ఏపీ సీఎం జగన్ కు లింగమనేని రమేశ్ ఓ లేఖ రాశారు. ఉండవల్లిలోని కృష్ణానది కరకట్టపై ఉన్న తమ ఇంటిని కూల్చివేస్తారన్న వార్తలు ఆందోళన కల్గిస్తున్నాయని పేర్కొన్నారు. ఉండవల్లి పంచాయతీ నుంచి అన్ని అనుమతులు తీసుకున్నాక, అన్ని నిబంధనల మేరకే ఆ ఇంటిని నిర్మించామని తెలిపారు. దీనిపై గతంలోనే సీఆర్డీఏ అధికారులకు వివరణ ఇచ్చినట్టు వివరించారు. బాధ్యత గల ఓ పౌరుడిగానే చంద్రబాబుకు తన ఇంటిని ఇచ్చానని, తనను చంద్రబాబు బినామీగా పేర్కొంటూ ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. తన కుటుంబాన్ని మానసిక వ్యథకు గురిచేస్తున్నారని ఆ లేఖలో వాపోయారు.
నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.
Comments
Post a Comment