Skip to main content

చంద్రబాబు, గన్నవరం ఎమ్మెల్యే వంశీకి హైకోర్టు నోటీసులు!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఎన్నికపై ప్రత్యర్థి హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికను సవాల్ చేస్తూ కుప్పం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కృష్ణ చంద్రమౌళి హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. నామినేషన్ సందర్భంగా చంద్రబాబు తన ఆదాయ వివరాలను అఫిడ్‌విట్‌లో వెల్లడించలేదని, ఇది ఎన్నికల నియమావళికి విరుద్దమని చంద్రమౌళి తరఫున ఎన్నికల ఏజెంట్ ఏఎస్ విద్యాసాగర్ దాఖలుచేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు చంద్రబాబుకు నోటీసులు జారీచేసింది. ఈ వ్యాజ్యంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ శనివారం విచారణ చేపట్టారు.
ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారితోపాటు వ్యాజ్యంలో ఇతర ప్రతివాదులకు నోటీసులు ఇచ్చారు. ఆదాయ మార్గాల వివరాలన్నింటినీ ఎన్నికల అఫిడ్‌విట్‌లో వెల్లడించకుండా చంద్రబాబు గోప్యత పాటించారని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పేర్కొన్నారు. ప్రభుత్వ నిధుల నుంచి ముఖ్యమంత్రిగా జీతం తీసుకున్న విషయాన్ని కూడా చంద్రబాబు పొందుపరచలేదని వివరించారు.

Comments

Popular posts from this blog

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.

బోటు వెలికితీత మరింత ఆలస్యం

కచ్చులూరు వద్ద మునిగిన బోటును రేపు వెలికితీస్తామని ధర్మాడి సత్యం తెలిపారు. బోటు వెలికితీత కోసం రెండోరోజు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు చెప్పారు. వాతావరణం అనుకూలించనందువల్లే ఈ ఆలస్యం జరుగుతుందని వివరించారు. గోదావరిలో వరద ప్రహహం తగ్గిన కారణంగా బోటును రేపు బయటికి తీస్తామని స్పష్టం చేశారు. కాగా.. ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు తగిలి కదిలిందని స్థానికులు తెలిపారు.