Skip to main content

మన దగ్గర రాఫెల్ ఉంటే చైనా, పాకిస్థాన్ పప్పులు ఉడకవు: వాయుసేన చీఫ్

అత్యాధునిక యుద్ధ విమానం రాఫెల్ భారత వాయుసేన సామర్థ్యాలను మరింత విస్తృతం చేస్తుందని నూతన ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా తెలిపారు. ఇప్పటివరకు వాయుసేన చీఫ్ గా పనిచేసిన బీఎస్ ధనోవా నేటితో పదవీవిరమణ చేశారు. ఆయన స్థానంలో భదౌరియా బాధ్యతలు అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, రాఫెల్ అమ్ములపొదిలో ఉండడం వల్ల పాకిస్థాన్, చైనాలపై మనదే పైచేయి అవుతుందని, వాళ్ల పప్పులు వుడకవని స్పష్టం చేశారు.

 "రాఫెల్ అత్యంత సమర్థవంతమైన యుద్ధవిమానం. ఒక్కసారి వాయుసేనలో చేరిందంటే కచ్చితంగా మనదే ఆధిపత్యం అవుతుంది. ఎస్ యూ-30 విమానాలు, ఇతర యుద్ధవిహంగాల కాంబినేషన్లో రాఫెల్ ను ఉపయోగించినప్పుడు ప్రత్యర్థికి అందనంత ఎత్తులో నిలుస్తాం" అని ధీమా వ్యక్తం చేశారు. విశేషం ఏంటంటే, 2016లో రూ.60 వేల కోట్ల విలువైన రాఫెల్ విమానాల ఒప్పందం కుదరడంలో కీలకపాత్ర పోషించింది భదౌరియానే. 36 రాఫెల్ విమానాల కొనుగోలు కోసం ఫ్రాన్స్ వెళ్లిన భారత ప్రతినిధుల బృందానికి ఆయనే చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...