Skip to main content

ట్రంప్‌తో భేటీ సమయంలో ఇమ్రాన్ ఖాన్ కు చేధు అనుభవం !!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ సమయంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు చేధు అనుభవం ఎదురైంది. పాక్ జర్నలిస్ట్ గురించి ట్రంప్ ప్రస్తావిస్తూ.. ఇలాంటి వారిని ఎక్కడి నుంచి పట్టుకొస్తారంటూ ట్రంప్ నేరుగా ఇమ్రాన్ ఖాన్ ను ప్రశ్నించారు . ట్రంప్ వ్యాఖ్యలతో ఇమ్రాన్ ఖాన్ ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అసలు ఏం జరిగిందనేది డీటైల్ గా తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశాల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో పాక్ ప్రధాని ఇమ్రాన్ ప్రత్యేకంగా సమావేశమ్యారు. భేటీ ముగిసిన వెంటనే ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ట్రంప్ కు పాక్ కు చెందిన ఓ జర్నలిస్టు విసుగెత్తించే ప్రశ్నలు వేశాడు. ఈ క్రమంలో కశ్మీర్ అంశంపై మీ వైఖరి ఏంటి అంటూ  ట్రంప్ ను పదేపదే ప్రశ్నించాడు. దీంతో అసహనానికి లోనైన ట్రంప్.. సదురు జర్నలిస్టుపై ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. వేలు ఇమాన్ ఖాన్ వైపు చూపుతూ నీవు ఆయన టీమ్ కు చెందిన వ్యక్తివా ? అని ప్రశ్నించారు. ఇంతటితో ట్రంప్ ఆగకుండా డైరక్ట్ గా ఇమ్రాన్ ఖాన్ తో ఇలాంటి ...వారిని ఎక్కడి నుంచి పట్టుకొస్తారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఇమ్రాన్ ఏం సమాధానం చెప్పాలో తెలియక ఇమ్రాన్ తడబడ్డారు . ట్రంప్ రియాక్షన్ తో పాక్ ప్రధాని ముఖం ఒక్కసారిగా ఎర్రబారింది. 
ఇప్పటికే అనేక వేదికలగా కశ్మీర్ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని ట్రంప్ వ్యాఖ్యనించిన విషయం తెలిసిందే. భారత్ - పాక్ మధ్య శాంతియుత వాతావారణాన్ని విషయంలో తమ సాయం అందిస్తామన్నారు తప్పితే కశ్మీర్ అంశాన్ని ఆయన ఎక్కడా ప్రస్తావించడం లేదు. అయితే ఇప్పుడు  పాక్ జర్నిలిస్ట్ పదే పదే ఇలా కశ్మీర్ పై స్పందించాలని ప్రశ్నించడంతో ట్రంప్ ఈ మేరకు అసహనాన్ని ప్రదర్శించారు. 

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...