Skip to main content

రేవంత్ రెడ్డికి సోనియా షాక్: హుజూర్ నగర్ టికెట్ ఉత్తమ్ భార్యకే

కాంగ్రెస్  పార్టీ నాయకత్వం రేవంత్ రెడ్డికి షాకిచ్చింది. హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో  కాంగ్రెస్ అభ్యర్ధిగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతికి టిక్కెట్టు కేటాయిస్తూ సోనియాగాంధీ నిర్ణయం తీసుకొన్నారు.
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఉత్తమ్ మాటే నెగ్గింది. కాంగ్రెస్ నాయకత్వం ఉత్తమ్ వైపే నిలిచింది. రేవంత్ కు కాంగ్రెస్ పార్టీ షాకిచ్చింది.

ఈ ఏడాది అక్టోబర్ 21వ తేదీన హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. నల్గొండ ఎంపీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించడంతో హుజూర్‌నగర్ ఎమ్మెల్యే స్థానానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియాగాంధీ హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి పద్మావతి పేరును ఖరారు చేసింది. గత ఎన్నికల్లో ఆమె కోదాడ నుండి పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓటమి పాలయ్యారుహుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానంలో ఎవరిని అభ్యర్ధిగా నిలపాలనే దానిపై కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ ఇటీవల చర్చించింది.ఈ చర్చలో ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతిని బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకొన్నారు.ఉత్తమ్ భార్య పద్మావతిని హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానంలో బరిలో దింపాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యతిరేకించాడు.హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానంలో బరిలోకి ఎవరిని దింపాలనే విషయమై పార్టీలో చర్చే జరగలేదని రేవంత్ రెడ్డి ప్రకటించి సంచలనం సృష్టించారు. అంతేకాదు అసలు పార్టీలో చర్చించకుండానే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏకపక్షంగా అభ్యర్ధిని ప్రకటించారని రేవంత్ రెడ్డి మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి షాకాజ్ నోటీసులు ఇవ్వాలని కూడ ఆయన డిమాండ్ చేశారు.అంతేకాదు హుజూర్‌నగర్ కు చెందిన యూత్ కాంగ్రెస్ నేత చామల కిరణ్ కుమార్ రెడ్డికి హుజూర్‌నగర్ అసెంబ్లీ టిక్కెట్టును ఇవ్వాలని కూడ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం కూడ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టింది.ఈ విషయమై ఎఐసీసీకి నివేదికను కూడ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పంపింది.మరో వైపు తనకు హుజూర్‌నగర్ ‌అసెంబ్లీ స్థానంలో పోటీ చేసే అవకాశం కల్పించాలని యూత్ కాంగ్రెస్ నేత చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ కుంతియాకు ఈ నెల 21వ తేదీన లేఖ రాశాడు.కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్లు కూడ హుజూర్‌నగర్ లో పద్మావతి పేరును సమర్ధించారు. ఉత్తమ్ భార్య పద్మావతిని బరిలో దింపడాన్ని రేవంత్ రెడ్డి వ్యతిరేకించినా కూడ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడ ఉత్తమ్ కు మద్దతుగా నిలిచింది. అయితే ఈ తరుణంలో రేవంత్ రెడ్డి ఏ రకంగా వ్యవహరిస్తారనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Comments

Popular posts from this blog

ఎలన్ మస్క్... స్టార్ షిప్ రెడీ... వచ్చే ఏడాది మార్స్ చెంతకు ప్రయాణం

మార్స్ గ్రహంపైకి వన్ వే ట్రిప్‌గా ఆసక్తి ఉన్న ప్రజలను పంపుతానని ప్రకటించిన ఆమెరికా బిలియనీర్ వ్యాపారి ఎలన్ మస్క్... అన్నంత పనీ చేస్తున్నారు. మనుషుల్ని చందమామ, మార్స్ చెంతకు తీసుకెళ్లడం కోసం ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్... సరికొత్త విమానం తరహా స్పేస్ షిప్‌లను తయారుచేస్తోంది. ఇవి రాకెట్‌‌లా కాకుండా... విమానం లాగా... అంతరిక్షంలోకి వెళ్లి... గ్రహాలపై మనుషుల్ని దించేసి... తిరిగి ఖాళీగా వెనక్కి వచ్చేస్తాయి. గ్రహాలపైకి వెళ్లినవాళ్లు తిరిగి వచ్చే అవకాశాలు లేవు. ఇందుకు రిటర్న్ ట్రిప్ అవకాశం కల్పించట్లేదు ఎలన్ మస్క్. వన్ వే ట్రిప్‌గా వెళ్లేందుకు ఆసక్తి ఉన్నవారే టికెట్ బుక్ చేసుకోమని సూచిస్తున్నారు. తాజాగా ఆయన ఆవిష్కరించిన స్పేస్‌షిప్‌లో వంద మంది ప్రయాణించేందుకు వీలుంది. టెక్సాస్... బోకా చికాలో... ఎంతో మంది అంతరిక్ష ఔత్సాహికులు, రిపోర్టర్ల సమక్షంలో చందమామ, మార్స్‌పైకి పంపే స్టార్ షిప్‌ను ఆవిష్కరించారు ఎలన్ మస్క్. వచ్చే ఆరు నెలల్లో దాన్ని అంతరిక్షంలో ఓ రౌండ్ వేయించి... వచ్చే ఏడాది మనుషులను అందులో పంపాలనుకుంటున్నారు ఎలన్ మస్క్. ఎప్పుడో పదకొండు ఏళ్ల కిందట ఫాల్కన్-1 రాకెట్‌ను తయారుచేసింది స్పేస్ ఎక...

క్రెడిట్ పై పెట్రోలును కొనుగోలు చేస్తే నో క్యాష్‌బ్యాక్‌

క్రెడిట్‌ కార్డులను వినియోగించి పెట్రోలును కొనుగోలు చేస్తే ఇన్నాళ్లూ లభిస్తున్న 0.75 శాతం క్యాష్‌బ్యాక్‌ అక్టోబరు ఒకటో తేది నుంచి ఉండబోదని కంపెనీలు ప్ర‌క‌టించాయి.  2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే డిస్కౌంట్‌ ఇవ్వాలని చమురు కంపెనీలను కోరింది. దీంతో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి  2016 డిసెంబరు నుంచి క్రెడిట్‌, డెబిట్‌, ఈ-వాలెట్ల ద్వారా పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేసే వారికి 0.75శాతం డిస్కౌంట్‌ను క్యాష్‌బ్యాక్‌ రూపంలో  ఇవ్వాల‌ని  చమురు కంపెనీలు క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించిన విష‌యం తెలిసిందే. కాగా వచ్చే నెల ఒకటో తేది నుంచి ఆ డిస్కౌంట్‌ ఉండబోదని తాజాగా కంపెనీలు వెల్లడించాయి. ఇకమీదట డెబిట్‌, ఇతర డిజిటల్‌ పద్ధతుల ద్వారా చెల్లించేవారికి మాత్రం ఈ డిస్కౌంట్‌ యధావిధిగా కొనసాగుతుంది.