Skip to main content

వైకుంఠపురం టు శ్రీశైలం... బీజేపీపై ఉమ్మడి పోరుకు కేసీఆర్-జగన్ నిర్ణయం

Image result for kcr jagan
ముచ్చటగా మూడోసారి సమావేశమైన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముఖ్యంగా, గోదావరి జలాల వినియోగంపై చర్చించారు. గోదావరి బ్యాక్ వాటర్‌ను నాగార్జునసాగర్, శ్రీశైలానికి తరలించడం ద్వారా ఇటు తెలంగాణ, అటు రాయలసీమకు నీళ్లందించాలన్న ప్రతిపాదనపై దాదాపు నాలుగున్నర గంటలపాటు డిస్కషన్స్‌ చేశారు. గోదావరి జలాలను నాగార్జునసాగర్, శ్రీశైలానికి తరలించడం ద్వారా, తెలంగాణలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు.... ఏపీలో రాయలసీమకు తాగు-సాగునీరు అందించాలని భావిస్తున్నారు. గోదావరి జలాల తరలింపుపై ప్రధానంగా నాలుగు మార్గాలను ప్రతిపాదించారు. అయితే, అందులో వైకుంఠపురం నుంచి పులిచింతల... అక్కడ్నుంచి నాగార్జునసాగర్, శ్రీశైలానికి తరలించడమే ఇరురాష్ట్రాలకు ఉత్తమ మార్గమని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఒక్క మార్గంలో మాత్రమే, కొంతలో కొంత తక్కువ వ్యయంతో గోదావరి జలాల తరలింపు చేపట్టవచ్చని అంచనాకి వచ్చారు. వైకుంఠపురం టు నాగార్జునసాగర్, శ్రీశైలం మార్గంలో గోదావరి జలాల తరలింపు చేపట్టడానికి ప్రాథమికంగా 40వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని లెక్కగట్టారు.
ఇక, విభజన సమస్యలు, 9, 10 షెడ్యూల్ సంస్థల విభజన, ఆస్తుల పంపకాలపైనా కేసీఆర్, జగన్ చర్చించారు. అలాగే, విజయవాడలోని ఆప్మెల్ ఆస్తుల పంపకాలు, ఢిల్లీలో ఏపీ భవన్ విభజనపైనా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు, తెలుగు రాష్ట్రాల పట్ల కేంద్రం పక్షవాత వైఖరి చూపుతోందని కేసీఆర్, జగన్ అభిప్రాయపడినట్లు చెబుతున్నారు. అంతేకాదు, రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ బలపడటానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నందున... కాషాయదళాన్ని కలిసి ఎదుర్కోవాలని కేసీఆర్-జగన్ నిర్ణయానికి వచ్చారని అంటున్నారు.

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...

కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమే.. యుద్ధం వస్తే మేం సిద్ధం : ఇమ్రాన్‌

జమ్ముకశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. శుక్రవారం నాడు 74వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. ఐరాస వేదికగా కవ్వింపు ప్రకటన చేశారు. కశ్మీర్‌ను కేవలం రాజకీయం కోసం మాత్రమే వాడుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.   ప్రపంచం ఏం చేసింది?.   బాలాకోట్‌లో 500 మంది తీవ్రవాదులు రెడీగా ఉన్నారని ఇండియా రక్షణ మంత్రి చెబుతున్నారు. 500 మంది తీవ్రవాదులను పంపి మేమేం సాధిస్తాం?. 500 మంది తీవ్రవాదులను పంపాల్సిన అవసరం మాకేంటి.?. ఇస్లామిక్ టెర్రరిజం అంటూ ఇండియా మాపై ముద్ర వేస్తుంది. కశ్మీరీల హక్కులు ఎవరికీ పట్టవు. కశ్మీర్‌లో అనుసరిస్తున్న విధానాలు భారత్‌లో ఉన్న ముస్లింలపై ఎలా ప్రభావం చూపుతాయో మోదీ ఆలోచించారా?. 10 లక్షల మంది రోహింగ్యాలను బర్మా నుంచి గెంటేస్తే ప్రపంచం ఏం చేసింది?. ఇలాంటి పరిణామాలే ఇస్లాం సమాజంలో ఆవేదన, అసంతృప్తిని రేపుతున్నాయి ’  అని ఇమ్రాన్ ఆగ్రహ వ్యక్తం చేశారు. యుద్ధం వస్తే మేం సిద్ధం! ‘ ఇప్పుడు చాలా సంక్లిష్టం సమయం నడుస్తోంది. అణ్వాయుధాలున్న రెండు దేశాలు తలపడాల్స...