Skip to main content

పర్చూరులో మొదలైన జగన్ ఆట.. బీజేపీలోకి దగ్గుబాటి!!


పర్చూరులో దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు చెక్‌ పెట్టే దిశగా వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ పావులు కదుపుతున్నారా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు పార్టీకి గుడ్‌బై చెప్పిన రావి రామనాథంబాబును జగన్ స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన చేరిక విషయంపై దగ్గుబాటికి కనీస సమాచారం కూడా లేదని తెలుస్తోంది. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ల సమక్షంలో రామనాథంబాబును పార్టీలో చేర్చుకున్నారు. నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జిగా ఉన్న దగ్గుబాటి అక్కడ కనిపించలేదు. ఈ చేరిక విషయంలో దగ్గుబాటితో చర్చించిన దాఖలాలు కూడా లేవంటున్నారు.

గత ఫిబ్రవరి వరకూ పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా పని చేసిన రామనాథంబాబు.. ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. కుమారుడితో కలిసి దగ్గుబాటి వైసీపీలో చేరడం, దగ్గుబాటికి టికెట్ కేటాయించడంతో.. రామనాథంబాబు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఆయన చేరికతో.. టీడీపీ అభ్యర్థి ఏలూరు సాంబశివరావుకు కొంత బలం వచ్చింది. దాంతో ఆయన విజయం సాధించారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు రామనాథంబాబును స్వయంగా జగన్‌ కండువాకప్పి పార్టీలో చేర్చుకోవడం చర్చనీయాంశమైంది. నిజానికి ఇప్పటికిప్పుడు రామనాథంబాబును పార్టీలోకి తీసుకోవాల్సిన అవసరాలు ఏమీ లేవు. దీంతో.. ఎన్నికలలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన రామనాథంబాబును తిరిగి ఇంత ప్రాధాన్యత ఇచ్చి పార్టీలో చేర్చుకోవడంలో ఆంతర్యమేమిటన్న ప్రశ్న రాజకీయవర్గాలలో ఉత్పన్నమవుతోంది. దగ్గుబాటికి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతోనే రామనాథం బాబును పిలిచి మరీ పార్టీలో చేర్చుకున్నారని అంటున్నారు.
ఇటీవల బీజేపీ నేతలు వైసీపీ సర్కార్ పై విరుచుకుపడుతున్నారు. బీజేపీలో రాష్ట్ర నాయకురాలిగా ఉన్న దగ్గుబాటి సతీమణి పురందేశ్వరి కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మరోవైపు స్థానికంగా పార్టీశ్రేణులను దగ్గుబాటి ఏమాత్రం పట్టించుకోవడం లేదని కొందరు ఫిర్యాదు చేశారట. ఈ నేపథ్యంలో జగన్ దగ్గుబాటిని దూరం పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే రామనాథంబాబుని తిరిగి పార్టీలోకి చేర్చుకొని దగ్గుబాటికి పొమ్మనకుండా పొగపెడుతున్నారని అంటున్నారు. అంతేకాదు త్వరలోనే రామనాథంబాబుని పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించినా ఆశ్చర్యం లేదని ప్రచారం జరుగుతోంది. మరి దగ్గుబాటికి జగన్ నిజంగానే చెక్ పెడుతున్నారా? అదే జరిగితే దగ్గుబాటి ఏం చేస్తారు?. తాను కూడా బీజేపీలో చేరతారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బీజేపీ ఏపీలో బలపడాలని చూస్తోంది. ఇప్పటికే పలువురు నేతలను చేర్చుకుంది. ఈ నేతల జాబితాలో దగ్గుబాటి కూడా చేరొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే దగ్గుబాటి సతీమణి పురందేశ్వరి బీజేపీలో ఉన్నారు. తాను కూడా బీజేపీలో చేరితే కుటుంబమంతా ఒకే పార్టీలో ఉన్నట్టుంటుందన్న ఆలోచనలో దగ్గుబాటి ఉన్నట్లు తెలుస్తోంది. చూద్దాం మరి పర్చూరు వైసీపీ రాజకీయం ఎలాంటి మలుపులు తిరుగుతుందో.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...