Skip to main content

అప్పుడు ఆ నరేంద్రుడు ఇప్పుడు ఈ నరేంద్రుడు.

Address in US: earlier Swamy vivekananda, now Narendra Modi
ఒక్కసారిగా గంభీరమైన కంఠంతో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అఫ్ అమెరికా అన్నాడో, అందరూ అలెర్ట్ అయ్యి ఆ వక్తను ఆలకించడం మొదలు పెట్టారు. అతని ప్రసంగం పూర్తయిన తరువాత నిలుచొని స్టాండింగ్ ఒవేషన్ (లేచి నిలబడి కరతాళ ధ్వనులతో మెచ్చుకోవడం). ఇచ్చారు.
అతనే నరేంద్రుడు ఉరఫ్ స్వామి వివేకానంద. మళ్ళీ 126 ఏళ్ల తరువాత మరో నరేంద్రుడు అమెరికాలో ఈ రకమైన స్పీచ్ ఇచ్చి అక్కడి ప్రజలను కట్టిపడేసాడు. అతనే మన ప్రధాని నరేంద్రమోడీ. కాకతాళీయంగా ఇరువురు పేర్లు కూడా ఒకటే
ఆ రోజు ఆ నరేంద్రుడు కూడా సోదర భావాన్నే ప్రస్ఫుటంగా వినిపిస్తే, ఈ నరేంద్రుడు కూడా అదే భావనను వెలిబుచ్చాడు. ఇంకో ఆసక్తికర అంశం ఏమిటంటే ఇరువురు ప్రసంగించింది కూడా ఈ సెప్టెంబర్ మాసంలోనే
స్వామి వివేకానంద 1893 సెప్టెంబర్ 11న ప్రసంగిస్తే, ప్రధాని నరేంద్ర మోడీ సెప్టెంబర్ 22వ తేదీన ప్రసంగించారు. ఏకంగా అమెరికా అధ్యక్షుడే ఈ ఈవెంట్ కు హాజరయ్యి ప్రధాని ప్రసంగం పూర్తయ్యేవరకు ఆసక్తిగా విన్నారు.
ఆ నాడు ఆ నరేంద్రుడు తన ప్రసంగం ద్వారా యావత్తు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తే నేడు మన ప్రధాని మోడీ కూడా ప్రపంచ దేశాలన్నీ తన స్పీచ్ వినేలా చేసి భారత దేశ గౌరవాన్ని ప్రతిష్టను మరింతగా పెంపొందించారు అనడంలో ఎటువంటి సంశయం అవసరం లేదు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.