Skip to main content

ఆ ఇంట్లో నివసించడం ధర్మం కాదు..ఖాళీ చేయండి: చంద్రబాబుకు అంబటి సూచన

టీడీపీ అధినేత చంద్రబాబుకు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సూటి ప్రశ్న వేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఐదేళ్ల క్రితం రాజధాని అమరావతి ఏర్పడిందని, దాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పిన చంద్రబాబు సొంత ఇల్లు ఎందుకు కట్టుకోలేకపోయారు? ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? అక్రమంగా నిర్మించిన లింగమనేని గెస్ట్ హౌస్ లో మీరు ఎందుకు ఉన్నారు? అని ప్రశ్నించారు.

నదీ గర్భంలో ఉన్న ఇంట్లో, అనుమతులు లేని ఇంట్లో ఎలా ఉన్నారో సమాధానం చెప్పాల్సిన బాధ్యత భారతదేశంలో సీనియర్ పొలిటీషియన్ అని చెప్పుకుంటున్న చంద్రబాబుకు లేదా? అవినీతి నిర్మాణంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటే కక్ష సాధింపు చర్యలు అని ప్రచారం చేస్తారా? అని ప్రశ్నించారు. అక్రమ నిర్మాణంలో ఇంకా నివసించాలని కోరుకోవడం దుర్మార్గమైన చర్య అంటూ బాబుపై విమర్శలు గుప్పించారు. అక్రమ నిర్మాణంలో నివసించడం ధర్మం కాదు అని, ఆ ఇంటిని ఖాళీ చేసి ఆదర్శంగా నిలవాలని చంద్రబాబుకు సూచించారు

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.