Skip to main content

శరద్ పవార్ నివాసంలో పోలీసుల సోదాలు..


Image result for SARAD PAWAR

మనీల్యాండరింగ్ కేసులో ఈడీ ముందు విచారణకు హాజరుకానున్న ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నివాసంలో పోలీసులు ఇవాళ విస్తృత సోదాలు నిర్వహించారు. జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సీపీ) వినయ్ చౌబే నేతృత్వంలో ఓ బృందం పవార్ 
ఇంటికి వెళ్లగా... పోలీసు జాగిలాలతో మరో బృందం ముంబైలోని ఎన్‌సీపీ కార్యాలయానికి వెళ్లింది. కాగా సోదాల సందర్భంగా ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా ముందస్తు జాత్తలన్నీ తీసుకున్నామనీ.. ఇప్పటికే 144 సెక్షన్ విధించామని ముంబై జోన్1 డీజీపీ సంగ్రామ్ సింగ్ నిషాందర్ పేర్కొన్నారు.
 

శరద్ పవార్ ఇవాళ ఈడీ ముందు విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో పోలీసులు గురువారమే ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఇక్కడ 144 సెక్షన్ విధించి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కాగా ఈడీ విచారణ ఎదుర్కోనున్న పవార్ నివాసానికి ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ కూడా చేరుకున్నారు. ఈ సందర్భంగా మాలిక్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ముంబై సహా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఎన్సీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఇది సరికాదు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు శరద్ పవార్ ఎట్టిపరిస్థితుల్లోనూ ఈడీ కార్యాలయానికి వెళ్తారు. బీజేపీ ప్రభుత్వం ఈడీని దుర్వినియోగం చేస్తోంది....’’ అని పేర్కొన్నారు. రూ.5 వేల కోట్ల మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు (ఎంఎస్‌సీబీ) కుంభకోణం కేసులో శరద్ పవార్, అజిత్ పవార్ సహా పలువురు ఎన్సీపీ నేతలపై ఈడీ కేసు నమోదు చేసింది.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.