Skip to main content

అప్పుడు ఆ నరేంద్రుడు ఇప్పుడు ఈ నరేంద్రుడు.

Address in US: earlier Swamy vivekananda, now Narendra Modi
ఒక్కసారిగా గంభీరమైన కంఠంతో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అఫ్ అమెరికా అన్నాడో, అందరూ అలెర్ట్ అయ్యి ఆ వక్తను ఆలకించడం మొదలు పెట్టారు. అతని ప్రసంగం పూర్తయిన తరువాత నిలుచొని స్టాండింగ్ ఒవేషన్ (లేచి నిలబడి కరతాళ ధ్వనులతో మెచ్చుకోవడం). ఇచ్చారు.
అతనే నరేంద్రుడు ఉరఫ్ స్వామి వివేకానంద. మళ్ళీ 126 ఏళ్ల తరువాత మరో నరేంద్రుడు అమెరికాలో ఈ రకమైన స్పీచ్ ఇచ్చి అక్కడి ప్రజలను కట్టిపడేసాడు. అతనే మన ప్రధాని నరేంద్రమోడీ. కాకతాళీయంగా ఇరువురు పేర్లు కూడా ఒకటే
ఆ రోజు ఆ నరేంద్రుడు కూడా సోదర భావాన్నే ప్రస్ఫుటంగా వినిపిస్తే, ఈ నరేంద్రుడు కూడా అదే భావనను వెలిబుచ్చాడు. ఇంకో ఆసక్తికర అంశం ఏమిటంటే ఇరువురు ప్రసంగించింది కూడా ఈ సెప్టెంబర్ మాసంలోనే
స్వామి వివేకానంద 1893 సెప్టెంబర్ 11న ప్రసంగిస్తే, ప్రధాని నరేంద్ర మోడీ సెప్టెంబర్ 22వ తేదీన ప్రసంగించారు. ఏకంగా అమెరికా అధ్యక్షుడే ఈ ఈవెంట్ కు హాజరయ్యి ప్రధాని ప్రసంగం పూర్తయ్యేవరకు ఆసక్తిగా విన్నారు.
ఆ నాడు ఆ నరేంద్రుడు తన ప్రసంగం ద్వారా యావత్తు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తే నేడు మన ప్రధాని మోడీ కూడా ప్రపంచ దేశాలన్నీ తన స్పీచ్ వినేలా చేసి భారత దేశ గౌరవాన్ని ప్రతిష్టను మరింతగా పెంపొందించారు అనడంలో ఎటువంటి సంశయం అవసరం లేదు.

Comments

Popular posts from this blog

అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా: సీఆర్డీఏ స్థానంలో కొత్త అథారిటీ: కీలక నోటిఫికేషన్

 మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...

కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమే.. యుద్ధం వస్తే మేం సిద్ధం : ఇమ్రాన్‌

జమ్ముకశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తేస్తే రక్తపాతమేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. శుక్రవారం నాడు 74వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. ఐరాస వేదికగా కవ్వింపు ప్రకటన చేశారు. కశ్మీర్‌ను కేవలం రాజకీయం కోసం మాత్రమే వాడుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.   ప్రపంచం ఏం చేసింది?.   బాలాకోట్‌లో 500 మంది తీవ్రవాదులు రెడీగా ఉన్నారని ఇండియా రక్షణ మంత్రి చెబుతున్నారు. 500 మంది తీవ్రవాదులను పంపి మేమేం సాధిస్తాం?. 500 మంది తీవ్రవాదులను పంపాల్సిన అవసరం మాకేంటి.?. ఇస్లామిక్ టెర్రరిజం అంటూ ఇండియా మాపై ముద్ర వేస్తుంది. కశ్మీరీల హక్కులు ఎవరికీ పట్టవు. కశ్మీర్‌లో అనుసరిస్తున్న విధానాలు భారత్‌లో ఉన్న ముస్లింలపై ఎలా ప్రభావం చూపుతాయో మోదీ ఆలోచించారా?. 10 లక్షల మంది రోహింగ్యాలను బర్మా నుంచి గెంటేస్తే ప్రపంచం ఏం చేసింది?. ఇలాంటి పరిణామాలే ఇస్లాం సమాజంలో ఆవేదన, అసంతృప్తిని రేపుతున్నాయి ’  అని ఇమ్రాన్ ఆగ్రహ వ్యక్తం చేశారు. యుద్ధం వస్తే మేం సిద్ధం! ‘ ఇప్పుడు చాలా సంక్లిష్టం సమయం నడుస్తోంది. అణ్వాయుధాలున్న రెండు దేశాలు తలపడాల్స...