Skip to main content

ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ కంటే టీడీపీ ఖర్చే ఎక్కువ: ఎంతో తెలుసా?

Telugu Desam spent more than YSRC

ఏపీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ కంటే టీడీపీ అత్యధికంగా ఖర్చు చేసింది. ఈ ఎన్నికల్లో టీడీపీ రూ. 131 కోట్లను ఖర్చు చేసింది. వైఎస్ఆర్‌సీపీ కేవలం రూ.86 కోట్లను మాత్రమే ఖర్చుచేసినట్టుగా ప్రకటించింది.
తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాపై ఎక్కువగా ఖర్చు చేసింది. ఎస్ఎంఎస్‌లు, యూట్యూబ్, వెబ్‌సైట్ల ద్వారా టీడీపీ ఎక్కువగా తమ పార్టీ కార్యక్రమాలను ప్రచారంం చేసింది.  వైఎస్ఆర్‌సీపీ మాత్రం సోషల్ మీడియాపై తక్కువగానే ఖర్చు పెట్టింది. ఆ పార్టీ కేవలం రూ. 35 కోట్ల కంటే తక్కువ ఖర్చు చేసింది.
టీడీపీ, వైఎస్ఆర్‌సీపీతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదు రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీలు ఎన్నికల్లో తాము చేసిన ఖర్చును ఎన్నికల సంఘానికి అందించాయి.తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రం ఈ నెల 23వ తేదీ వరకు మాత్రం ఎన్నికల సంఘానికి తమ ఎన్నికల ఖర్చులను ఇవ్వలేదు.
ఏ రాజకీయ పార్టీయైనా ఎన్నికల ప్రచారంలో పాల్గొనే స్టార్ క్యాంపెయినర్లకు, సీనియర్ పార్టీ లీడర్ల ప్రచారం కోసం, మీడియా అడ్వర్‌టైజ్ మెంట్ల కోసం, పబ్లిసిటీ మెటీరియల్ కోసం, పబ్లిక్ మీటింగ్ ల కోసం ఖర్చు చేస్తారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ మీడియా అడ్వర్‌టైజ్ మెంట్ల కోసం రూ. 49 కోట్లను ఖర్చు చేసింది. ఇందులో వార్తా పత్రికలు, టీవీ చానెల్స్, బల్క్ ఎస్ఎంఎస్ లు, కేబుల్ టీవీల్లో ప్రచారం, వెబ్ సైట్, యూట్యూబ్ ద్వారా ప్రచారం కోసం ఖర్చు చేశారు. టీడీపీ ప్రచార సామాగ్రి కోసం రూ. 11 కోట్లు ఖర్చు చేసింది.
మరో వైపు టీడీపీ అనుసరించిన విధానాన్నే వైఎస్ఆర్‌సీపీ పాటించింది. ఈ రెండు పార్టీలు డిజిటల్ పద్దతిలో ప్రచారం కోసం గత ఎన్నికల కంటే ఎక్కువ నిధులను ఖర్చు చేశాయి.
2014 పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆన్‌లైన్ ప్రచారం కోసం రూ.400-500 కోట్లు ఖర్చు చేశారు. ఇది 2019 నాటికి రెట్టింపు అయింది.గూగుల్ పొలిటికల్ అడ్వర్‌టైజ్ మెంట్ ట్రాన్స్‌పరన్సీ రిపోర్ట్ ప్రకారంగా దేశ వ్యాప్తంగా అన్ని పార్టీలు రూ.86,311,600 కోట్లను ఖర్చు చేసినట్టుగా వెల్లడించింది. ఇది గతంతో పోలిస్తే ఎక్కువ అని ఆ సంస్థ ప్రకటించింది.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.