ఏపీ సీఎం జగన్ కు లింగమనేని రమేశ్ ఓ లేఖ రాశారు. ఉండవల్లిలోని కృష్ణానది కరకట్టపై ఉన్న తమ ఇంటిని కూల్చివేస్తారన్న వార్తలు ఆందోళన కల్గిస్తున్నాయని పేర్కొన్నారు. ఉండవల్లి పంచాయతీ నుంచి అన్ని అనుమతులు తీసుకున్నాక, అన్ని నిబంధనల మేరకే ఆ ఇంటిని నిర్మించామని తెలిపారు. దీనిపై గతంలోనే సీఆర్డీఏ అధికారులకు వివరణ ఇచ్చినట్టు వివరించారు. బాధ్యత గల ఓ పౌరుడిగానే చంద్రబాబుకు తన ఇంటిని ఇచ్చానని, తనను చంద్రబాబు బినామీగా పేర్కొంటూ ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. తన కుటుంబాన్ని మానసిక వ్యథకు గురిచేస్తున్నారని ఆ లేఖలో వాపోయారు.
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Comments
Post a Comment