Skip to main content

రేవంత్ రెడ్డికి సోనియా షాక్: హుజూర్ నగర్ టికెట్ ఉత్తమ్ భార్యకే

కాంగ్రెస్  పార్టీ నాయకత్వం రేవంత్ రెడ్డికి షాకిచ్చింది. హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో  కాంగ్రెస్ అభ్యర్ధిగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతికి టిక్కెట్టు కేటాయిస్తూ సోనియాగాంధీ నిర్ణయం తీసుకొన్నారు.
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఉత్తమ్ మాటే నెగ్గింది. కాంగ్రెస్ నాయకత్వం ఉత్తమ్ వైపే నిలిచింది. రేవంత్ కు కాంగ్రెస్ పార్టీ షాకిచ్చింది.

ఈ ఏడాది అక్టోబర్ 21వ తేదీన హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. నల్గొండ ఎంపీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించడంతో హుజూర్‌నగర్ ఎమ్మెల్యే స్థానానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియాగాంధీ హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి పద్మావతి పేరును ఖరారు చేసింది. గత ఎన్నికల్లో ఆమె కోదాడ నుండి పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓటమి పాలయ్యారుహుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానంలో ఎవరిని అభ్యర్ధిగా నిలపాలనే దానిపై కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ ఇటీవల చర్చించింది.ఈ చర్చలో ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతిని బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకొన్నారు.ఉత్తమ్ భార్య పద్మావతిని హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానంలో బరిలో దింపాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యతిరేకించాడు.హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానంలో బరిలోకి ఎవరిని దింపాలనే విషయమై పార్టీలో చర్చే జరగలేదని రేవంత్ రెడ్డి ప్రకటించి సంచలనం సృష్టించారు. అంతేకాదు అసలు పార్టీలో చర్చించకుండానే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏకపక్షంగా అభ్యర్ధిని ప్రకటించారని రేవంత్ రెడ్డి మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి షాకాజ్ నోటీసులు ఇవ్వాలని కూడ ఆయన డిమాండ్ చేశారు.అంతేకాదు హుజూర్‌నగర్ కు చెందిన యూత్ కాంగ్రెస్ నేత చామల కిరణ్ కుమార్ రెడ్డికి హుజూర్‌నగర్ అసెంబ్లీ టిక్కెట్టును ఇవ్వాలని కూడ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం కూడ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టింది.ఈ విషయమై ఎఐసీసీకి నివేదికను కూడ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పంపింది.మరో వైపు తనకు హుజూర్‌నగర్ ‌అసెంబ్లీ స్థానంలో పోటీ చేసే అవకాశం కల్పించాలని యూత్ కాంగ్రెస్ నేత చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ కుంతియాకు ఈ నెల 21వ తేదీన లేఖ రాశాడు.కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్లు కూడ హుజూర్‌నగర్ లో పద్మావతి పేరును సమర్ధించారు. ఉత్తమ్ భార్య పద్మావతిని బరిలో దింపడాన్ని రేవంత్ రెడ్డి వ్యతిరేకించినా కూడ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడ ఉత్తమ్ కు మద్దతుగా నిలిచింది. అయితే ఈ తరుణంలో రేవంత్ రెడ్డి ఏ రకంగా వ్యవహరిస్తారనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Comments

Popular posts from this blog

అత్యంత కష్టం మీద బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం బృందం

నెలరోజులకు పైగా గోదావరి నదీ గర్భంలోనే ఉండిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటికి తీశారు. ధర్మాడి సత్యం బృందం తీవ్ర ప్రయాసలకోర్చి బోటు ఆచూకీ గుర్తించడమే కాకుండా దాన్ని పైకి తీసుకువచ్చారు. మరికాసేపట్లో బోటును ఒడ్డుకు చేర్చనున్నారు. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మొదట కొన్ని భాగాలుగా విడిపోయినా, ఆ తర్వాత మరోసారి ఐరన్ రోప్ లు బిగించి మొత్తం బోటును వెలికి తీశారు. గోదావరి ఉపరితలంపైకి చేరిన బోటును మరో రెండు గంటల్లో తీరానికి చేర్చే అవకాశాలున్నాయి.

మీడియాపై మాకు గౌరవముంది: కోటంరెడ్డి

  కొన్ని పత్రికలు, ఛానల్స్ తమ పాలనపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని  వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మీడియాపై తమకు గౌరవం ఉందని, అది ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. జీవో 2430 కొత్తగా తీసుకొచ్చింది కాదని, ఎప్పటినుంచో అది ఉందని తెలిపారు.  ఈ రోజు కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొన్ని పత్రికలు, ఛానల్స్ పనికట్టుకుని తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తున్నాయన్నారు. తప్పుడు వార్తలు రాసేవారు భయపడాలని పేర్కొన్నారు. ఒకప్పుడు సాక్షి మీడియాను చంద్రబాబు అనుమతించనప్పుడు ఈ ఉద్యమ నేతలు ఎటుపోయారని నిలదీశారు. లోకేశ్ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మంగళగిరి నియోజక వర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా లోకేశ్ కు తెలియదని విమర్శించారు. తమ పాలనను చంద్రబాబు సహించలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, తన హయాంలో తన కొడుకు లోకేశ్ తో కలిసి దోచుకుని లోటు బడ్జెట్ ను చూపెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నారని చెప్పారు.  చంద్రబాబుకు చదువుకునేటప్పటి నుంచే కులపిచ్చి ఉందని పేర్కొన్నారు. స్థాని...