Skip to main content

ఇండియాకి ర‌జ‌త ప‌తకం తీసుకొచ్చిన మాధ‌వ‌న్ త‌న‌యుడు

త‌న‌యుడు సాధిస్తున్న ఘ‌న‌త‌ల‌ని చూసి తండ్రి మాధ‌వ‌న్ చాలా గ‌ర్విస్తున్నాడు. మాధవన్-సరితల పుత్ర రత్నం వేదాంత్(14) ఆ మ‌ధ్య థాయిలాండ్‌లో జరిగిన‌ అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీల్లో ... 1500 మీటర్ల ఫ్రీ స్టైల్ విభాగంలో పోటీ పడ్డాడు. మూడో స్థానంలో నిలిచిన వేదాంత్ కాంస్యపతకం అందుకున్నాడు. ఇక రీసెంట్‌గా జాతీయ స్థాయి పోటీలు జ‌ర‌గ‌గా అందులో వేదాంత్ మూడు బంగారు, ఒక వెండి పతకాన్ని చేజిక్కించుకున్నాడు. ఈ విష‌యాల‌ని గ‌ర్విస్తూ త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానుల‌కి తెలియ‌జేశాడు మాధ‌వ‌న్.

తాజాగా జ‌రిగిన ఆసియా ఏజ్ గ్రూప్ ఛాంపియన్‌షిప్‌ గ్రూప్ IIలో 4x100మీటర్ల ఫ్రీ స్టైల్ రిలేలో భారత్ తరుపున వేదాంత్‌తో పాటు మరో ముగ్గురు పోటీలో పాల్గొన్నారు. వేదాంత్‌ (55.27 సె), ఉత్కర్ష్‌ పాటిల్‌ (57.10 సె), సాహిల్‌ లష్కర్‌ (54.83 సె), సోహన్‌ గంగూలీ (54.29 సె)తో కూడిన బృందం 3:41:49 సెకన్లలో పోటీ ముగించి రెండో స్థానం పొందారు. ఇందుకు గాను వారికి సిల్వ‌ర్ మెడ‌ల్ ద‌క్కింది. గ్రూప్ IIలో 4x100మీటర్ల ఫ్రీ స్టైల్ రిలేలో తొలి స్థానంలో నిలిచిన థాయిలాండ్ స్విమ్మర్లు స్వర్ణ పతకం సాధించగా... మూడో స్థానంలో నిలిచిన జపాన్ స్విమ్మర్లు కాంస్య పతకం సాధించారు. ఇదిలా ఉంటే, గ్రూప్ Iలో 4x100మీటర్ల ఫ్రీ స్టైల్ రిలేలో భారత స్విమ్మర్లు స్వర్ణ పతకం సాధించారు. మొత్తానికి వేదాంత్ త‌న తండ్రితో పాటు దేశాన్నీ గర్వపడేలా చేశాడు. దేవుడి ద‌య వ‌ల‌న భార‌త్ త‌ర‌పున తొలి ప‌త‌కాన్ని గెలుచుకున్నాడు. ఆసియా ఏజ్ గ్రూప్ ఛాంపియన్‌షిప్‌ గ్రూప్ II పోటీల‌లో భార‌త్‌కి ర‌జతం ల‌భించింది అని మాధ‌వన్ త‌న సోష‌ల్ మీడియా పేజ్ ద్వారా తెలియ‌జేశాడు. ప‌లువురు రాజ‌కీయ‌, సినీ ప్ర‌ముఖులు వేదాంత్‌కి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.మాధ‌వన్ సినిమాల విష‌యానికి వ‌స్తే ఆయ‌న ప్ర‌స్తుతం ఇస్రో శాస్త్ర‌వేత్త నంబి నారాయ‌ణ‌న్ బ‌యోపిక్‌లో న‌టిస్తున్నాడు. ఈ చిత్రాన్ని స్వ‌యంగా తెర‌కెక్కిస్తూ న‌టిస్తున్నాడు మాడి. రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌ అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో నంబి నారాయ‌ణ్ జీవితంలోని మూడు ప్ర‌ధాన కోణాల‌ని చూపించనున్న‌ట్టు స‌మాచారం. అయితే ఈ చిత్రం తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో విడుద‌ల కానుండ‌గా,షారూఖ్, సూర్య ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఇక మాధ‌వ‌న్ భార్య‌గా సిమ్రాన్ క‌నిపించ‌నున్నారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...