మహారాష్ట్ర స్టేట్ కోపరేటివ్ బ్యాంక్ కుంభకోణానికి సంబంధించి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) అధ్యక్షుడు శరద్ఫవార్, మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి.) కేసులు నమోదు చేసింది. 25 వేల కోట్ల రూపాయిల కుంభకోణానికి సంబంధించి ఇ.డి. వీరిపై ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు (ఇసిఐఆర్) నమోదు చేసింది. ఇది పోలీసులు ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ కింద నమోదు చేసే ఎఫ్ఐఆర్తో సమానం. సహకార చక్కెర పరిశ్రమలకు రుణాల మంజూరులో అవకతవకలు జరిగాయని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.
Comments
Post a Comment