Skip to main content

శరద్ పవార్ నివాసంలో పోలీసుల సోదాలు..


Image result for SARAD PAWAR

మనీల్యాండరింగ్ కేసులో ఈడీ ముందు విచారణకు హాజరుకానున్న ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నివాసంలో పోలీసులు ఇవాళ విస్తృత సోదాలు నిర్వహించారు. జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సీపీ) వినయ్ చౌబే నేతృత్వంలో ఓ బృందం పవార్ 
ఇంటికి వెళ్లగా... పోలీసు జాగిలాలతో మరో బృందం ముంబైలోని ఎన్‌సీపీ కార్యాలయానికి వెళ్లింది. కాగా సోదాల సందర్భంగా ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా ముందస్తు జాత్తలన్నీ తీసుకున్నామనీ.. ఇప్పటికే 144 సెక్షన్ విధించామని ముంబై జోన్1 డీజీపీ సంగ్రామ్ సింగ్ నిషాందర్ పేర్కొన్నారు.
 

శరద్ పవార్ ఇవాళ ఈడీ ముందు విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో పోలీసులు గురువారమే ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఇక్కడ 144 సెక్షన్ విధించి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కాగా ఈడీ విచారణ ఎదుర్కోనున్న పవార్ నివాసానికి ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ కూడా చేరుకున్నారు. ఈ సందర్భంగా మాలిక్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ముంబై సహా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఎన్సీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఇది సరికాదు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు శరద్ పవార్ ఎట్టిపరిస్థితుల్లోనూ ఈడీ కార్యాలయానికి వెళ్తారు. బీజేపీ ప్రభుత్వం ఈడీని దుర్వినియోగం చేస్తోంది....’’ అని పేర్కొన్నారు. రూ.5 వేల కోట్ల మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు (ఎంఎస్‌సీబీ) కుంభకోణం కేసులో శరద్ పవార్, అజిత్ పవార్ సహా పలువురు ఎన్సీపీ నేతలపై ఈడీ కేసు నమోదు చేసింది.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...