Skip to main content

గూగుల్ కార్యాలయంలో మేకలు ఎందుకు తిరుగుతాయి?

ఇంటర్నెట్‌లో అందరి సందేహాలూ తీర్చే గూగుల్‌కు నేటితో 21 ఏళ్లు నిండాయి.
ఆధునిక సమాజంలో నిత్యావసరం అయిపోయిన ఈ సెర్చ్ ఇంజిన్ సెప్టెంబర్ 27న పుట్టిన రోజు జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా గూగుల్ గురించి ఆసక్తికరమైన 21 విషయాలు ఇవిగో..
1. ప్రపంచంలో అత్యధిక మంది సందర్శించే వెబ్‌సైట్ గూగుల్ అనేది చాలా మందికి తెలుసు. కానీ, గూగుల్ పోటీదారు అయిన బింగ్ సెర్చ్ ఇంజిన్‌లో జనాలు ఎక్కువగా వెతికే పదాల్లో గూగుల్ కూడా ఒకటి.
2. ల్యారీ పేజ్, సెర్జీ బ్రిన్ అనే ఇద్దరు కాలేజీ విద్యార్థులు కలిసి గూగుల్‌ను ప్రారంభించారు. వెబ్‌సైట్‌ల ర్యాంక్‌లను వాటికి అనుసంధానమయ్యే లింక్‌లు మిగతా వెబ్‌పేజీల్లో ఎంత ఎక్కువగా ఉన్నాయనేది పరిగణనలోకి తీసుకుని నిర్ణయించేలా ఈ సెర్చ్ ఇంజిన్‌ను రూపొందించారు.
3. 'గూగోల్' అన్న పదం నుంచి గూగుల్ వచ్చింది. ఒకటి పక్కన వంద సున్నాలు ఉండే సంఖ్యను గూగోల్ అంటారు. తమ వెబ్‌సైట్‌లో చాలా సమాచారం దొరుకుతుందన్న విషయాన్ని ప్రతిబింబించేలా ఈ పేరును ఎంచుకున్నారు.
4. ముఖ్యమైన సందర్భాల్లో గూగుల్ హోం పేజీలో లోగో స్థానంలో డూడుల్స్‌ను పెట్టే పద్ధతి 1998లో బర్నింగ్ మ్యాన్ అనే ఉత్సవంతో మొదలైంది. తాము ఆఫీస్ వదిలిపెట్టి, అక్కడికి వెళ్లామని వేరేవాళ్లకు తెలిపేందుకు గూగుల్ ఫౌండర్స్ ఆ పని చేశారు.
5. ఇంగ్లిష్ గాయకుడు జాన్ లెనన్ 70వ జన్మదినం సందర్భంగా తొలిసారిగా గూగుల్ వీడియో డూడుల్‌ను తెచ్చింది.
6. మొట్ట మొదటి గూగుల్ సర్వర్‌ను పెట్టేందుకు లెగోలతో తయారు చేసిన ఓ పెట్టె ఉపయోగించారు.
7. అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రంలోని సిలికాన్ వ్యాలీలో గూగుల్ ప్రధాన కార్యాలయం గూగుల్‌ప్లెక్స్ ఉంది.
8. గూగుల్‌ప్లెక్స్‌లో ఒక పెద్ద టీ-రెక్స్ డైనోసార్ బొమ్మ ఉంది. డైనోసార్లలా కంపెనీ అంతరించిపోకూడదని ఉద్యోగులకు గుర్తుచేసేందుకు దీన్ని పెట్టారని చెబుతుంటారు.
9. గూగుల్‌ప్లెక్స్‌లోని పచ్చిక బయళ్లలో గడ్డిని కత్తిరించేందుకు గూగుల్ లాన్‌మూవర్స్‌ను వినియోగించదు. గడ్డి బాగా పెరిగినప్పుడు, అక్కడ మేకలను మేపుతుంటారు.
10. ఉద్యోగులకు ఉచితంగా భోజనం పెట్టడం మొదలుపెట్టిన తొలి భారీ టెక్ సంస్థ గూగులే. ఉద్యోగులు వారి పెంపుడు కుక్కలను కూడా ఆఫీస్‌కు వెంట తెచ్చుకోవచ్చు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...