Skip to main content

వైసీపీ ప్రభుత్వం ఏపీ ప్రతిష్టను దెబ్బతీస్తోంది: చంద్రబాబు

వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తోందని టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పీపీఏలపై జగన్‌ ప్రభుత్వానివి తప్పుడు నిర్ణయాలని ఆరోపించారు. టీడీపీ హయంలో జెన్‌కో, ట్రాన్స్‌కోను దేశంలోనే నెంబర్‌ వన్‌ చేశామన్నారు. సంస్కరణలతో కరెంట్‌ కోతలను అధిగమించామన్నారు.డిస్కంలకు అప్పులు లేకుండా చేశామని, కరెంట్‌ కోతల నుంచి మిగులు విద్యుత్‌ సాధించామని చంద్రబాబు చెప్పారు. విద్యుత్‌ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చింది టీడీపీనేనని ఆయన స్పష్టం చేశారు. నాణ్యమైన, తక్కువ ధరకు కరెంట్‌ ఇవ్వాలని ముందుకెళ్లామని, దురుద్దేశంతోనే విద్యుత్‌ ఒప్పందాలు జరిగాయని ఎలా అంటారని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.అధికారులు తప్పుడు సమాచారం ఇస్తారా.. ముఖ్యమంత్రి ఒత్తిడి తెస్తే అధికారులు తప్పుడు సమాచారం ఇస్తారా అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం నాలుగు నెలల్లో ప్రజలకు నరకం చూపించారాని ఫైర్ అయ్యారు. పీపీఏల విషయంలో ఎంత మంది చెప్పినా జగన్ కు అర్దం కాదా అని ప్రశ్నించారు. అధికారులు ప్రభుత్వానికి ఇచ్చే నివేదికల్లో ముఖ్యమంత్రికి క్లీన్ చిట్ ఇస్తూ..గత ప్రభుత్వం పైన బుదర చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో అధికారులు ఇదే రకంగా సహకరిస్తే ఏం జరిగిందో అందరికీ తెలుసని..ఇప్పుడు ముఖ్యమంత్రి కోసం చేసినా..తరువాత నిద్ర లేని రాత్రులు గడపాల్సి వస్తుందని మాజీ సీెం హెచ్చరించారు. తాము భవిష్యత్ ను అంచనా వేసి ఒప్పందాలు చేసుకున్నామని..కానీ ఇప్పుడు దురుద్దేశంతోనే విద్యుత్‌ ఒప్పందాలు జరిగాయని ఎలా అంటారని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యుత్‌ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చింది టీడీపీనేనని ఆయన స్పష్టం చేశారు. నాణ్యమైన, తక్కువ ధరకు కరెంట్‌ ఇవ్వాలని ముందుకెళ్లామని చంద్రబాబు వివరించారు.

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...

కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమే.. యుద్ధం వస్తే మేం సిద్ధం : ఇమ్రాన్‌

జమ్ముకశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. శుక్రవారం నాడు 74వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. ఐరాస వేదికగా కవ్వింపు ప్రకటన చేశారు. కశ్మీర్‌ను కేవలం రాజకీయం కోసం మాత్రమే వాడుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.   ప్రపంచం ఏం చేసింది?.   బాలాకోట్‌లో 500 మంది తీవ్రవాదులు రెడీగా ఉన్నారని ఇండియా రక్షణ మంత్రి చెబుతున్నారు. 500 మంది తీవ్రవాదులను పంపి మేమేం సాధిస్తాం?. 500 మంది తీవ్రవాదులను పంపాల్సిన అవసరం మాకేంటి.?. ఇస్లామిక్ టెర్రరిజం అంటూ ఇండియా మాపై ముద్ర వేస్తుంది. కశ్మీరీల హక్కులు ఎవరికీ పట్టవు. కశ్మీర్‌లో అనుసరిస్తున్న విధానాలు భారత్‌లో ఉన్న ముస్లింలపై ఎలా ప్రభావం చూపుతాయో మోదీ ఆలోచించారా?. 10 లక్షల మంది రోహింగ్యాలను బర్మా నుంచి గెంటేస్తే ప్రపంచం ఏం చేసింది?. ఇలాంటి పరిణామాలే ఇస్లాం సమాజంలో ఆవేదన, అసంతృప్తిని రేపుతున్నాయి ’  అని ఇమ్రాన్ ఆగ్రహ వ్యక్తం చేశారు. యుద్ధం వస్తే మేం సిద్ధం! ‘ ఇప్పుడు చాలా సంక్లిష్టం సమయం నడుస్తోంది. అణ్వాయుధాలున్న రెండు దేశాలు తలపడాల్స...