Skip to main content

అప్పుడు ఆ నరేంద్రుడు ఇప్పుడు ఈ నరేంద్రుడు.

Address in US: earlier Swamy vivekananda, now Narendra Modi
ఒక్కసారిగా గంభీరమైన కంఠంతో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అఫ్ అమెరికా అన్నాడో, అందరూ అలెర్ట్ అయ్యి ఆ వక్తను ఆలకించడం మొదలు పెట్టారు. అతని ప్రసంగం పూర్తయిన తరువాత నిలుచొని స్టాండింగ్ ఒవేషన్ (లేచి నిలబడి కరతాళ ధ్వనులతో మెచ్చుకోవడం). ఇచ్చారు.
అతనే నరేంద్రుడు ఉరఫ్ స్వామి వివేకానంద. మళ్ళీ 126 ఏళ్ల తరువాత మరో నరేంద్రుడు అమెరికాలో ఈ రకమైన స్పీచ్ ఇచ్చి అక్కడి ప్రజలను కట్టిపడేసాడు. అతనే మన ప్రధాని నరేంద్రమోడీ. కాకతాళీయంగా ఇరువురు పేర్లు కూడా ఒకటే
ఆ రోజు ఆ నరేంద్రుడు కూడా సోదర భావాన్నే ప్రస్ఫుటంగా వినిపిస్తే, ఈ నరేంద్రుడు కూడా అదే భావనను వెలిబుచ్చాడు. ఇంకో ఆసక్తికర అంశం ఏమిటంటే ఇరువురు ప్రసంగించింది కూడా ఈ సెప్టెంబర్ మాసంలోనే
స్వామి వివేకానంద 1893 సెప్టెంబర్ 11న ప్రసంగిస్తే, ప్రధాని నరేంద్ర మోడీ సెప్టెంబర్ 22వ తేదీన ప్రసంగించారు. ఏకంగా అమెరికా అధ్యక్షుడే ఈ ఈవెంట్ కు హాజరయ్యి ప్రధాని ప్రసంగం పూర్తయ్యేవరకు ఆసక్తిగా విన్నారు.
ఆ నాడు ఆ నరేంద్రుడు తన ప్రసంగం ద్వారా యావత్తు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తే నేడు మన ప్రధాని మోడీ కూడా ప్రపంచ దేశాలన్నీ తన స్పీచ్ వినేలా చేసి భారత దేశ గౌరవాన్ని ప్రతిష్టను మరింతగా పెంపొందించారు అనడంలో ఎటువంటి సంశయం అవసరం లేదు.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...