ఏపీ సీఎం జగన్ కు లింగమనేని రమేశ్ ఓ లేఖ రాశారు. ఉండవల్లిలోని కృష్ణానది కరకట్టపై ఉన్న తమ ఇంటిని కూల్చివేస్తారన్న వార్తలు ఆందోళన కల్గిస్తున్నాయని పేర్కొన్నారు. ఉండవల్లి పంచాయతీ నుంచి అన్ని అనుమతులు తీసుకున్నాక, అన్ని నిబంధనల మేరకే ఆ ఇంటిని నిర్మించామని తెలిపారు. దీనిపై గతంలోనే సీఆర్డీఏ అధికారులకు వివరణ ఇచ్చినట్టు వివరించారు. బాధ్యత గల ఓ పౌరుడిగానే చంద్రబాబుకు తన ఇంటిని ఇచ్చానని, తనను చంద్రబాబు బినామీగా పేర్కొంటూ ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. తన కుటుంబాన్ని మానసిక వ్యథకు గురిచేస్తున్నారని ఆ లేఖలో వాపోయారు.
వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్పైవెళ్తున్న చాపర్తిన శేఖర్ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్ హైవే అంబులెన్స్ ద్వారా విజయవాడ ఈఎస్ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్ పక్కకు తొలగి అంబులెన్స్కు దారి ఇచ్చింది.
Comments
Post a Comment