Skip to main content

బోటును వెలికితీసే పనులు కాకినాడకు చెందని ధర్మాడి సత్యానికి అప్పగింత

ఇటీవలే గోదావరి నదిలో బోటు మునిగిపోయి పెద్ద సంఖ్యలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ కొందరి ఆచూకీ తెలియరాలేదు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద నిండు గోదావరిలో బోటు మునిగిపోయింది. ఈ ప్రమాదం జరిగింది సెప్టెంబరు 15న కాగా, గోదావరి నదీ గర్భం నుంచి ఇప్పటివరకు బోటును వెలికితీయలేకపోయారు. దాదాపు 300 అడుగుల లోతున ఉన్న బోటును వెలికి తీసేందుకు ఎన్డీఆర్ఎఫ్ దళాలు కూడా వెనుకంజ వేశాయి. అయితే కొందరు ప్రయివేటు వ్యక్తులు బోటును బయటికి తీస్తామంటూ ముందుకు వచ్చినా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేకపోయింది.

అయితే, తమపై విమర్శలు తీవ్రమవుతున్న నేపథ్యంలో బోటును ప్రయివేటు వ్యక్తులతోనే వెలికితీయించాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది. ఈ మేరకు కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం అనే వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకుంది. రేపటినుంచే బోటు వెలికితీత పనులు మొదలుకానున్నాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రూ.22.70 లక్షలకు వర్క్ ఆర్డర్ జారీ చేశారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.