Skip to main content

ట్రంప్‌తో భేటీ సమయంలో ఇమ్రాన్ ఖాన్ కు చేధు అనుభవం !!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ సమయంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు చేధు అనుభవం ఎదురైంది. పాక్ జర్నలిస్ట్ గురించి ట్రంప్ ప్రస్తావిస్తూ.. ఇలాంటి వారిని ఎక్కడి నుంచి పట్టుకొస్తారంటూ ట్రంప్ నేరుగా ఇమ్రాన్ ఖాన్ ను ప్రశ్నించారు . ట్రంప్ వ్యాఖ్యలతో ఇమ్రాన్ ఖాన్ ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అసలు ఏం జరిగిందనేది డీటైల్ గా తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశాల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో పాక్ ప్రధాని ఇమ్రాన్ ప్రత్యేకంగా సమావేశమ్యారు. భేటీ ముగిసిన వెంటనే ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ట్రంప్ కు పాక్ కు చెందిన ఓ జర్నలిస్టు విసుగెత్తించే ప్రశ్నలు వేశాడు. ఈ క్రమంలో కశ్మీర్ అంశంపై మీ వైఖరి ఏంటి అంటూ  ట్రంప్ ను పదేపదే ప్రశ్నించాడు. దీంతో అసహనానికి లోనైన ట్రంప్.. సదురు జర్నలిస్టుపై ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. వేలు ఇమాన్ ఖాన్ వైపు చూపుతూ నీవు ఆయన టీమ్ కు చెందిన వ్యక్తివా ? అని ప్రశ్నించారు. ఇంతటితో ట్రంప్ ఆగకుండా డైరక్ట్ గా ఇమ్రాన్ ఖాన్ తో ఇలాంటి ...వారిని ఎక్కడి నుంచి పట్టుకొస్తారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఇమ్రాన్ ఏం సమాధానం చెప్పాలో తెలియక ఇమ్రాన్ తడబడ్డారు . ట్రంప్ రియాక్షన్ తో పాక్ ప్రధాని ముఖం ఒక్కసారిగా ఎర్రబారింది. 
ఇప్పటికే అనేక వేదికలగా కశ్మీర్ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని ట్రంప్ వ్యాఖ్యనించిన విషయం తెలిసిందే. భారత్ - పాక్ మధ్య శాంతియుత వాతావారణాన్ని విషయంలో తమ సాయం అందిస్తామన్నారు తప్పితే కశ్మీర్ అంశాన్ని ఆయన ఎక్కడా ప్రస్తావించడం లేదు. అయితే ఇప్పుడు  పాక్ జర్నిలిస్ట్ పదే పదే ఇలా కశ్మీర్ పై స్పందించాలని ప్రశ్నించడంతో ట్రంప్ ఈ మేరకు అసహనాన్ని ప్రదర్శించారు. 

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...