Skip to main content

వైసీపీ ప్రభుత్వం జాతి ద్రోహానికి పాల్పడింది : మాజీ మంత్రి దేవినేని ఉమా

Image result for DEVINENI UMAపోలవరం ప్రాజెక్టు విషయంలో వైసీపీ ప్రభుత్వం జాతి ద్రోహానికి పాల్పడిందని, రివర్స్ టెండరింగ్ డ్రామా నడిపి వైసీపీకి నచ్చిన మెగా కంపెనీకి రిజర్వ్ టెండరింగ్ కట్టబెట్టారని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ .....ఇంతవరకు ఎవరు ఎంతకు కోడ్ చేసింది.. ఏ విధంగా అనుమతులు ఇచ్చిందీ ప్రభుత్వం చెప్పలేకపోయిందన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో 38ని రద్దు చేయడం.. కోర్టు ఆదేశాలు కూడా పట్టించు కోకుండా రూ.7,980 కోట్లు రైతులకు లేకుండా చేశారని, జగన్ ప్రభుత్వం చేసిన మోసం‌పై రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారని దేవినేని ఉమా అన్నారు

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.