Skip to main content

చంద్రబాబుకు ఎంతైనా అత్తని కదా! ఇల్లు కట్టించి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా: లక్ష్మీపార్వతి సెటైర్లు

కేవలం నాలుగు నెలల పాలనలో నాలుగున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత జగన్ దేనని కొనియాడారు. రాజకీయాల్లో ఎంతో సీనియర్ ను అని చెప్పుకునే చంద్రబాబునాయుడు తన ఐదేళ్ల పాలనలో చేసింది శూన్యం అని విమర్శించారు. పీపీఏలలో, రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలకు సంబంధించి చంద్రబాబు పాలనలో ఆరు లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ పైనా విమర్శలు చేశారు. ‘ట్విట్టర్’ లో మాత్రమే మాట్లాడే కొడుకును కన్న ఘనత చంద్రబాబు దే నంటూ సెటైర్లు విసిరారు.
తెలుగులో మంచి సామెత ఉంది ‘ఊరంతా వడ్లు ఎండబెట్టుకుంటే, ఏం చెయ్యాలో తెలియక నక్క తోక ఎండబెట్టుకుందట’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత లక్ష్మీపార్వతి విమర్శలు చేశారు. తాడేపల్లిలో ఈరోజు మీడియాతో ఆమె మాట్లాడుతూ, చంద్రబాబు పరిస్థితి కూడా అలాగే ఉందని విమర్శించారు.

కరకట్టపై ఉన్న ఇంట్లో చంద్రబాబు నివసించడంపై ఆమె విమర్శలు చేశారు. ‘కరకట్ట మీద ఉన్న నీ ఇల్లు పోతుందా? అది నీ ఇల్లా? నువ్వు కట్టావా? ఎవరిచ్చారో చెప్పు? మీ అమ్మగారు ఏమన్నా రాసిచ్చారా? లేకపోతే మీ నాన్న గారు ఏమన్నా వారసత్వ హక్కుగా తెచ్చి నీ పేరుతో రిజిష్టర్ చేసి పోయారా?’ అని ప్రశ్నించారు. ‘నాకైతే డౌట్ గానే ఉంది. ఆ అక్రమకట్టడంలో నువ్వు(చంద్రబాబు) వేల కోట్ల డబ్బులు ఏమన్నా దాచిపెట్టావా? ఎట్లా అయినా అత్తని కదా! ఆ సానుభూతితో చందాలు వసూలు చేసి నీకు ఇల్లు కట్టించి ఇవ్వమంటే అత్తగా నేను సిద్ధంగా ఉన్నాను.

ఈ సందర్భంగా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతి గురించి ప్రస్తావించారు. చంద్రబాబు, కోడెల బిడ్డల కారణంగానే ఆయన మృతి చెందారని ఆరోపించారు. కోడెలకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వని చంద్రబాబు నీచమైన కుట్రలకు పాల్పడ్డారని, శవరాజకీయాలు చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ దగ్గర నుంచి ఇప్పటి వరకూ చంద్రబాబు ఒకే రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
నీతివంతమైన జగన్ పాలనను చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. తాడేపల్లిలో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన జగన్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని, అవినీతి రహిత పాలన చేస్తున్నారని అన్నారు.

Comments

Popular posts from this blog

అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్...‌

వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్‌కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్‌పైవెళ్తున్న చాపర్తిన శేఖర్‌ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్‌కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్‌ హైవే అంబులెన్స్‌ ద్వారా విజయవాడ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పక్కకు తొలగి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది.

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.