Skip to main content

వైసీపీ ప్రభుత్వం జాతి ద్రోహానికి పాల్పడింది : మాజీ మంత్రి దేవినేని ఉమా

Image result for DEVINENI UMAపోలవరం ప్రాజెక్టు విషయంలో వైసీపీ ప్రభుత్వం జాతి ద్రోహానికి పాల్పడిందని, రివర్స్ టెండరింగ్ డ్రామా నడిపి వైసీపీకి నచ్చిన మెగా కంపెనీకి రిజర్వ్ టెండరింగ్ కట్టబెట్టారని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ .....ఇంతవరకు ఎవరు ఎంతకు కోడ్ చేసింది.. ఏ విధంగా అనుమతులు ఇచ్చిందీ ప్రభుత్వం చెప్పలేకపోయిందన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో 38ని రద్దు చేయడం.. కోర్టు ఆదేశాలు కూడా పట్టించు కోకుండా రూ.7,980 కోట్లు రైతులకు లేకుండా చేశారని, జగన్ ప్రభుత్వం చేసిన మోసం‌పై రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారని దేవినేని ఉమా అన్నారు

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.