Skip to main content

ట్రంప్‌తో భేటీ సమయంలో ఇమ్రాన్ ఖాన్ కు చేధు అనుభవం !!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ సమయంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు చేధు అనుభవం ఎదురైంది. పాక్ జర్నలిస్ట్ గురించి ట్రంప్ ప్రస్తావిస్తూ.. ఇలాంటి వారిని ఎక్కడి నుంచి పట్టుకొస్తారంటూ ట్రంప్ నేరుగా ఇమ్రాన్ ఖాన్ ను ప్రశ్నించారు . ట్రంప్ వ్యాఖ్యలతో ఇమ్రాన్ ఖాన్ ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అసలు ఏం జరిగిందనేది డీటైల్ గా తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశాల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో పాక్ ప్రధాని ఇమ్రాన్ ప్రత్యేకంగా సమావేశమ్యారు. భేటీ ముగిసిన వెంటనే ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ట్రంప్ కు పాక్ కు చెందిన ఓ జర్నలిస్టు విసుగెత్తించే ప్రశ్నలు వేశాడు. ఈ క్రమంలో కశ్మీర్ అంశంపై మీ వైఖరి ఏంటి అంటూ  ట్రంప్ ను పదేపదే ప్రశ్నించాడు. దీంతో అసహనానికి లోనైన ట్రంప్.. సదురు జర్నలిస్టుపై ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. వేలు ఇమాన్ ఖాన్ వైపు చూపుతూ నీవు ఆయన టీమ్ కు చెందిన వ్యక్తివా ? అని ప్రశ్నించారు. ఇంతటితో ట్రంప్ ఆగకుండా డైరక్ట్ గా ఇమ్రాన్ ఖాన్ తో ఇలాంటి ...వారిని ఎక్కడి నుంచి పట్టుకొస్తారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఇమ్రాన్ ఏం సమాధానం చెప్పాలో తెలియక ఇమ్రాన్ తడబడ్డారు . ట్రంప్ రియాక్షన్ తో పాక్ ప్రధాని ముఖం ఒక్కసారిగా ఎర్రబారింది. 
ఇప్పటికే అనేక వేదికలగా కశ్మీర్ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని ట్రంప్ వ్యాఖ్యనించిన విషయం తెలిసిందే. భారత్ - పాక్ మధ్య శాంతియుత వాతావారణాన్ని విషయంలో తమ సాయం అందిస్తామన్నారు తప్పితే కశ్మీర్ అంశాన్ని ఆయన ఎక్కడా ప్రస్తావించడం లేదు. అయితే ఇప్పుడు  పాక్ జర్నిలిస్ట్ పదే పదే ఇలా కశ్మీర్ పై స్పందించాలని ప్రశ్నించడంతో ట్రంప్ ఈ మేరకు అసహనాన్ని ప్రదర్శించారు. 

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...