల్‌నగర్, ఈస్ట్ ఆనంద్‌బాద్‌లోని షిర్డీనగర్, బాలానగర్ మెయిన్‌రోడ్‌లోని నార్సాపూర్ క్రాస్‌రోడ్స్, ఎంజే మార్కెట్, అఫ్జల్‌గంజ్ ఫ్రూట్‌మార్కెట్, అల్వాల్ రాజీవ్‌నగర్ కాలనీ, తార్నాక క్రాస్‌రోడ్స్, ఆలుగడ్డబావి ఓల్‌ఫెంటా బ్రిడ్జీ, సికింద్రాబాద్ కర్బలా మైదాన్ తదితర ప్రాంతాల్లోనూ ప్రధాన రహదారులపై మోకాళ్లలోతు నీరు నిలిచింది. అదేవిధంగా కాచిగూడ, భోలక్‌పూర్ పద్మశాలికాలనీ తదితర ప్రాంతాల్లో సైతం పెద్దఎత్తున వర్షపు నీరు వచ్చిచేరింది. దాంతో జీహెచ్‌ఎంసీ రెస్పాన్స్ టీమ్స్‌ రంగంలోకి దిగి నీటిని తొలగించాయి. పలుచోట్ల నీళ్లు నిలిచిన ప్రాంతాల్లో మోటార్ల ద్వారా ఎత్తిపోశారు. అమీర్‌పేట్, ఎస్సార్‌నగర్, ఎర్రగడ్డ తదితర ప్రాంతాల్లో వరద ప్రవాహానికి పార్కింగ్ చేసిన బైక్స్ కొట్టుకుపోయాయి.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...