నట దిగ్గజం అమితాబ్ బచ్చన్ కు కేంద్ర ప్రభుత్వం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించడం పట్ల జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. అమితాబ్ కీర్తికిరీటంలో దాదాసాహెబ్ ఫాల్కే ఓ కలికితురాయి అని అభివర్ణించారు. నటనలో ఆయన తనకంటూ ఓ ప్రత్యేకమైన ఒరవడి సృష్టించుకున్నారని, అంతటి గొప్ప వ్యక్తి సైరా సెట్లో ఎంతో నిరాడంబరంగా కనిపించారని పవన్ కొనియాడారు. సైరా సెట్లో ఆయన తనను పలకరించిన తీరు ఆశ్చర్యానికి గురిచేసిందని, మర్చిపోలేనిదని పేర్కొన్నారు.
నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.
Comments
Post a Comment