Skip to main content

టీడీపీ నేత కూన రవికుమార్‌కు ఊరట: ముందస్తు బెయిల్ ఇచ్చిన హైకోర్టు

Ex tdp MLA kuna ravi kumar gets anticipatory bail

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు ఊరట లభించింది. అధికారులను దూషించిన కేసులో ఆయనకు హైకోర్టులో ముందస్తు బెయిల్ లభించింది. తనను మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమారర్ దూషించారంటూ బుజ్జిలి ఎంపీడీవోదామోదరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో కూన రవికుమార్ తోపాటు 11 మంది టీడీపీ నేతలపై కేసు నమోదు చేసిన పోలీసులు...10 మందిని అరెస్ట్ చేసి ఆముదాలవలస కోర్టులో హాజరుపరిచారు. వారందరికి జూనియర్‌ సివిల్‌ జడ్జి బి.జ్యోత్స్న సెప్టెంబర్ 11 వరకు రిమాండ్ విధించారు. 
మరోవైపు కూన రవికుమార్ అరెస్ట్ పై శ్రీకాకుళం జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు కూనను అరెస్ట్ చేసేందుకు విస్తృతంగా ప్రయత్నిస్తున్నారు.
గాలింపు చర్యలు చేపడుతున్నారు. కూన రవికుమార్ బంధువుల గురించి ఆరా తీస్తున్నారు.  తన అరెస్ట్ కు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న కూన రవికుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

చైనాకు షాక్ : వాటిపై పెరగనున్న సుంకం

విదేశాల నుంచి దిగుమతయ్యే యాక్టివ్‌ ఫార్మాసూటికల్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ (ఏపీఐ) దిగుమతులపై భారత  ప్రభుత్వం త్వరలోనే షాక్ ఇవ్వనుంది. ఏపీఐ దిగమతులపై కస్టమ్స్ సుంకాన్ని10 నుంచి 15 శాతం దాకా  పెంచాలని  ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ) యోచిస్తోంది. ముడి ఔషధాల (ఏపీఐ) దేశీయ తయారీని ప్రోత్సాహం ఇవ్వడంతోపాటు,చైనాపై అధికంగా ఆధారపడటాన్ని తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనుంది. ఏపీఐ దిగుమతులపై సుంకాన్ని 20-25 శాతంగా ఉంచేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రస్తుతం ఇది 10 శాతం మాత్రమే. భారత్-చైనా సరిహద్దు వివాదం, ఇటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ అటు ప్రధానంగా ఏఐపీల కోసం చైనాపై అధికంగా ఆధారపడుతున్న తరుణంలో ఇది చైనాకు ప్రతికూలంగా మారనుంది.   ప్రస్తుతం, భారతదేశం 68 శాతం ఏపీఐలు, 90 శాతం కంటే ఎక్కువ యాంటీబయాటిక్‌లను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా  వాల్యూమ్ పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్దది. క్లిష్టమైన కీ స్టార్టింగ్ మెటీరియల్స్ (కెఎస్ఎం), డ్రగ్ ఇంటర్మీడియట్...