Skip to main content

కన్నా లక్ష్మీనారాయణ వైసీపీ విధానాలను గమనించి మాట్లాడాలి: మల్లాది విష్ణు

వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణపై విమర్శలకు దిగారు. వైసీపీ విధానాలను కన్నా గమనించి మాట్లాడాలని హితవు పలికారు. పూర్తిస్థాయిలో సామాజిక న్యాయం చేస్తున్నామని కన్నా గుర్తించాలని అన్నారు. రాష్ట్రంలో పారదర్శకమైన ఇసుక విధానం తీసుకువచ్చామని, తాము అధికారంలోకి వచ్చిన 4 నెలల్లో 2 నెలల పాటు వర్షాలు కురిశాయని చెప్పుకొచ్చారు.

గత ప్రభుత్వం చేసిన అన్యాయాల గురించి కన్నా ఎందుకు మాట్లాడరు? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు అక్రమ భవనంలో ఉన్నా కన్నా నోరువిప్పలేదని మండిపడ్డారు. వైసీపీని, ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. టీడీపీ చేస్తున్న విమర్శలకు జిరాక్స్ కాపీలా బీజేపీ విమర్శలు చేస్తోందని విష్ణు వ్యాఖ్యానించారు. వైసీపీ సర్కారుపై బురద చల్లేందుకే గవర్నర్ కు ఫిర్యాదు చేశారని అన్నారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.