Skip to main content

ఉగ్ర‌వాదుల‌కు పెన్ష‌న్ ఇస్తున్న‌దెవ‌రు ?




ఐక్యరాజ్య‌స‌మితి నిషేధిత జాబితాలో ఉన్న ఉగ్ర‌వాదుల‌కు పాకిస్థాన్ నెల‌నెల పెన్ష‌న్ ఇస్తున్న‌ద‌ని భార‌త్ ఆరోపించింది. యూఎన్‌లో పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్ర‌సంగాన్ని భార‌త్ ఖండించింది. యూఎన్ లిస్టులో ఉన్న ఉగ్ర‌వాదుల‌కు పెన్ష‌న్ ఇస్తున్న ఏకైక దేశం పాకిస్థాన్ అని భార‌త విదేశాంగ కార్య‌ద‌ర్శి విదిశా మైత్రా తెలిపారు. ఆల్‌ఖ‌యిదా, దాయిశ్ సంస్థ‌ల‌కు నిధులు ఇవ్వ‌కూడ‌దని యూఎన్ ఆంక్ష‌లు విధించినా.. పాక్ మాత్రం ఆ సంస్థ ఉగ్ర‌వాదుల‌ను ఆదుకుంటోంద‌ని విదిశా తెలిపారు. ఇమ్రాన్ ప్ర‌సంగానికి ఐక్య‌రాజ్య‌స‌మితి వేదిక‌గా భార‌త్ రిప్లై ఇచ్చింది. అణుయుద్ధం వ‌స్తుంద‌ని హెచ్చ‌రించిన ఇమ్రాన్ వ్యాఖ్య‌లు ఆ దేశం అనుస‌రిస్తున్న ప్ర‌మాద‌క‌ర విధానాన్ని మాత్రం స్ప‌ష్టం చేస్తున్న‌ద‌ని, దాంట్లో ఎటువంటి రాజ‌నీతి లేద‌ని భార‌త్ ఆరోపించింది. యూఎన్ బ్యాన్ చేసిన 130 మంది ఉగ్ర‌వాదులు పాక్‌లోనే ఉన్నార‌ని, 25 ఉగ్ర సంస్థ‌లు కూడా అక్క‌డే ఉన్నాయ‌ని, దీన్ని ఆ దేశం అంగీక‌రిస్తుందా అని విదిశా ప్ర‌శ్నించారు. చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించి చెప్ప‌డం కాదు అని, 1971లో స్వంత ప్ర‌జ‌ల‌ను ఊచ‌కోత కోసిన తీరును ఇమ్రాన్ గుర్తు చేసుకోవాల‌ని భార‌త్ పేర్కొన్న‌ది. జెంటిల్మెన్ గేమ్‌గా పిలువ‌బ‌డే క్రికెట్ ఆట‌ను ఆడిన ఇమ్రాన్ ఇప్పుడు త‌మ దేశంలోనే ఆయుధాలు అమ్మే దారా ఆద‌మ్ ఖేల్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌ట్లుగా ఉంద‌ని విదిశా నిల‌దీశారు. పాక్‌లో 1947లో 23 శాతం మైనార్టీలు ఉండేవార‌ని, ఇప్పుడు అక్క‌డ మైనార్టీల సంఖ్య కేవ‌లం 3 శాతం మాత్ర‌మే ఉంద‌న్నారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...