Skip to main content

శరద్ పవార్ నివాసంలో పోలీసుల సోదాలు..


Image result for SARAD PAWAR

మనీల్యాండరింగ్ కేసులో ఈడీ ముందు విచారణకు హాజరుకానున్న ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నివాసంలో పోలీసులు ఇవాళ విస్తృత సోదాలు నిర్వహించారు. జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సీపీ) వినయ్ చౌబే నేతృత్వంలో ఓ బృందం పవార్ 
ఇంటికి వెళ్లగా... పోలీసు జాగిలాలతో మరో బృందం ముంబైలోని ఎన్‌సీపీ కార్యాలయానికి వెళ్లింది. కాగా సోదాల సందర్భంగా ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా ముందస్తు జాత్తలన్నీ తీసుకున్నామనీ.. ఇప్పటికే 144 సెక్షన్ విధించామని ముంబై జోన్1 డీజీపీ సంగ్రామ్ సింగ్ నిషాందర్ పేర్కొన్నారు.
 

శరద్ పవార్ ఇవాళ ఈడీ ముందు విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో పోలీసులు గురువారమే ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఇక్కడ 144 సెక్షన్ విధించి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కాగా ఈడీ విచారణ ఎదుర్కోనున్న పవార్ నివాసానికి ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ కూడా చేరుకున్నారు. ఈ సందర్భంగా మాలిక్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ముంబై సహా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఎన్సీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఇది సరికాదు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు శరద్ పవార్ ఎట్టిపరిస్థితుల్లోనూ ఈడీ కార్యాలయానికి వెళ్తారు. బీజేపీ ప్రభుత్వం ఈడీని దుర్వినియోగం చేస్తోంది....’’ అని పేర్కొన్నారు. రూ.5 వేల కోట్ల మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు (ఎంఎస్‌సీబీ) కుంభకోణం కేసులో శరద్ పవార్, అజిత్ పవార్ సహా పలువురు ఎన్సీపీ నేతలపై ఈడీ కేసు నమోదు చేసింది.

Comments

Popular posts from this blog

ఎలన్ మస్క్... స్టార్ షిప్ రెడీ... వచ్చే ఏడాది మార్స్ చెంతకు ప్రయాణం

మార్స్ గ్రహంపైకి వన్ వే ట్రిప్‌గా ఆసక్తి ఉన్న ప్రజలను పంపుతానని ప్రకటించిన ఆమెరికా బిలియనీర్ వ్యాపారి ఎలన్ మస్క్... అన్నంత పనీ చేస్తున్నారు. మనుషుల్ని చందమామ, మార్స్ చెంతకు తీసుకెళ్లడం కోసం ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్... సరికొత్త విమానం తరహా స్పేస్ షిప్‌లను తయారుచేస్తోంది. ఇవి రాకెట్‌‌లా కాకుండా... విమానం లాగా... అంతరిక్షంలోకి వెళ్లి... గ్రహాలపై మనుషుల్ని దించేసి... తిరిగి ఖాళీగా వెనక్కి వచ్చేస్తాయి. గ్రహాలపైకి వెళ్లినవాళ్లు తిరిగి వచ్చే అవకాశాలు లేవు. ఇందుకు రిటర్న్ ట్రిప్ అవకాశం కల్పించట్లేదు ఎలన్ మస్క్. వన్ వే ట్రిప్‌గా వెళ్లేందుకు ఆసక్తి ఉన్నవారే టికెట్ బుక్ చేసుకోమని సూచిస్తున్నారు. తాజాగా ఆయన ఆవిష్కరించిన స్పేస్‌షిప్‌లో వంద మంది ప్రయాణించేందుకు వీలుంది. టెక్సాస్... బోకా చికాలో... ఎంతో మంది అంతరిక్ష ఔత్సాహికులు, రిపోర్టర్ల సమక్షంలో చందమామ, మార్స్‌పైకి పంపే స్టార్ షిప్‌ను ఆవిష్కరించారు ఎలన్ మస్క్. వచ్చే ఆరు నెలల్లో దాన్ని అంతరిక్షంలో ఓ రౌండ్ వేయించి... వచ్చే ఏడాది మనుషులను అందులో పంపాలనుకుంటున్నారు ఎలన్ మస్క్. ఎప్పుడో పదకొండు ఏళ్ల కిందట ఫాల్కన్-1 రాకెట్‌ను తయారుచేసింది స్పేస్ ఎక...

క్రెడిట్ పై పెట్రోలును కొనుగోలు చేస్తే నో క్యాష్‌బ్యాక్‌

క్రెడిట్‌ కార్డులను వినియోగించి పెట్రోలును కొనుగోలు చేస్తే ఇన్నాళ్లూ లభిస్తున్న 0.75 శాతం క్యాష్‌బ్యాక్‌ అక్టోబరు ఒకటో తేది నుంచి ఉండబోదని కంపెనీలు ప్ర‌క‌టించాయి.  2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే డిస్కౌంట్‌ ఇవ్వాలని చమురు కంపెనీలను కోరింది. దీంతో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి  2016 డిసెంబరు నుంచి క్రెడిట్‌, డెబిట్‌, ఈ-వాలెట్ల ద్వారా పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేసే వారికి 0.75శాతం డిస్కౌంట్‌ను క్యాష్‌బ్యాక్‌ రూపంలో  ఇవ్వాల‌ని  చమురు కంపెనీలు క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించిన విష‌యం తెలిసిందే. కాగా వచ్చే నెల ఒకటో తేది నుంచి ఆ డిస్కౌంట్‌ ఉండబోదని తాజాగా కంపెనీలు వెల్లడించాయి. ఇకమీదట డెబిట్‌, ఇతర డిజిటల్‌ పద్ధతుల ద్వారా చెల్లించేవారికి మాత్రం ఈ డిస్కౌంట్‌ యధావిధిగా కొనసాగుతుంది.