Skip to main content

ఆ ఇంట్లో నివసించడం ధర్మం కాదు..ఖాళీ చేయండి: చంద్రబాబుకు అంబటి సూచన

టీడీపీ అధినేత చంద్రబాబుకు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సూటి ప్రశ్న వేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఐదేళ్ల క్రితం రాజధాని అమరావతి ఏర్పడిందని, దాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పిన చంద్రబాబు సొంత ఇల్లు ఎందుకు కట్టుకోలేకపోయారు? ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? అక్రమంగా నిర్మించిన లింగమనేని గెస్ట్ హౌస్ లో మీరు ఎందుకు ఉన్నారు? అని ప్రశ్నించారు.

నదీ గర్భంలో ఉన్న ఇంట్లో, అనుమతులు లేని ఇంట్లో ఎలా ఉన్నారో సమాధానం చెప్పాల్సిన బాధ్యత భారతదేశంలో సీనియర్ పొలిటీషియన్ అని చెప్పుకుంటున్న చంద్రబాబుకు లేదా? అవినీతి నిర్మాణంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటే కక్ష సాధింపు చర్యలు అని ప్రచారం చేస్తారా? అని ప్రశ్నించారు. అక్రమ నిర్మాణంలో ఇంకా నివసించాలని కోరుకోవడం దుర్మార్గమైన చర్య అంటూ బాబుపై విమర్శలు గుప్పించారు. అక్రమ నిర్మాణంలో నివసించడం ధర్మం కాదు అని, ఆ ఇంటిని ఖాళీ చేసి ఆదర్శంగా నిలవాలని చంద్రబాబుకు సూచించారు

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...