Skip to main content

గూగుల్ కార్యాలయంలో మేకలు ఎందుకు తిరుగుతాయి?

ఇంటర్నెట్‌లో అందరి సందేహాలూ తీర్చే గూగుల్‌కు నేటితో 21 ఏళ్లు నిండాయి.
ఆధునిక సమాజంలో నిత్యావసరం అయిపోయిన ఈ సెర్చ్ ఇంజిన్ సెప్టెంబర్ 27న పుట్టిన రోజు జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా గూగుల్ గురించి ఆసక్తికరమైన 21 విషయాలు ఇవిగో..
1. ప్రపంచంలో అత్యధిక మంది సందర్శించే వెబ్‌సైట్ గూగుల్ అనేది చాలా మందికి తెలుసు. కానీ, గూగుల్ పోటీదారు అయిన బింగ్ సెర్చ్ ఇంజిన్‌లో జనాలు ఎక్కువగా వెతికే పదాల్లో గూగుల్ కూడా ఒకటి.
2. ల్యారీ పేజ్, సెర్జీ బ్రిన్ అనే ఇద్దరు కాలేజీ విద్యార్థులు కలిసి గూగుల్‌ను ప్రారంభించారు. వెబ్‌సైట్‌ల ర్యాంక్‌లను వాటికి అనుసంధానమయ్యే లింక్‌లు మిగతా వెబ్‌పేజీల్లో ఎంత ఎక్కువగా ఉన్నాయనేది పరిగణనలోకి తీసుకుని నిర్ణయించేలా ఈ సెర్చ్ ఇంజిన్‌ను రూపొందించారు.
3. 'గూగోల్' అన్న పదం నుంచి గూగుల్ వచ్చింది. ఒకటి పక్కన వంద సున్నాలు ఉండే సంఖ్యను గూగోల్ అంటారు. తమ వెబ్‌సైట్‌లో చాలా సమాచారం దొరుకుతుందన్న విషయాన్ని ప్రతిబింబించేలా ఈ పేరును ఎంచుకున్నారు.
4. ముఖ్యమైన సందర్భాల్లో గూగుల్ హోం పేజీలో లోగో స్థానంలో డూడుల్స్‌ను పెట్టే పద్ధతి 1998లో బర్నింగ్ మ్యాన్ అనే ఉత్సవంతో మొదలైంది. తాము ఆఫీస్ వదిలిపెట్టి, అక్కడికి వెళ్లామని వేరేవాళ్లకు తెలిపేందుకు గూగుల్ ఫౌండర్స్ ఆ పని చేశారు.
5. ఇంగ్లిష్ గాయకుడు జాన్ లెనన్ 70వ జన్మదినం సందర్భంగా తొలిసారిగా గూగుల్ వీడియో డూడుల్‌ను తెచ్చింది.
6. మొట్ట మొదటి గూగుల్ సర్వర్‌ను పెట్టేందుకు లెగోలతో తయారు చేసిన ఓ పెట్టె ఉపయోగించారు.
7. అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రంలోని సిలికాన్ వ్యాలీలో గూగుల్ ప్రధాన కార్యాలయం గూగుల్‌ప్లెక్స్ ఉంది.
8. గూగుల్‌ప్లెక్స్‌లో ఒక పెద్ద టీ-రెక్స్ డైనోసార్ బొమ్మ ఉంది. డైనోసార్లలా కంపెనీ అంతరించిపోకూడదని ఉద్యోగులకు గుర్తుచేసేందుకు దీన్ని పెట్టారని చెబుతుంటారు.
9. గూగుల్‌ప్లెక్స్‌లోని పచ్చిక బయళ్లలో గడ్డిని కత్తిరించేందుకు గూగుల్ లాన్‌మూవర్స్‌ను వినియోగించదు. గడ్డి బాగా పెరిగినప్పుడు, అక్కడ మేకలను మేపుతుంటారు.
10. ఉద్యోగులకు ఉచితంగా భోజనం పెట్టడం మొదలుపెట్టిన తొలి భారీ టెక్ సంస్థ గూగులే. ఉద్యోగులు వారి పెంపుడు కుక్కలను కూడా ఆఫీస్‌కు వెంట తెచ్చుకోవచ్చు.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

మరోసారి రంగంలోకి దిగిన ధర్మాడి సత్యం... ఓ చిన్నారి కోసం అన్వేషణ!

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దీప్తిశ్రీ అనే ఏడేళ్ల చిన్నారి అదృశ్యం కావడం సంచలనం సృష్టించింది. దీప్తిశ్రీని  హత్యచేసి ఇంద్రపాలెం వద్ద ఉప్పుటేరులో పడవేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. అమె సవతి తల్లి శాంతకుమారి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటుందని దీప్తిశ్రీ బంధువులు ఆరోపిస్తున్నారు. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో కీలక సమాచారం అందజేసినట్టు తెలుస్తోంది. శాంతకుమారి ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇంద్రపాలెం లాకుల వద్ద దీప్తిశ్రీ మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. అందుకోసం పోలీసులు ధర్మాడి సత్యం బృందం సాయం కోరారు. ఇటీవలే గోదావరి నదిలో బోటును వెలికితీసిన ధర్మాడి సత్యం ఓ చిన్నారి కోసం వెంటనే స్పందించారు. తన బృందంతో ఉప్పుటేరులో గాలింపు చేపట్టారు. అయితే, 30 గంటలు గడిచిన తర్వాతే మృతదేహం నీటిపై తేలుతుందని, ఈలోపు తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని ధర్మాడి సత్యం తెలిపారు.