Skip to main content

గూగుల్ కార్యాలయంలో మేకలు ఎందుకు తిరుగుతాయి?

ఇంటర్నెట్‌లో అందరి సందేహాలూ తీర్చే గూగుల్‌కు నేటితో 21 ఏళ్లు నిండాయి.
ఆధునిక సమాజంలో నిత్యావసరం అయిపోయిన ఈ సెర్చ్ ఇంజిన్ సెప్టెంబర్ 27న పుట్టిన రోజు జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా గూగుల్ గురించి ఆసక్తికరమైన 21 విషయాలు ఇవిగో..
1. ప్రపంచంలో అత్యధిక మంది సందర్శించే వెబ్‌సైట్ గూగుల్ అనేది చాలా మందికి తెలుసు. కానీ, గూగుల్ పోటీదారు అయిన బింగ్ సెర్చ్ ఇంజిన్‌లో జనాలు ఎక్కువగా వెతికే పదాల్లో గూగుల్ కూడా ఒకటి.
2. ల్యారీ పేజ్, సెర్జీ బ్రిన్ అనే ఇద్దరు కాలేజీ విద్యార్థులు కలిసి గూగుల్‌ను ప్రారంభించారు. వెబ్‌సైట్‌ల ర్యాంక్‌లను వాటికి అనుసంధానమయ్యే లింక్‌లు మిగతా వెబ్‌పేజీల్లో ఎంత ఎక్కువగా ఉన్నాయనేది పరిగణనలోకి తీసుకుని నిర్ణయించేలా ఈ సెర్చ్ ఇంజిన్‌ను రూపొందించారు.
3. 'గూగోల్' అన్న పదం నుంచి గూగుల్ వచ్చింది. ఒకటి పక్కన వంద సున్నాలు ఉండే సంఖ్యను గూగోల్ అంటారు. తమ వెబ్‌సైట్‌లో చాలా సమాచారం దొరుకుతుందన్న విషయాన్ని ప్రతిబింబించేలా ఈ పేరును ఎంచుకున్నారు.
4. ముఖ్యమైన సందర్భాల్లో గూగుల్ హోం పేజీలో లోగో స్థానంలో డూడుల్స్‌ను పెట్టే పద్ధతి 1998లో బర్నింగ్ మ్యాన్ అనే ఉత్సవంతో మొదలైంది. తాము ఆఫీస్ వదిలిపెట్టి, అక్కడికి వెళ్లామని వేరేవాళ్లకు తెలిపేందుకు గూగుల్ ఫౌండర్స్ ఆ పని చేశారు.
5. ఇంగ్లిష్ గాయకుడు జాన్ లెనన్ 70వ జన్మదినం సందర్భంగా తొలిసారిగా గూగుల్ వీడియో డూడుల్‌ను తెచ్చింది.
6. మొట్ట మొదటి గూగుల్ సర్వర్‌ను పెట్టేందుకు లెగోలతో తయారు చేసిన ఓ పెట్టె ఉపయోగించారు.
7. అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రంలోని సిలికాన్ వ్యాలీలో గూగుల్ ప్రధాన కార్యాలయం గూగుల్‌ప్లెక్స్ ఉంది.
8. గూగుల్‌ప్లెక్స్‌లో ఒక పెద్ద టీ-రెక్స్ డైనోసార్ బొమ్మ ఉంది. డైనోసార్లలా కంపెనీ అంతరించిపోకూడదని ఉద్యోగులకు గుర్తుచేసేందుకు దీన్ని పెట్టారని చెబుతుంటారు.
9. గూగుల్‌ప్లెక్స్‌లోని పచ్చిక బయళ్లలో గడ్డిని కత్తిరించేందుకు గూగుల్ లాన్‌మూవర్స్‌ను వినియోగించదు. గడ్డి బాగా పెరిగినప్పుడు, అక్కడ మేకలను మేపుతుంటారు.
10. ఉద్యోగులకు ఉచితంగా భోజనం పెట్టడం మొదలుపెట్టిన తొలి భారీ టెక్ సంస్థ గూగులే. ఉద్యోగులు వారి పెంపుడు కుక్కలను కూడా ఆఫీస్‌కు వెంట తెచ్చుకోవచ్చు.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...