Skip to main content

చంద్రబాబు, గన్నవరం ఎమ్మెల్యే వంశీకి హైకోర్టు నోటీసులు!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఎన్నికపై ప్రత్యర్థి హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికను సవాల్ చేస్తూ కుప్పం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కృష్ణ చంద్రమౌళి హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. నామినేషన్ సందర్భంగా చంద్రబాబు తన ఆదాయ వివరాలను అఫిడ్‌విట్‌లో వెల్లడించలేదని, ఇది ఎన్నికల నియమావళికి విరుద్దమని చంద్రమౌళి తరఫున ఎన్నికల ఏజెంట్ ఏఎస్ విద్యాసాగర్ దాఖలుచేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు చంద్రబాబుకు నోటీసులు జారీచేసింది. ఈ వ్యాజ్యంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ శనివారం విచారణ చేపట్టారు.
ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారితోపాటు వ్యాజ్యంలో ఇతర ప్రతివాదులకు నోటీసులు ఇచ్చారు. ఆదాయ మార్గాల వివరాలన్నింటినీ ఎన్నికల అఫిడ్‌విట్‌లో వెల్లడించకుండా చంద్రబాబు గోప్యత పాటించారని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పేర్కొన్నారు. ప్రభుత్వ నిధుల నుంచి ముఖ్యమంత్రిగా జీతం తీసుకున్న విషయాన్ని కూడా చంద్రబాబు పొందుపరచలేదని వివరించారు.

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...