Skip to main content

ఆయన తీహార్ లోనే.. సోనియా పరామర్శించలేదా!

ఆయన తీహార్ లోనే.. సోనియా పరామర్శించలేదా!
కర్ణాటక మాజీమంత్రి డీకే శివకుమారకు మరోసారి భంగపాటు ఎదురైంది. ఆయనకు స్పెషల్ కోర్డు బెయిల్ నిరాకరించింది. ఇప్పటికే కొన్నాళ్లుగా పోలీస్ కస్టడీలో ఉన్న ఆయనకు మరికొంతకాలం అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసుల్లో డీకే శివకుమార అరెస్టు అయిన సంగతి తెలిసిందే.
ఆయనను అక్రమంగా అరెస్టు చేశారని కాంగ్రెస్ పార్టీ అంటోంది. దక్షిణాదితో పాటు, గుజరాత్ వరకూ కాంగ్రెస్ కు ట్రబుల్ షూటర్ ఉన్న డీకే శివకుమారను అరెస్టు చేసి కాంగ్రెస్ దెబ్బకొట్టాలని బీజేపీ భావిస్తోందని.. కాంగ్రెస్  నేతలు వాదిస్తూ ఉన్నారు. ఇప్పటికే డీకే అరెస్టుపై కర్ణాటక కాంగ్రెస్ వాళ్లతో పాటు, వక్కలిగ కమ్యూనిటీ కూడా భగ్గుమంది. అయితే ఆయనకు న్యాయస్థానం మాత్రం ఊరటను ఇవ్వలేదు.
ఆయనను తీహార్ జైలుకే పరిమితం చేసింది. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ జాతీయ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ తీహార్ జైలును సందర్శించారు. అక్కడ ఉన్న తమ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి  చిదంబరాన్ని ఆమె పరామర్శించారు.
విశేషం ఏమిటంటే డీకే శివకుమార కూడా అక్కడే ఉన్నారు. ఆయన అరెస్టు పట్ల ఇప్పటికే సోనియాగాంధీ నిరసన వ్యక్తంచేశారు. అయితే తీహార్ లో మాత్రం ఆమె శివకుమారను పరామర్శించినట్టుగా లేరు.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...