Skip to main content

ఆయన తీహార్ లోనే.. సోనియా పరామర్శించలేదా!

ఆయన తీహార్ లోనే.. సోనియా పరామర్శించలేదా!
కర్ణాటక మాజీమంత్రి డీకే శివకుమారకు మరోసారి భంగపాటు ఎదురైంది. ఆయనకు స్పెషల్ కోర్డు బెయిల్ నిరాకరించింది. ఇప్పటికే కొన్నాళ్లుగా పోలీస్ కస్టడీలో ఉన్న ఆయనకు మరికొంతకాలం అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసుల్లో డీకే శివకుమార అరెస్టు అయిన సంగతి తెలిసిందే.
ఆయనను అక్రమంగా అరెస్టు చేశారని కాంగ్రెస్ పార్టీ అంటోంది. దక్షిణాదితో పాటు, గుజరాత్ వరకూ కాంగ్రెస్ కు ట్రబుల్ షూటర్ ఉన్న డీకే శివకుమారను అరెస్టు చేసి కాంగ్రెస్ దెబ్బకొట్టాలని బీజేపీ భావిస్తోందని.. కాంగ్రెస్  నేతలు వాదిస్తూ ఉన్నారు. ఇప్పటికే డీకే అరెస్టుపై కర్ణాటక కాంగ్రెస్ వాళ్లతో పాటు, వక్కలిగ కమ్యూనిటీ కూడా భగ్గుమంది. అయితే ఆయనకు న్యాయస్థానం మాత్రం ఊరటను ఇవ్వలేదు.
ఆయనను తీహార్ జైలుకే పరిమితం చేసింది. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ జాతీయ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ తీహార్ జైలును సందర్శించారు. అక్కడ ఉన్న తమ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి  చిదంబరాన్ని ఆమె పరామర్శించారు.
విశేషం ఏమిటంటే డీకే శివకుమార కూడా అక్కడే ఉన్నారు. ఆయన అరెస్టు పట్ల ఇప్పటికే సోనియాగాంధీ నిరసన వ్యక్తంచేశారు. అయితే తీహార్ లో మాత్రం ఆమె శివకుమారను పరామర్శించినట్టుగా లేరు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...