మహారాష్ట్ర స్టేట్ కోపరేటివ్ బ్యాంక్ కుంభకోణానికి సంబంధించి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) అధ్యక్షుడు శరద్ఫవార్, మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి.) కేసులు నమోదు చేసింది. 25 వేల కోట్ల రూపాయిల కుంభకోణానికి సంబంధించి ఇ.డి. వీరిపై ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు (ఇసిఐఆర్) నమోదు చేసింది. ఇది పోలీసులు ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ కింద నమోదు చేసే ఎఫ్ఐఆర్తో సమానం. సహకార చక్కెర పరిశ్రమలకు రుణాల మంజూరులో అవకతవకలు జరిగాయని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Comments
Post a Comment